అన్వేషించండి

Anantapuram TDP : అనంతపురం జిల్లాలో టీడీపీ బస్సు యాత్రకు బ్రేకులు - నేతలను అమరావతికి పిలిచిన చంద్రబాబు !

అనంతపురం టీడీపీలో నేతల మధ్య వివాదాలు ఆగడం లేదు. బస్సు యాత్ర కూడా అనుకున్నట్లుగా సాగడం లేదు.

 

Anantapuram TDP : ముందుగానే  మేనిఫెస్టో ప్రకటించి ప్రజల్లోకి వెళ్తున్న టీడీపీకి జిల్లాల్లో విబేధాలు సమస్యలుగా మారుతున్నాయి. అనంతపురం జిల్లాలో నేతల మధ్య సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. బస్సుయాత్రలను కూడా క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.దంతో జిల్లాలో కొనసాగుతున్న వివాదాలపై టిడిపి అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. గొడవులు జరుగుతున్న నియోజకవర్గాల్లోని నేతలను త్వరలో అమరావతికి పిలిపించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

బస్సు యాత్రకు బ్రేకులు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 23వ తేదీన భవిష్యత్తుకు బస్సుయాత్ర ప్రారంభమైంది. ప్రారంభమైనప్పటి నుంచి కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలోని అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఎన్నికలు సమీస్తున్న తరుణంలో జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశమవుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెనుకొండ, కళ్యాణదుర్గం, మడకశిర, శింగనమల నియోజకవర్గాల్లో విభేదాలు ఎక్కువయ్యాయి.  పెనుకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో బస్సుయాత్ర పూర్తయ్యింది. ఈ రెండు చోట్ల కూడా నాయకులు బాహాటంగానే ఘర్షణకు దిగి కొట్టుకున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఉమామహేశ్వర నాయుడులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. జిల్లా నేతల ముందే ఇవి జరుగుతున్నా వాటిని పుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నంగాని, నిలువరించే చర్యలుగాని చేపట్టలేకపోయారు. 

కొన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర రద్దు 

మడకశిర నియోజకవర్గంలో బస్సుయాత్రనే రద్దు చేశారు. ఇక శింగనమల నియోజకవర్గంలో ఇంకా యాత్ర జరగాల్సి ఉంది. ఇక్కడ ఏమి జరుగుతుందోనని చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. అంతకుమునుపు లోకేశ్‌ పాదయాత్ర సమయంలోనే నాయకుల మధ్య విభేదాలు పొడచూపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ యాత్రలో ఏమి జరుగుతుందోనన్న గుబులు ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఇలా విభేదాలు రచ్చకెక్కుతుండటంతో అధిష్టానం దృష్టి సారించింది. ఈ నియోజకవర్గాల్లోని నాయకులతోపాటు, ముఖ్య నాయకులతో వచ్చే వారంలో ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసింది. విభేదాలతో రచ్చకెక్కుతున్న నేతలకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి అధినాయకుడు చంద్రబాబునాయుడు క్లాస్‌ పీకనున్నట్టు సమాచారం. 

గతంలో ఎన్ని సార్లు సర్దిచెప్పినా మారని నేతలు 

పార్టీ ప్రతిపక్షంలో ఉండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ నేతల తీరులో మార్పు రాకపోవడంపై ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదివరకే అనేక మార్లు నేతలకు సర్ధిజెప్పే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఈసారి జరిగే సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు చేస్తారన్నది పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.  ఎన్నికలు కొన్ని నెలల్లో ఉన్న సమయంలో ఇప్పటికైనా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సిన సమయంలో ఇదేతీరున కొనసాగడం పార్టీ క్షేత్ర స్థాయి నేతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించి వీటిని పుల్‌స్టాప్‌ పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Embed widget