అన్వేషించండి

Pawan Kalyan: దోచుకున్న ఆస్తులకు చట్టబద్ధత కోసమే 'భూరక్ష' తెచ్చారా.? - న్యాయవాదుల ఆందోళనకు జనసేనాని పవన్ మద్దతు

Andhra News: సమగ్ర భూరక్ష చట్టంపై న్యాయవాదుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Pawan Kalyan Comments on New Land Right Act: రాష్ట్రంలో సమగ్ర భూరక్ష చట్టం వల్ల న్యాయవాదులకు అనేక ఇబ్బందులు వస్తాయని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. గుంటూరు, విజయవాడ బార్ అసోసియేషన్ల న్యాయవాదులు శుక్రవారం జనసేన కార్యాలయంలో పవన్, నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ను కలిశారు. ఈ సమావేశంలో పలువురు సభ్యులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ హక్కుల చట్టం, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తమ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని పవన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సమగ్ర భూరక్ష చట్టంలో (New Land Act) లోపాలపై న్యాయవాదులతో చర్చించారు. సర్కార్ తీసుకొచ్చిన కొత్త చట్టంపై ఆందోళన వ్యక్తం చేసిన జనసేనాని.. న్యాయవాదుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

అందుకే తీసుకొచ్చారా.?

న్యాయవాదులతో సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. విశాఖలో (Visakha) దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారా.? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుషికొండను (Rushikonda) దోచుకుని నచ్చిన వారికి రాసుకోవచ్చని.. సమగ్ర భూరక్ష చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. 'సమగ్ర భూరక్ష చట్టం వల్ల న్యాయవాదులకు అనేక ఇబ్బందులు వస్తాయి. నా భూమిపై నీ హక్కు ఏంటనేది ఇక్కడి సమస్య. ఈ చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. రెవెన్యూ అధికారుల సాయంతో ఆస్తులు దోచుకోవచ్చు. కోర్టు నుంచి న్యాయ రక్షణ పొందవచ్చు అనే దాన్ని ఇందులో లేకుండా చేశారు. సమగ్ర భూరక్షలో కోర్టుల మధ్యవర్తిత్వాన్ని తీసేశారని, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తుంది.' అని పేర్కొన్నారు. 

జగన్ బొమ్మ ఎందుకు.?

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారసత్వంగా వచ్చే పట్టా పుస్తకాల్లో సీఎం జగన్ (CM Jagan) ఫోటో ఉండడం ఏంటి.? అని పవన్ విస్మయం వ్యక్తం చేశారు. 'భూ హక్కు చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ఎవరి ఆస్తులైనా వారి కబంద హస్తాల్లో పెట్టుకునేలా చట్టం చేశారు. చట్టంలోని అంశాలను ముందుగానే అమలు చేసేస్తున్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల నుంచి న్యాయవాదుల వరకూ ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది. సమగ్ర భూరక్షకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు సంపూర్ణ మద్దతు ఇస్తా. ఈ అంశంపై మరింత అధ్యయనం చేస్తాను. సగటు మనిషికి సులువుగా అర్థం అయ్యేలా వివరిస్తాను. ఇందుకు కొంత సమయం పడుతుంది.' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై న్యాయవాదులంతా కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసంర ఉందని జనసేన లీగల్ సెల్ ఛైర్మన్ ప్రతాప్ అన్నారు. ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే విధానమని, ఈ చట్టం వల్ల తీవ్రంగా నష్టపోతామని వివరించారు. జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. నిపుణులతో చర్చించకుండానే.. ప్రభుత్వం ఏకపక్షంగా చట్టం చేసిందని మండిపడ్డారు. హైకోర్టులో ఇంకా అమల్లో లేదని చెబుతూనే, క్షేత్రస్థాయిలో మాత్రం అమలు చేస్తున్నానరి ఆరోపించారు. ప్రజలను, కోర్టును ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Amaravati Case : ఆర్‌ 5 జోన్‌లో ఇళ్లపైనా ఏపీ సర్కార్‌కు నిరాశే - ఏప్రిల్‌కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు !

 

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget