అన్వేషించండి

Janasena Protest: రాష్ట్రవ్యాప్తంగా జనసేన ఆందోళన - పలుచోట్ల పోలీసులకు, జనసేన నాయకులకు మధ్య తోపులాట

Janasena Protest: గుంటూరులో జనసేన నాయకులు, పోలీసులకు మధ్య జరుగుతున్న తోపులాటతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన కార్యకర్తలు సీఎం జగన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. 

Janasena Protest: తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జనసేన నిర్వహించిన నిరసనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాలంటీర్లుపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ.. వాలంటీర్లు వపన్‌ కళ్యాణ్‌ ఫొటోను చెప్పులతో కొట్టారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జనసేన కార్యకర్తలు.. వాలంటీర్ల ఆందోళనను నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్‌ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, వీర మహిళలు పెద్ద ఎత్తున హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి జగన్‌ దిష్టి బొమ్మను దగ్ధం చేయబోయారు. కానీ అప్పటికే ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈక్రమంలోనే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

పోలీసులు దిష్టిబొమ్మను లాగి పడేశారు. జనసేన నాయకులు మాత్రం ఆ దిష్టి బమ్మను లాక్కుని అంటించేందుకు తెగ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో.. జనసేన పార్టీ నాయకులు రాజబాబు తదితరులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌ కి తరలించారు. కేవలం రాజుబాబును మాత్రమే కాకుండా మరికొంత మంది నాయకులను కూడా అరెస్ట్ చేశారు. దీనిని నిరసిస్తూ జన సైనికులు, వీర మహిళలు పోలీస్‌ స్టేషన్‌ ముందు బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

అలాగే గుంటూరు జిల్లాలో కూడా తీవ్ర  ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ కూడలిలో జనసేన కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఇక్కడ కూడా జనసైనికులు సీఎం దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా... తీవ్ర పెనుగులాట జరిగింది. 

వివాదం ఎలా ప్రారంభం అయిందంటే?

మరోవైపు ఏపీలో ఒంటరి మహిళల సమాచారం...  సంఘ విద్రోహ శక్తులకు చేర వేస్తున్నారని.. పవన్ కల్యాణ్ ఆరోపించడంతో వివాదం ప్రారంభమయింది.  వాలంటీర్లు సేకరించే అతి సున్నితమైన సమచారాన్ని ప్రభుత్వంలో పని చేసే కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు.  అందర్నీ అనట్లేదు కానీ కొందరు వ్యక్తులు ఆడపిల్లలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.   కేంద్రంలోని చాలా పెద్ద స్థాయి నిఘా సంస్థల్లో పని చేసే వ్యక్తులు కూడా రాష్ట్రంలో ఆడపిల్లల అదృశ్యాలకి కొందరు రాజకీయ నాయకులకు సంబంధం ఉంది అని చెప్పారని అంటున్నారు.  అందుకే వాలంటీర్లకు సమాచారం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సున్నితమైన సమాచారాన్ని ఇవ్వకండని ప్రజలకు పిలుపునచ్చారు.  ఈ విషయం చెప్పినందుకు నువ్వు నా మీద ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సవాల్ చేశారు. 
 
ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు సమాచారం ఎలా తీసుకుంటారు ? 

వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ప్రజల సమాచారం ఎలా తీసుకుంటారని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తున్నారు.  ఒక MRO తప్పు చేస్తే పై అధికారికి కంప్లైంట్ చేయచ్చు మరి వాలంటీర్లు తప్పు చేస్తే ఎవరికి చెప్పాలి?  వాలంటీర్లకు ప్రజల డబ్బుతో జీతాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్క వాలంటీర్ సమాచారం ఎస్పీ, కలెక్టర్ ఆఫీసుల్లో పెట్టండి. కంప్లైంట్ల కోసం వాట్సాప్ గ్రూప్, టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి. "హిట్లర్ నిఘా వ్యవస్థ లాగా జగన్ వాలంటీర్ వ్యవస్థ మారుతుంది జాగ్రత్త" అని  హెచ్చరిస్తున్నారు.   ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా సమాంతరంగా ఇంకో వ్యవస్థను నడపడం కేవలం ప్రజలను కంట్రోల్ చేయడానికే వాలంటీర్లు సేకరించే సమాచారంతో రాష్ట్రంలో ఏ మూలన వైసీపీ వ్యతిరేకులు ఉన్నారో జగన్ గమనిస్తున్నాడు. జర్మనీలో హిట్లర్ ఇలానే చేసేవారంటన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Vijayawada Airport ATC Tower: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ - అత్యాధునిక ఏటీసీ టవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ - అత్యాధునిక ఏటీసీ టవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
Tragedy in Polavaram: గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget