అన్వేషించండి

AP High Court: జగన్ కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను బెయిల్‌పై విచారణ వాయిదా

AP High Court: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం, కోడికత్తి కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

AP High Court: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం, కోడికత్తి కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు శ్రీనివాసరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఎన్ఐఏ తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 15కి వాయిదా వేసింది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయనపై శ్రీనివాసరావు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పిటిషనర్ శ్రీనివాసరావు నాలుగేళ్లకు పైగా జైల్లోనే మగ్గుతున్నాడని అతడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

గతంలో విశాఖ ఎన్ఐఏ కోర్టులో విచారణ
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఐదేళ్ల కిందట విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి దాడి కేసు విచారణ గతంలో విశాఖ ఎన్ఐఏ కోర్టులో జరిగేది. దాని కంటే ముందు విజయవాడలో జరిగేది. ఆ సమయంలో సీఎం కోర్టుకు హాజరు కావాలని లేదా బెయిల్ వచ్చేలా ఎన్వోసీ ఇవ్వాలని జనపల్లి శ్రీనివాసరావు తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ కేసు ఐదేళ్ల నుంచి కొనసాగుతున్నా నేటికీ నిందితుడు శ్రీనుకు బెయిల్ మంజూరు కాలేదు. 

ఈ కేసులో కుట్ర కోణం లేదని ఇప్పటికే తేల్చిన ఎన్ఐఏ.. చార్జిషీటు  దాఖలు చేసింది. జగన్ NOC అయినా ఇవ్వాలని లేదా, వాదనలైనా వచ్చి వినిపించాలని.. నిందితుడి తరపు న్యాయవాది కోరారు. కేసులో కుట్ర కోణం లేదని ఇప్పటికే ఎన్ఐఏ చెప్పిందని..  రాజకీయాల కోసమే కేసును వాయిదా వేస్తున్నట్లున్నారన్నని ఆయన అసహనం వ్యక్తం చేశారు.  వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఈ అంశాన్ని వాడుకోవాలని చూస్తున్నారేమోనని శ్రీను తరపు న్యాయవాది అనుమానం వ్యక్తం చేశారు. 

సుప్రీంకోర్టు జడ్జికి లేఖ
ఐదేళ్లుగా జైల్లో ఉన్నా ఇంకా ఎంత కాలం జైలులో ఉండాలో తెలియడం లేదని..  విముక్తి కల్పించాలంటూ జనపల్లి శ్రీనివాసరావు గతంలో సుప్రీంకోర్టు జడ్జికి కూడా లేఖరాశారు.  కేసును జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ విచారించి న్యాయం చేయాలని కోరారు. న్యాయం చేయాలని అనేక మార్లు కోర్టుకు విన్నవించాన, అయినా స్పందన లేకపోవడంతో  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తున్నానని ఆయన వాపోయారు.  శ్రీనివాసరావు  తల్లి సావిత్రి.. గతంలో సీజేఐగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణకు ఇదే విషయంపై లేఖ రాశారు.  
  
చార్జిషీటు దాఖలు చేసిన ఎన్‌ఐఏ 
వేగంగా విచారణ జరిగిన ఎన్‌ఐఏ 2019లోనే చార్జిషీటు దాఖలుచేసింది.  ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా జనిపల్లి శ్రీనివాసరావును పేర్కొన్నారు. చార్జిషీటుతో పాటు నిందితుడు శ్రీనివాసరావు విశాఖ జైల్‌లో రాసుకున్న 22 పేజీల లేఖను కూడా కోర్టుకు అందజేశారు. తుది చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ విచారణ కొనసాగుతుందని ఎన్ఐఎ అధికారులు పేర్కొన్నారు. జగన్‌పై దాడి చేసే ముందు రోజు ఎయిర్‌పోర్టు ఫుడ్ కోర్టులో తోటి ఉద్యోగులతో జగన్‌ గురించి శ్రీనివాసరావు చర్చించినట్లు పేర్కొంది.

ఈ సందర్భంగా జగన్‌తో సెల్ఫీ తీసుకునే అవకాశం ఇవ్వాలని వారిని కోరినట్లుగా చెప్పింది. ఇందుకోసం వైసీపీలో ఎవరితోనైనా మాట్లాడాలని సహా ఉద్యోగి హేమలతను శ్రీనివాసరావు కోరాడని స్పష్టం చేసింది. సెల్ఫీ తీసుకునే అవకాశం ఉంటుందని, అందుకోసం తాను మాట్లాడతానని హేమలత భరోసా ఇచ్చినట్లుగా వివరించింది. పార్టీ నేతలతో కలిసి జగన్‌ వీఐపీ లాంజ్‌లో ప్రవేశించాక వారికి అల్పాహారం అందించేందుకు శ్రీనివాసరావు ఫుడ్‌ కోర్టు సిబ్బందితో కలిసి లోనికి వెళ్లినట్లుగా చార్జిషీట్‌లో స్పష్టం చేసింది.

ఫైబర్‌ నెట్‌ కేసు.. ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ పిటిషన్‌
ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ వేసింది. ఆస్తుల అటాచ్‌మెంట్‌ కోసం ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. టెరాసాఫ్ట్‌కు చెందిన 7 ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ ప్రతిపాదించింది. ఈ మేరకు అనుమతివ్వాలని కోర్టును కోరింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Ayyappa Deeksha Rules: అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
Pantangi Toll Plaza: హైదరాబాద్‌- విజయవాడ హైవేపై సరికొత్త విప్లవం- సంక్రాంతి రద్దీ క్లియర్ చేయడానికి శాటిలైట్ సాయం 
హైదరాబాద్‌- విజయవాడ హైవేపై సరికొత్త విప్లవం- సంక్రాంతి రద్దీ క్లియర్ చేయడానికి శాటిలైట్ సాయం 
The Raja Saab Movie Review - 'ది రాజా సాబ్' రివ్యూ: నటనలో ప్రభాస్ హుషారు, ఆ లుక్కు సూపరు... మరి ఫాంటసీ హారర్ కామెడీ హిట్టేనా?
'ది రాజా సాబ్' రివ్యూ: నటనలో ప్రభాస్ హుషారు, ఆ లుక్కు సూపరు... మరి ఫాంటసీ హారర్ కామెడీ హిట్టేనా?
WPL 2026: మహిళల ప్రీమియర్ లీగ్ నేటి నుంచి ప్రారంభం, ఏ జట్టు అత్యుత్తమమో చెప్పిన అంజుమ్ చోప్రా
మహిళల ప్రీమియర్ లీగ్ నేటి నుంచి ప్రారంభం, ఏ జట్టు అత్యుత్తమమో చెప్పిన అంజుమ్ చోప్రా
Embed widget