అన్వేషించండి

AP Voters List : ఏపీలో 27 లక్షలకుపైగా అనుమానాస్పద ఓట్లు - ఎంపీ రఘురామకు ఎన్నికల సంఘం రిప్లయ్ !

ఏపీలో ఓటర్ల జాబితా అంశంపై రఘురామకు ఈసీ సమాచారం పంపింది. దాదాపుగా 27 లక్షల అనుమానాస్పద ఓట్లు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలిపింది.


AP Voters List : ఏపీలో దొంగ ఓట్లు ఎక్కువగా నమోదవుతున్నాయని  కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదుపై విచారణ జరిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో జీరో హౌస్ నెంబర్ పై 2,51,767 ఓట్లు, పది ఓట్లకు మించి ఒకే డోర్ నెంబర్ పై 1,57,939 ఇళ్ళలో 24,61,676 దొంగ ఓట్లు నమోదైనట్టు గుర్తించామని సమాచారం పంపింది.  వీటిలో ఇప్పటి వరకు జీరో హౌస్ నెంబర్ పై నమోదైన 61,374 దొంగ ఓట్లను, పది ఓట్లకు మించి ఒకే డోర్ నెంబర్ పై నమోదైన ఇళ్ళ నుండి 21,347 ఇళ్ళను తొలగించామని సమాధానం పంపింది.  మిగిలిన వాటిపై చర్యలు తీసుకుని అర్హత లేని ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని, ఇకపై ఇటువంటి దొంగ ఓట్లు నమోదు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ వివరాలతో  చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం ఎంపీ రఘురామకు నివేదికను పంపింది.
AP Voters List : ఏపీలో 27 లక్షలకుపైగా అనుమానాస్పద ఓట్లు - ఎంపీ రఘురామకు ఎన్నికల సంఘం రిప్లయ్ !

ఏపీలో ఓటర్ల జాబితా అంశంపై చాలా కాలంగా దుమారం రేగుతోంది.  రాష్ట్రంలో చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోవడం, దొంగ ఓట్లు నమోదు చేయడం, టీడీపీకి అనుకూలం అని భావించే వారి ఓట్లను తొలగించడం, ఒక బూత్‌లో ఓట్లను మరో బూత్‌కు బదలాయించడం వంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని తాము ఎన్నికల సంఘాన్ని  చంద్రబాబు కోరారు.  అధికార వైసీపీ దొంగ ఓట్లతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేతలు కొంత కాలంగా ఆరోపిస్తున్నారు.   

ప్రజాస్వామ్యంలో ఓటర్లు ముఖ్యం.  దేశంలో పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు  హక్కు ఉంటుంది. కానీ ముందుగా జాబితాలో ఉండాలి. అలా జాబితాలో లేకుండా ఎవరికైనా ఓటు నిరాకరిస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. అందుకే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఓటర్ల జాబితా అంశంలో సీరియస్ గానే ఉంటారు. చాలా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా జోలికి అధికార పార్టీలు కూడా వెళ్లవు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు ఈసీ వద్ద ఉన్న ఓటర్ల జాబితాను తీసుకుని తాము సొంతంగా ప్రిపేర్ చేసుకుంటాయి  రాష్ట్ర ఎన్నికల సంఘాలు. అప్పుడు కొన్ని ఓట్లు గల్లంతవుతాయన్న  ఆరోపణలు వస్తాయి. కానీ ఇప్పుడు ఏపీలో  అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయాల్సిన వారి జాబితా మ్యానిపుల్టే అయిపోయిందన్న ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. 
AP Voters List : ఏపీలో 27 లక్షలకుపైగా అనుమానాస్పద ఓట్లు - ఎంపీ రఘురామకు ఎన్నికల సంఘం రిప్లయ్ !

ప్రతీ నియోజకవర్గంలో ఐదు నుంచి పది వేల ఓట్లు  ప్రత్యర్థి పార్ట సానుభూతి పరులవి తప్పిస్తే ఫలితం తారుమారవుతుంది. కానీ ప్రజాస్వామ్యం తలకిందులవుతుంది. ఇప్పుడు ఏపీలో ఏదే చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఈసీకి చేసిన ఫిర్యాదులో ఓట్ల తొలగింపు కోసం అధికారులు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారని వెల్లడించారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి,  మంత్రి సీదిరి అప్పలరాజు నేరుగానే మన పార్టీ ఓట్లు కాకపోతే అబ్జెక్షన్ చెప్పాలని క్యాడర్ ను ఆదేశించారు. అంటే అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగానే  ఓట్లను తొలగించే ప్రయత్నం  చేస్తున్నారని ఎన్నికల సంఘానికి వరుసగా ఫిర్యాదులు చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గోడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గోడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గోడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గోడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
Embed widget