అన్వేషించండి

CM Jagan Tour : కోనసీమ వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ, బాలుడికి పెన్ గిఫ్టు

CM Jagan Tour : కోనసీమ జిల్లాలో వరద బాధితులను పరామర్శిస్తున్నారు సీఎం జగన్. పంటుపై గోదావరి దాటిన సీఎం జగన్, ట్రాక్టర్ పై ప్రయాణించి, ఆ తర్వాత కాలినడకన వరద బాధిత గ్రామాల్లో పర్యటిస్తున్నారు.

CM Jagan Tour : కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో బాధితులను పరామర్శిస్తున్నారు. సీఎం జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పంటుపై గోదావరి దాటి అవతలి గట్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ట్రాక్టర్‌లో లంక గ్రామాలలో పర్యటనకు బయలుదేరారు. పి.గన్నవరం మండలం జి.పెదపూడిలో సీఎం జగన్ పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. వశిష్ట గోదావరిలో బూరుగులంక రేవులో వరద ముంపు పరిస్థితులను అధికారులను అడిగితెలుసుకున్నారు సీఎం జగన్. వర్షంలోనే సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది.

జి.పెదపూడి వద్ద వంతెన 

అరిగెలవారి పేటలో పర్యటిస్తున్న సీఎం జగన్ బాధితులతో మాట్లాడారు. వరద సమయంలో తాను పర్యటిస్తే అధికారులు తన చుట్టూ తిరిగేవాళ్లని, బాధితులకు సహాయం అందించేందుకే అధికారులకు వారం టైం ఇచ్చి వచ్చానని సీఎం జగన్ అన్నారు. అందరికీ సాయం చేసే బాధ్యత ప్రభుత్వానిదని సీఎం బాధితులతో అన్నారు.  జి. పెదపూడి లంక వద్ద వంతెన నిర్మిస్తామని సీఎం జగన్‌ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. వర్షాకాలం ముగియక ముందే వరద నష్టం అందిస్తామని సీఎం అన్నారు.  బాధితులందరికీ సాయం ఎలా అందుతోందని, అధికారులు, వాలంటీర్ల పని తీరుపై సీఎం జగన్ స్వయంగా అడిగి తెలుసుకుంటూ పర్యటన కొనసాగిస్తున్నారు. 

బాలుడికి పెన్ గిఫ్ట్  

సీఎం జగన్ పర్యటనలో ఒక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న జరిగింది. పుచ్చకాయలవారి పేటలో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. నక్కా విజయలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన సమయంలో ఆమె కుమారుడిని సీఎం ఎత్తుకున్నారు. ఆ బాలుడు సీఎం జేబులోని పెన్ను తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇది గ‌మ‌నించిన సీఎం.. ఆ బాలుడికి తన పెన్ బహుమతిగా ఇచ్చారు. దీంతో ఆ బాలుడి త‌ల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. అలాగే  వరద బాధిత శిబిరాల్లో బాగా చూసుకున్నారా అని సీఎం అడిగి తెలుసుకున్నారు. 

రేపు అల్లూరి, ఏలూరు జిల్లాలో పర్యటన 

రేపుసీఎం జగన్‌ అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలలో పర్యటించున్నారు. రెండో రోజు కూడా గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు.  రేపు ఉదయం 8.30 గంటలకు రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి ఏఎస్‌ఆర్‌ జిల్లా చింతూరు చేరుకోనున్నారు.  ఉదయం 9.30 గంటలకు చింతూరు మండలం కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామం చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలిస్తారు. అనంతరం తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Embed widget