అన్వేషించండి

Chandrababu On YSRCP Plenary : ఏం సాధించారని ప్లీనరీ, సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్

Chandrababu On YSRCP Plenary : సీఎం జగన్ ఏం సాధించారని ప్లీనరీ నిర్వహిస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. నవరత్నాలు పేరిట నవ ఘోరాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Chandrababu On YSRCP Plenary : వైసీపీ నవ రత్నాల పేరిట నవ ఘోరాలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఏం సాధించారని ప్లీనరీ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ పై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నగరిలో రోడ్‌ షో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయాల కోసం జగన్‌ అందర్నీ వాడుకున్నారని విమర్శించారు. అమ్మను పార్టీ నుంచి సాగనంపారని ఆరోపించారు. పాదయాత్రలో తిరిగినట్లు సీఎం జగన్ ఇప్పుడు తిరగాలని చంద్రబాబు సవాల్ చేశారు. ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో అప్పుడు జగన్‌కు తెలుస్తుందన్నారు. మద్యంలో విషపదార్థాలు ఉన్నట్లు ల్యాబ్ నివేదికలు చెబుతున్నాయన్నారు. జే బ్రాండ్‌పై వైసీపీ ప్లీనరీలో సమాధానం చెప్పాలని చంద్రబాబు సవాల్ చేశారు. వైసీపీ పాలన పోవాలంటే ప్రజలు అండగా నిలబడాలని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు సవాల్ 

వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు కాదు నవ ఘోరాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఏం సాధించారని వైసీపీ ప్లీనరీ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. తన  ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఏపీలోనే అధికంగా ఉన్నాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తే ఏపీలో ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్రోల్‌ నింపుకునే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. మద్యం ధరలు రాష్ట్రంలో విపరీతంగా పెంచారని మండిపడ్డారు. మద్యం ధరలు పెంచి ఖజానాలు నింపుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు.  

చెత్త పన్ను ఘనత వైసీపీదే

టీడీపీ అధికారంలోకి వచ్చాక నగరిలో జౌళి పార్క్ ఏర్పాటుచేస్తామని చంద్రబాబు అన్నారు. అమరావతి, పోలవరాన్ని నాశనం చేశారన్నారు. కాలువ తవ్వలేని వ్యక్తి సాగునీటి ప్రాజెక్టులు కడతారా అని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం టీడీపీ హయాంలో పూర్తిచేశామన్నారు. టీడీపీ అధికారంలో ఉంటే పోలవరం పూర్తి అయ్యేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోవడానికి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఇష్టారీతిన పెంచారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పన్ను వేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Somu Veerraju: కమ్యూనిస్టులు దేశానికి నీచులు - సోము వీర్రాజు ఆగ్రహం !
కమ్యూనిస్టులు దేశానికి నీచులు - సోము వీర్రాజు ఆగ్రహం !
Iran-US ceasefire: అమెరికా - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ దిశగా ముందడుగు - 45 రోజుల ఒప్పందం జరిగే చాన్స్
అమెరికా - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ దిశగా ముందడుగు - 45 రోజుల ఒప్పందం జరిగే చాన్స్

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Car Maintenance Guide: తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
Organ Transplant Green Channel: ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
Car SafetyTips in Summer : ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
Embed widget