అన్వేషించండి

AP TS Bifurcation Issues : విభజన సమస్యలపై ఈ నెల 23న దిల్లీలో కీలక సమావేశం, ఈ సారైనా పరిష్కారం అవుతాయా?

AP TS Bifurcation Issues : విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న దిల్లీలో సమావేశం జరగనుంది.

AP TS Bifurcation Issues : ఏపీ, తెలంగాణ విభజన సమస్యలపై ఈనెల 23న కీలక సమావేశం జరగనుంది. దిల్లీలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో విభజన సమస్యసపై సమావేశం జరగనుంది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల అధికారులకు కేంద్ర హోంశాఖ సమాచారం పంపించింది. ఈ నెల 23న జరిగే సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని సూచించినట్లు తెలుస్తోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా నేతృత్వంలో ఈ సమావేశం జరగనుందని సమాచారం. సెప్టెంబర్‌ 27వ తేదీ జరిగిన సమావేశంలో ఉమ్మడి అంశాలతో పాటు ఏపీకి చెందిన ఏడు అంశాలపై అధికారులు చర్చించారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, అమరావతికి అనుసంధానం చేసే రైల్వే ప్రాజెక్టులతో పాటు పలు అంశాలను గత సమావేశం అజెండాలో కేంద్రం చేర్చింది. అయితే ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే భేటీ అసంపూర్తిగా ముగిసింది. విభజన చట్టంలోని అంశాలను 10 ఏళ్లలోపు పూర్తిచేయాలనే నిబంధనలు ఉండడంతో, ఆ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర హోంశాఖ వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది.  

 ఏడు అంశాలపై చర్చ 

విభజన సమస్యలపై సెప్టెంబరు 27న జరిగిన  సమావేశం ఎజెండాలో మొత్తం 14 అంశాలు చేర్చి 7 అంశాలపై చర్చించారు.  ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన, షెడ్యూల్ 10 లోని సంస్థల విభజన, పునర్విభజన చట్టంలో లేని ఇతర సంస్థల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనపై చర్చించారు. సింగరేణి కాలరీస్, ఏపీ హెవీ మిషనరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ విభజన అంశాలు ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్నాయి. బ్యాంకుల్లో ఉన్న నగదు, బ్యాలెన్స్ విభజన, ఏపీ ఎస్సీఎస్సీఎల్, టీఎస్ఎస్ఎల్ క్యాష్ క్రెడిట్, 2014-15  రైస్ సబ్సిడీ విడుదల అంశాలపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటివరకు దాదాపు 26 సార్లు సమావేశాలు జరిగాయి. 

సెప్టెంబర్ 27 సమావేశంలో 

గత సమావేశంలో రాజధానికి వెయ్యి కోట్ల నిధులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే ఇప్పటికే ఇచ్చిన రూ.15 వందల కోట్ల ఖర్చుల వివరాలు అందజేయాలని కేంద్ర హోంశాఖ కోరింది. శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విధంగా రాజధానికి రూ.29 వేల కోట్లు ఇవ్వాలని ఏపీ కోరగా కేంద్ర హోంశాఖ అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. వెనుకబడిన 7 జిల్లాలకు నిధుల అంశాన్ని గత సమావేశంలో ఏపీ అధికారులు లేవనెత్తారు. ఐదేళ్లపాటు నిధుల ఇవ్వాలని మాత్రమే నిర్ణయించారని కేంద్రం హోంశాఖ అధికారులు చెప్పారు. రాష్ట్రానికి రైల్వేజోన్ ఇవ్వడం సాధ్యం కాదని రైల్వే బోర్డు తేల్చిచెప్పింది. అయితే ఈ విషయంపై నిర్ణయం మంత్రి వర్గానికి వదిలేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు. షెడ్యూల్ 9లో ఉన్న 91 సంస్థల విభజన విషయంలో షీలా బిడే కమిటీ సిఫార్సులపై తెలంగాణ అంగీకరించడంలేదని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణతో సంబంధం లేకుండా కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకోవచ్చు కదా అని ఏపీ అధికారులు అన్నారు.  న్యాయ నిపుణులు సలహా అనంతరం నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.

సింగరేణిపై 

ఏపీ అధికారులు లేవనెత్తిన ఏ ఒక్క అంశానికి  తెలంగాణ అధికారులు అంగీకారం తెలపలేదు. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ సహా పలు సంస్థల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని తెలంగాణ అధికారులు చెప్పారు.  పౌర సరఫరాల శాఖ బకాయిల గణాంకాల్లో తేడాలున్న విషయాన్ని ఏపీ అధికారులు సమావేశంలో ప్రస్తావించారు. విభజన చట్టం ప్రకారం సింగరేణిని పంచాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. 51 శాతం ఈక్విటీని పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని చట్టంలో నిర్దిష్టంగా పేర్కొన్నారన్నారు. సింగరేణికి ఉన్న ఏకైక అనుబంధ సంస్థ ఏపీహెచ్​ఎంఈఎల్​లో మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు ఈక్విటీ వర్తిస్తుందని తెలిపారు.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paripoornananda Swami on Hindupuram Seat | హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద | ABPWhy did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Embed widget