Chandrababu Naidu Siddhantam tour: 1500 కోట్ల భూ కబ్జా కేసులో అరెస్టయిన లీడర్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు - వైసీపీపై చంద్రబాబు విమర్శలు
Bolla Brahma Naidu Land Scam Hyderabad: ప. గో జిల్లా సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ‘మీ భూమి – మీ హక్కు’ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేత కబ్జాపై తీవ్ర విమర్శలు చేశారు.

AP CM Warns Land Mafia: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ పరిధిలోని సిద్ధాంతం గ్రామంలో పర్యటించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘మీ భూమి – మీ హక్కు’ లో పాల్గొన్న ఆయన, రైతులకు సరికొత్త క్యూఆర్ కోడ్, బార్ కోడ్ లతో కూడిన పటిష్టమైన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన భూ రికార్డుల తారుమారును సరిదిద్ది, సరికొత్త బ్లాక్చైన్ టెక్నాలజీతో భూములకు రక్షణ కల్పించే ఈ వేదికపై నుండి సీఎం చంద్రబాబు ప్రతిపక్ష వైసీపీపై నిప్పులు చెరిగారు.
1500 కోట్ల కబ్జాకోరును ఎందుకు సస్పెండ్ చేయలేదు?
సిద్ధాంతం బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్లో చేసిన రూ. 1500 కోట్ల భూ కబ్జా ఉదంతాన్ని తీవ్రంగా ప్రస్తావించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడ తన ఆటలు సాగవనే భయంతో సదరు నేత తెలంగాణకు పారిపోయారని ఎద్దేవా చేశారు. అక్కడ గండిపేట పరిధిలో ఫోర్జరీ సంతకాలు, నకిలీ జీవోలతో ఏకంగా రూ. 1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి రికార్డులు తారుమారు చేశారన్నారు. ఇంత పెద్ద దగాకు తెగబడిన నేతను ఆ పార్టీ అధ్యక్షుడు ఎందుకు సస్పెండ్ చేయలేదు అని చంద్రబాబు నిలదీశారు. తప్పు చేసిన వారిని వెనకేసుకురావడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు.
గత ప్రభుత్వ హయాంలో పాస్ పుస్తకాలపై రైతుల ఫోటోలు తీసేసి, అప్పటి ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. భూమి మీది, కష్టం మీది.. కానీ ఫోటో మాత్రం సైకోదా పొలాల్లో కూడా రైతులను వదిలిపెట్టకుండా పీడించారు. ఇలాంటి పిచ్చి తుగ్లక్ చర్యలకు ట్రీట్మెంట్ ఎక్కడుందో చెప్పండి.. ఆ పార్టీ నేతలందరికీ అక్కడే వైద్యం ఇప్పిద్దాం అంటూ బాబు వేసిన సెటైర్లకు సభలో నవ్వులు పూశాయి. దొంగతనాలు, నేరాలు చేయడంలో గొడ్డలి పార్టీ సిద్ధహస్తురాలని, తాము తప్పులు చేస్తూ నిందలు మాత్రం ఎదుటివారిపై వేయడం వారి నైజమని మండిపడ్డారు.
ప్రభుత్వ విద్యా విధానం, పరీక్షల నిర్వహణపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను చంద్రబాబు తిప్పికొట్టారు. అసలు పరీక్షలంటే ఏంటో తెలియని వాళ్ళు, విద్యా వ్యవస్థను ఎలా నడిపాలో కనీస అవగాహన లేని వాళ్ళు, రిజర్వేషన్ల ప్రాథమిక సూత్రాలు తెలియని అజ్ఞానులు ఈరోజు ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా ప్రమాణాలను పెంచేందుకు తాము సంస్కరణలు తెస్తుంటే, తట్టుకోలేక విషప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. భూమాఫియా, అక్రమార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఏ రౌడీ, ఏ కబ్జాకోరు అయినా తోక తిప్పి ఎక్కువ చేస్తే.. వాడి తోక కత్తిరించి నడిబజారులో నిలబెడతాను అని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో సామాన్యుడి ఆస్తికి, భూమికి పూర్తి రక్షణ ఉంటుందని, భూములను లాక్కునే సైకోల రాజ్యాంగానికి చరమగీతం పాడామని స్పష్టం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతంలో మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేసిన ముఖ్యమంత్రి. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన సీఎం చంద్రబాబు. పాల్గొన్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ,… pic.twitter.com/ExQLuoJpG7
— Telugu Desam Party (@JaiTDP) June 8, 2026
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూ రికార్డుల డిజిటలైజేషన్, పారదర్శకత కోసం దేశంలోనే మొదటిసారిగా బ్లాక్చైన్ ఆధారిత ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థను తీసుకొచ్చామని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి భూమికి శాశ్వత డిజిటల్ ఐడీ ఇస్తున్నామని, దీనివల్ల భవిష్యత్తులో ఎవరూ రికార్డులను ట్యాంపర్ చేయలేరని వివరించారు. గత ప్రభుత్వ తప్పులన్నింటినీ కడిగేసి, నిజమైన రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పిస్తూ 'మీ భూమి - మీ హక్కు' ద్వారా రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నామని సిద్ధాంతం వేదికగా చంద్రబాబు రైతులకు భరోసా ఇచ్చారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















