అన్వేషించండి

Pawan Kalyan: తిరుపతి ప్రజలకు ఆ రోజు శ్రీవారి దర్శనం - టీటీడీ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం

Andhra News: ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనం కల్పించాలన్న టీటీడీ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

Pawan Kalyan Happy With TTD Decision: తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనం కల్పించే విషయంలో సోమవారం టీటీడీ (TTD) తీసుకున్న నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హర్షం వ్యక్తం చేశారు. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు దర్శనం కల్పించాలని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. తిరుపతి ప్రజలకు ఇది ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. 'ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని తిరుపతి ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి ఆకాంక్షను నెరవేర్చాలని టీటీడీ ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లాను. నా సూచనపై నిర్ణయం తీసుకున్నందుకు టీటీడీ ఛైర్మన్, పాలకమండలి సభ్యులకు అభినందనలు. టీటీడీ పవిత్రతను రక్షించేలా చర్యలు తీసుకుంటున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు.' అని పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

'2, 3 గంటల్లోనే దర్శనం'

భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం 2, 3 గంటల్లోనే పూర్తయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు టీటీడీ తెలిపింది. సోమవారం టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేసి ప్రధాన ట్రస్ట్‌కే ఆ నిధులు తరలిస్తామని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. శ్రీవాణి పథకం మాత్రం కొనసాగుతుందని చెప్పారు. 'అన్యమతస్తులను వేరే చోటకు బదిలీ చేయాలని నిర్ణయం. శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు పునరుద్ధరణ. తిరుమలలో రాజకీయాలు పూర్తిగా నిషేధం. ఒకవేళ ఎవరైనా ఆ విషయాలు మాట్లాడితే కేసులు. నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుస్తాం. మెనూలో పదార్థాన్ని అదనంగా జోడిస్తాం. లడ్డూలోని నెయ్యి నాణ్యతను మరింత పెంచాలని నిర్ణయం. టీటీడీ ఉద్యోగులకు 10 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయం. టూరిజం శాఖ ద్వారా ఇచ్చే టికెట్లను రద్దు చేయాలని నిర్ణయం. టూరిజం శాఖ ఇచ్చే 4 వేల టికెట్ల రద్దుకు నిర్ణయం. టూరిజం శాఖ ఇచ్చే టికెట్లలో అవకతవకలు జరిగాయి. ఏఐ సహకారంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం. ఏళ్ల తరబడి డంపింగ్ యార్డులో పేరుకున్న చెత్తను తొలగిస్తాం. తిరుపతిలోని స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం. శారదాపీఠం లీజు రద్దు చేసి స్థలం స్వాధీనం చేసుకుంటాం. ముంతాజ్ హోటల్స్ సంస్థకు గత ప్రభుత్వం ఇచ్చిన భూముల లీజ్ రద్దు. ప్రసాదాల తయారీ పోటుకు మరమ్మతులు చేయాలని నిర్ణయం.' వంటి నిర్ణయాలను పాలకమండలి తీసుకుంది.

అటు, 2, 3 గంటల్లోనే స్వామి దర్శనం అయ్యేలా చర్యలు చేపడతామన్న టీటీడీ నిర్ణయంతో తిరిగి 'కంకణం' విధానం తిరిగి అమలు చేస్తారనే ప్రచారం సాగుతోంది. కాగా, 2 దశాబ్దాల కిందట టీటీడీ ఈవోగా ఐవీ సుబ్బారావు ఉన్న సమయంలో ఈ విధానం ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రతీ భక్తుడి చేతికి రిస్ట్ బాండ్ తరహాలో ఓ కంకణాన్ని ట్యాగ్ చేస్తారు. ఇది వాటర్ ప్రూఫ్ తరహాలో ఉంటుంది. దీని ద్వారా భక్తులు వారికి కేటాయించిన సమయానికి వెళ్లి 2, 3 గంటల్లోనే స్వామి దర్శనం చేసుకుని రావొచ్చు.

Also Read: Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget