అన్వేషించండి

Chandrababu Naidu Siddhantam tour: 1500 కోట్ల భూ కబ్జా కేసులో అరెస్టయిన లీడర్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు - వైసీపీపై చంద్రబాబు విమర్శలు

Bolla Brahma Naidu Land Scam Hyderabad: ప. గో జిల్లా సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ‘మీ భూమి – మీ హక్కు’ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేత కబ్జాపై తీవ్ర విమర్శలు చేశారు.

 AP CM Warns Land Mafia:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ పరిధిలోని సిద్ధాంతం గ్రామంలో పర్యటించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం  ‘మీ భూమి – మీ హక్కు’ లో పాల్గొన్న ఆయన, రైతులకు సరికొత్త క్యూఆర్ కోడ్, బార్ కోడ్ లతో కూడిన పటిష్టమైన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన భూ రికార్డుల తారుమారును సరిదిద్ది, సరికొత్త బ్లాక్‌చైన్ టెక్నాలజీతో భూములకు రక్షణ కల్పించే ఈ వేదికపై నుండి సీఎం చంద్రబాబు ప్రతిపక్ష వైసీపీపై నిప్పులు చెరిగారు. 

1500 కోట్ల కబ్జాకోరును ఎందుకు సస్పెండ్ చేయలేదు? 

సిద్ధాంతం బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్‌లో చేసిన రూ. 1500 కోట్ల భూ కబ్జా ఉదంతాన్ని తీవ్రంగా ప్రస్తావించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడ తన ఆటలు సాగవనే భయంతో సదరు నేత తెలంగాణకు పారిపోయారని ఎద్దేవా చేశారు. అక్కడ గండిపేట పరిధిలో ఫోర్జరీ సంతకాలు, నకిలీ జీవోలతో ఏకంగా రూ. 1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి రికార్డులు తారుమారు చేశారన్నారు. ఇంత పెద్ద దగాకు తెగబడిన నేతను ఆ పార్టీ అధ్యక్షుడు  ఎందుకు సస్పెండ్ చేయలేదు  అని చంద్రబాబు నిలదీశారు. తప్పు చేసిన వారిని వెనకేసుకురావడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు.

 గత ప్రభుత్వ హయాంలో పాస్ పుస్తకాలపై రైతుల ఫోటోలు తీసేసి, అప్పటి ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.  భూమి మీది, కష్టం మీది.. కానీ ఫోటో మాత్రం సైకోదా  పొలాల్లో కూడా రైతులను వదిలిపెట్టకుండా పీడించారు. ఇలాంటి పిచ్చి తుగ్లక్ చర్యలకు ట్రీట్‌మెంట్ ఎక్కడుందో చెప్పండి.. ఆ పార్టీ నేతలందరికీ అక్కడే వైద్యం ఇప్పిద్దాం  అంటూ బాబు వేసిన సెటైర్లకు సభలో నవ్వులు పూశాయి. దొంగతనాలు, నేరాలు చేయడంలో  గొడ్డలి పార్టీ  సిద్ధహస్తురాలని, తాము తప్పులు చేస్తూ నిందలు మాత్రం ఎదుటివారిపై వేయడం వారి నైజమని మండిపడ్డారు.

ప్రభుత్వ విద్యా విధానం, పరీక్షల నిర్వహణపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను చంద్రబాబు తిప్పికొట్టారు. అసలు పరీక్షలంటే ఏంటో తెలియని వాళ్ళు, విద్యా వ్యవస్థను ఎలా నడిపాలో కనీస అవగాహన లేని వాళ్ళు, రిజర్వేషన్ల ప్రాథమిక సూత్రాలు తెలియని అజ్ఞానులు ఈరోజు ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా ప్రమాణాలను పెంచేందుకు తాము సంస్కరణలు తెస్తుంటే, తట్టుకోలేక విషప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. భూమాఫియా, అక్రమార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.  ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఏ రౌడీ, ఏ కబ్జాకోరు అయినా తోక తిప్పి ఎక్కువ చేస్తే.. వాడి తోక కత్తిరించి నడిబజారులో నిలబెడతాను  అని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో సామాన్యుడి ఆస్తికి, భూమికి పూర్తి రక్షణ ఉంటుందని, భూములను లాక్కునే సైకోల రాజ్యాంగానికి చరమగీతం పాడామని స్పష్టం చేశారు.   

 ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూ రికార్డుల డిజిటలైజేషన్,  పారదర్శకత కోసం దేశంలోనే మొదటిసారిగా బ్లాక్‌చైన్ ఆధారిత ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థను తీసుకొచ్చామని చంద్రబాబు  ప్రకటించారు. ప్రతి భూమికి శాశ్వత డిజిటల్ ఐడీ ఇస్తున్నామని, దీనివల్ల భవిష్యత్తులో ఎవరూ రికార్డులను ట్యాంపర్ చేయలేరని వివరించారు. గత ప్రభుత్వ తప్పులన్నింటినీ కడిగేసి, నిజమైన రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పిస్తూ 'మీ భూమి - మీ హక్కు' ద్వారా రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నామని సిద్ధాంతం వేదికగా చంద్రబాబు రైతులకు భరోసా ఇచ్చారు. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Breaking News: YSR జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళుర్పించిన వైఎస్ జగన్, షర్మిల
YSR జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళుర్పించిన వైఎస్ జగన్, షర్మిల
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Vizag Fishermen Missing: ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌- ఆరుగురు జాలర్లపై ఆశలు గల్లంతు, రూ.10 లక్షల పరిహారం
ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌- ఆరుగురు జాలర్లపై ఆశలు గల్లంతు, రూ.10 లక్షల పరిహారం
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
Embed widget