అన్వేషించండి

Ganesh chaturdhi 2021: వినాయక చవితి వేడుకలకు అనుమతులు ఇవ్వండి... గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు... సీఎం జగన్ కు టీడీపీ నేతలు లేఖ

వినాయక చవితి వేడుకలపై ఏపీలో వివాదం నెలకొంది. వేడుకలకు అనుమతులు ఇవ్వాలని బీజేపీ నేతలు గవర్నర్ కలిశారు. అలాగే టీడీపీ నేతలు సీఎం జగన్ కు లేఖ రాశారు.

ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పాతురి నాగభూషణం, సత్యమూర్తి, వీహెచ్‌పీ నేతలు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం అనుమతి నిరాకరణపై గవర్నర్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా చవితి మండపాలు ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వానికి సూచించాలని గవర్నర్‌ను నేతలు కోరారు.  అధికార వైసీపీ హిందూ సంప్రదాయాలను కించపరస్తుందని బీజేపీ నేతలు ఆరోపించారు. గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మార్యదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. 


Ganesh chaturdhi 2021: వినాయక చవితి వేడుకలకు అనుమతులు ఇవ్వండి... గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు... సీఎం జగన్ కు టీడీపీ నేతలు లేఖ

సీఎం జగన్ కు టీడీపీ నేతలు లేఖ

వినాయక చవితి వేడుకలు ఏపీలో హాట్ టాఫిక్​గా మారాయి.  బహిరంగ వేడుకలపై సర్కార్ ఆంక్షలు విధించటం పెద్ద దుమారం రేపుతోంది. బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే హిందూ ధార్మిక సంస్థలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తు్న్నాయి. ఇతర పండుగలకు లేని ఆంక్షలు కేవలం హిందూ పండుగలకే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలకు అడ్డురాని నిబంధనలు వినాయక చవితికి ఎందుకని ప్రశ్నించారు. తాజాగా సీఎం జగన్ 175 నియోజకవర్గాల టీడీపీ ఇన్ ఛార్జిలు లేఖ రాశారు. 

Also Read : వినాయక చవితి వేడుకలపై ఆంక్షల వివాదం ! ప్రభుత్వం చెప్పిందేంటి ? విపక్షాల విమర్శలేంటి..?


Ganesh chaturdhi 2021: వినాయక చవితి వేడుకలకు అనుమతులు ఇవ్వండి... గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు... సీఎం జగన్ కు టీడీపీ నేతలు లేఖ

ప్రజాగ్రహానికి గురికాక తప్పదు

వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం సంస్కృతి, సంప్రదాయంగా వస్తున్నదని లేఖలో టీడీపీ నేతలు తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ ఉత్సవాలు నిషేధించలేదని తెలిపారు. తెలంగాణలో కూడా ఆంక్షలు లేవన్నారు. ఏపీలోనే ఆంక్షలు విధించడం దురుద్దేశపూరితమన్నారు. ఈ నిర్ణయం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. వై.ఎస్ వర్ధంతి సభలు ఇడుపులపాయతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్దస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించారని గుర్తుచేశారు. స్కూళ్లు ప్రారంభించవద్దని తల్లిదండ్రులు, నిపుణులు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం మెండిగా స్కూళ్లు తెరిచి విద్యార్థులు కరోనా బారిన పడేలా చేసిందన్నారు. కరోనా ఉన్నా మద్యం షాపులు ప్రారంభించారని, మద్యం షాపుల వద్ద పెద్ద ఎత్తున గుమికూడుతున్నా అప్పుడు పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు కరోనా చర్యలు అంటే విడ్డూరంగా ఉందన్నారు. 

'ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజల్లో నిరసన వ్యక్తమవుతుంది. పన్నుల పెరుగుదల, మద్యం, ఇసుక రేట్లు పెరుగుదల, రోడ్లు, మహిళలపై అత్యాచారాలు, సీపీఎస్, పీఆర్సీ, మైనింగ్ కుంభకోణాలపై జరుగుతున్న చర్చలు, నిరసనల్ని పక్కదారి పట్టించేందుకే వినాయక ఉత్సవాలను రద్దుచేశారు. మత, కుల, ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు. జాతీయోద్యమంలోనే వినాయక ఉత్సవాలలో మతాలకు అతీతంగా అన్ని మతాల వారు పాల్గొన్నారు. కాబట్టి మీరు స్వార్థ రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి ఈ ఉత్సవాలకు అనుమతి ఇవ్వకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు' ---టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జులు

 

Also Read: గుంటూరులో చెత్త తరలించే ట్రాక్టర్ లో గణేష్ విగ్రహాలు... పారిశుద్ధ్య సిబ్బంది అత్యుత్సాహం... ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన కమిషనర్

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget