అన్వేషించండి

TTD Board : టీటీడీ బోర్డులో 18 మందికి హైకోర్టు నోటీసులు ! నియామకం చెల్లని హైకోర్టులో పిటిషన్..

టీటీడీ బోర్డులో 18 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారు పదవులకు అర్హులు కాదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో వారిని ప్రతివాదులుగా చేర్చేందుకు అంగీకరించింది.


తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల నియామకంపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలయింది. సభ్యులను నియమిస్తూ జారీ చేసిన జీవోను చట్ట విరుద్ధంగా పేర్కొంటూ లాయర్ అశ్వనీకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. బోర్డులోని 14 మందికి నేర నేరచరిత్ర ఉందని, మరో నలుగురిని రాజకీయ కారణాలతో నియమించారని అశ్వనీకుమార్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జరిగిన విచారణలో ఈ 18 మందిని ప్రతివాదులుగా చేర్చాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనికి హైకోర్టు అంగీకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. 

Also Read : శ్రీశైలంలో దొంగనోట్ల చెలామణి.. బైకుపై వెంబడించిన బంకు సిబ్బంది.. చివరికి ఏం జరిగిందంటే!

దసరా సెలవుల అనంతరం కేసు విచారణను కొనసాగిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే 18 మందిని ప్రతివాదులుగా చేర్చడంపై తిరుమల తిరుపతి దేవస్థానం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. నియామకాలతో వారికేం సంబంధం లేదని వాదించారు. అయితే.. హైకోర్టు మీరెందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని టీటీడీ లాయర్‌ను ప్రశ్నించింది. ప్రతివాదులకు ఏమైనా అభ్యంతరాలుంటే హైకోర్టుకు వారే చెప్పాలని సూచించింది. దసరా సెలవుల తర్వాత విచారణ కొనసాగనుంది. 

Also Read: విశాఖలో బాలిక అనుమానాస్పద మృతి.. మిస్సైన కొద్ది గంటలకే శవంగా..

ఇప్పటికి హైకోర్టులో  టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై విచారణ జరుగుతోంది. వివాదాస్పదంగా మారిన టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల జీవోను హైకోర్టు నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. పాలక మండలితో పాటు విడిగా 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో జారీ చేసింది. అయితే ఇది ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987కు విరుద్ధమని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. టీడీపీ, బీజేపీ నేతలతో పాటు పలువురు హిందూ సంస్థల ప్రతినిధులు కూడా పిటిషన్లు వేశారు.  వీటిపై విచారణ జరిపిన హైకోర్టు జీవోను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.  

Also Read : తప్పయింది.. ఇక ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులేయం ! హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ప్రమాణపత్రం ! 

టీటీడీ బోర్డును ప్రకటించినప్పటి నుండి తీవ్ర వివాదాస్పదమవుతోంది. రాజకీయ అవసరాల కోసం, లాబీయింగ్ చేసే వారిని, వివిధ కేసుల్లో ఉన్న వారిని పవిత్రమైన ఆలయంలో పాలక మండలి సభ్యులుగా చేర్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ట్రస్ట్ బోర్డును రద్దు చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం గవర్నర్ ను కలిసి ఇదే అంశం పైన ఫిర్యాదు చేశారు. ఇప్పుడీ అంశం కోర్టుకు చేరింది. అయితే ఇప్పటికే సభ్యులందరూ ప్రమాణస్వీకారం చేశారు. 

Also Read : "రిపబ్లిక్" సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం ! అసలు వివాదం ఏమిటంటే ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Embed widget