అన్వేషించండి

AP Telangana Breaking News: నోవాటెల్ హోటల్ లో జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

LIVE

Key Events
AP Telangana Breaking News: నోవాటెల్ హోటల్ లో జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ

Background

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శంషాబాద్‌ జోన్‌ను పునర్విభజన చేశారు. శంషాబాద్ జోన్ ను రెండు జోన్లుగా విభజిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రస్తుతం ఉన్న శంషాబాద్‌ జోన్‌ను రెండుగా విభజించి, కొత్తగా రాజేంద్రనగర్‌ జోన్‌ను ఏర్పాటు చేశారు. దాంతో ఇకనుంచి రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లుగా సేవలు అందించనున్నాయి. ప్రభుత్వం విభజించిన ప్రకారం ఈ కొత్త జోన్‌ రాజేంద్రనగర్ లో చేవెళ్ల, రాజేంద్రనగర్‌ డివిజన్లు ఉంటాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర డీజీపీ తెలంగాణ ప్రభుత్వానికి శంషాబాద్ జోన్ పునర్ విభజనపై రిపోర్ట్ అందించారు. దీనికి సానుకూల నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్‌ను శంషాబాద్, రాజేంద్ర నగర్ రెండు జోన్లుగా విభజించింది. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం  క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కర్ణాటక నుంచి కొమోరిస్ ప్రాంతం వరకు, దక్షిణ కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ఉన్న సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, యానాంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో ఆగస్టు 31 వరకు కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ కావడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.  
తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో ఈ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆగస్టు 31 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌ను మేఘాలు కమ్మేశాయి. నగరంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 24, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు నమోదైంది. పశ్చిమ దివ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. 

అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్ష సూచనతో ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆగస్టు 31 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.

బులియన్ మార్కెట్‌లో గత వారం తగ్గిన బంగారం ధరలు ఈ వారం పెరుగుతున్నాయి. ధర తగ్గడంతో ఇటీవల బంగారం కొనుగోళ్లు పెరిగాయి. తాజాగా వరుసగా మూడోరోజు పసిడి ధర ఎగబాకింది. పసిడి బాటలోనే వెండి పయనిస్తోంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.160 మేర పెరగడంతో ఇక్కడ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,980 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 గా ఉంది. హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర నేడు రూ.61,300గా ఉంది. నేడు రూ.200 మేర ధర పెరిగింది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.52,980 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,650 గా ఉంది. ఈ పట్టణాల్లో వెండి నేడు వెండి 1 కేజీ ధర రూ.61,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఏపీలో బంగారం ధరలు.. 
ఏపీలో బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 27 August 2022) 10 గ్రాముల ధర రూ.52,980 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,650 గా ఉంది. రూ.200 పెరగడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.61,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

19:49 PM (IST)  •  27 Aug 2022

నోవాటెల్ లో జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ

Hero Nithin : హైదరాబాద్ నోవాటెల్ లో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ అయ్యారు. తెలంగాణ పర్యటనలో ఉన్న జేపీ నడ్డా శనివారం ఉదయం మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ తో సమావేశం అయ్యారు. 

19:46 PM (IST)  •  27 Aug 2022

సెప్టెంబర్ 12 నుంచి నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర

Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఖరారు అయింది. సెప్టెంబర్ 12 నుండి నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానుందని బీజేపీ ప్రకటించింది. 

14:56 PM (IST)  •  27 Aug 2022

ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ. రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.

రామగుండం ఎరువుల పరిశ్రమలో ఉద్యోగాల నియామకంలో. జరిగిన అవకతవకలపై బాద్యులను శిక్షించాలనీ, ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబాన్ని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి లేఖలో  సిఎం కేసిఆర్ ను డిమాండ్ చేశారు. మొత్తం 5 డిమాండ్లను ఆయన పెట్టారు. 

డిమాండ్లు...

1. అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యే చందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ లను బర్తరఫ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి విచారన జరపాలి 

2. ఉద్యోగాలు తొలగించిన అందరికి తిరిగి ఉద్యోగాలు ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి.

3. మృతులు హరీష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. 50 లక్షల నష్టపరిహారాన్ని ఇస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.

4. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్, కవ్వం పల్లి సత్యనారాయణ, అది శ్రీను,  తదితరులను వెంటనే విడుదల చేయాలి.

5. మొత్తం వ్యవహారం లో కేసీఆర్ స్పందించి సమగ్ర విచారణ చేయాలి..

14:46 PM (IST)  •  27 Aug 2022

Praja Sangrama Yatra: ముగిసిన బండి సంజయ్ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర

* దిగ్విజయంగా ముగిసిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర.
 * భద్రకాళి అమ్మవారి పాదాల చెంత వరకు పాదయాత్ర కొనసాగించిన బండి సంజయ్.
*  3వ విడత చివరి రోజు 14 కిలోమీటర్లు నడిచిన బండి సంజయ్
* మరి కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఇతర జాతీయ నేతలతో కలిసి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొనున్న బండి సంజయ్...

12:34 PM (IST)  •  27 Aug 2022

ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో చిరుత కళేబరం కలకలం

చిత్తూరు : ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో చిరుత పులి కళేబరం కలకలం రేపుతుంది..కుప్పంకు సమీపంలోని సారెకల్‌ అటవీ ప్రాంతంలో చిరుత కళేబరాన్ని పశువుల కాపరులు గుర్తించారు.. గత కొద్ది‌ రోజుల క్రితం చిరుత మృతి చేందినట్లు గుర్తించిన పశువుల కాపరులు అటవీ శాఖా అధికారులకు సమాచారం అందించారు.. విషయం తెలుసుకున్న అటవీ శాఖా అధికారులు ఘటన స్ధలంకు చేరుకుని చిరుత పులి కళేబరాలను పరిశీలించారు.. దీనిపై కేసు నమోదు చేసిన అటవీ శాఖా సిబ్బంది, చిరుత పులి మృతికి గల‌ కారణాలపై ఆరా తీస్తున్నారు.. సారెకల్‌ అటవీ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా వేటగాళ్లు సంచరిస్తున్నట్లు స్ధానికుల సమాచారం మేరకు అటవీ శాఖా అధికారులు పలుకోణాల్లో దర్యాప్తు సాగుస్తున్నారు..

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget