అన్వేషించండి

Chandrababu Serious: తప్పుడు ప్రచారాలపై తక్షణం స్పందించకపోతే పదవులు పోతాయి - మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్

AP Cabinet: ప్రస్తుతం సబ్జెక్ట్ పై రాజకీయాలు జరగడం లేదని తప్పుడు ప్రచారాల మీదనే జరుగుతున్నాయని వాటిని బలంగా తిప్పికొట్టాలని మంత్రులకు చంద్రబాబు స్పష్టం చేశారు.

Chandrababu Naidu gives warning to ministers:  వైసీపీ చేసే తప్పుడు ప్రచారాలపై ఎందుకు స్పందించడం లేదని మంత్రులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ కేబినెట్ భేటీలో ఎజెండాపై చర్చ ముగిసిన తర్వాత మంత్రులతో రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు రాజకీయ అంశాలపై తక్షణ స్పందన ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఓ మహిళా ఎమ్మెల్యేపై వైసీపీ అత్యంత దారుణంగా మాట్లాడితే.. స్పందించడానికి ఎందుకు సమయం తీసుకున్నారని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. 

వైసీపీ తప్పుడు ప్రచారాలపై వేగంగా స్పందించలేదని చంద్రబాబు అసంతృప్తి         

గతంలో సబ్జెక్టు ప్రకారం రాజకీయాలు నడిచేవన్నారు. ఇప్పుడు సబ్జెక్ట్ ప్రకారం రాజకీయాలపై చర్చ జరగడం లేదని.. తప్పుడు ప్రచారాలు, వ్యక్తిత్వ హననాలు చేయడం మీదనే రచ్చ చేస్తున్నారని  గుర్తు చేశారు. ఇలాంటి విషయాల్లో ఎప్పటికప్పుడు స్పందించి.. వెంటనే కౌంటర్లు ఇవ్వాలని.. ప్రజలకు మంత్రులే నిజాలు చెప్పాలని స్పష్టం చేశారు. గతంలోలా మెతకగా ఉండనని స్పష్టం చేశారు. 1995 సీఎంను చూస్తారని.. రాజకీయంగా కౌంటర్లు ఇవ్వకపోతే..  మీ స్థానంలో వేరే మంత్రులు వస్తారని హెచ్చరించారు. ఎవరికీ పదవుల గ్యారంటీ ఉండదన్నారు.  గత కేబినెట్ సమావేశాల్లోనూ చంద్రబాబ ు కొంతమంది మంత్రుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మంత్రులు తమ విధుల పట్ల తీవ్రంగా ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. "ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది మంత్రులు తమ ప్రవర్తనను మార్చుకోవడం లేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.            

గతంలోనూ కేబినెట్ భేటీలో చంద్రబాబు అసంతృప్తి 

మంత్రులు ప్రోటోకాల్ పాటించడం లేదని.. కార్యకర్తలు, నేతలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.  కార్యకర్తలు, నేతలకు మంత్రులు గౌరవం ఇవ్వాల్సిందేనన్నారు. మంత్రులు ప్రోటోకాల్ పాటించడం లేదని.. కార్యకర్తలు, నేతలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.  కార్యకర్తలు, నేతలకు మంత్రులు గౌరవం ఇవ్వాల్సిందేనన్నారు. పెట్టుబడులు అడ్డుకునేలా వైసీపీ కుట్రలు చేస్తోందని.. వారిపై విచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  

ఏపీకి అప్పులు, పెట్టుబడులు  రాకుండా.. తప్పుడు ఈ మెయిల్స్            

ఆంధ్రప్రదేశ్ కు అప్పులు రాకుండా, పెట్టుబడులు రాకుండా వివిధ సంస్థలకు, వ్యక్తులకు దాదాపుగా రెండు వందల మేర ఫేక్ ఈమెయిల్స్ పంపారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ కేబినెట్ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ అంశంపై తనకు సమాచారం రావడంతో పంపించిన వ్యక్తి ఎవరో ఆరా తీశానని ఉదయ్ భాస్కర్ అనే జర్మనీలో ఉండే వైసీపీ సానుభూతిపరుడితో ఈ ఫేక్ ఈమెయిల్స్ పంపించారని గుర్తించారు. ఈ అంశంపై చంద్రబాబు స్పందించారు. ఏపీపై కుట్రలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే.. ఈ అంశంపై ప్రజలకు నిజాలు వివరించాలన్నారు.                            

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Srikakulam Stampede News: కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Srikakulam Stampede News:
"అది ప్రైవేటు గుడి" కాశీబుగ్గ ఆలయంపై దేవాదాయశాఖ వివరణ
Visakhapatanam Crime News: నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
Advertisement

వీడియోలు

చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Aus vs Ind 2nd T20 Match Highlights | ఆసీస్ తో రెండో టీ20 లో ఓడిన టీమిండియా | ABP Desam
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు.. అవసరమైన చోట అదరగొట్టేసింది..!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikakulam Stampede News: కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Srikakulam Stampede News:
"అది ప్రైవేటు గుడి" కాశీబుగ్గ ఆలయంపై దేవాదాయశాఖ వివరణ
Visakhapatanam Crime News: నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
Konaseema Crime News: కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
Amalapuram Crime News:వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
విస్కీ vs స్కాచ్: రెండింటి మధ్య తేడా తెలుసా? | స్కాచ్ విస్కీ ప్రత్యేకత, తయారీ విధానం, నియమాలు
స్కాచ్ విస్కీకి, మామూలు విస్కీకి మధ్య తేడాలు తెలుసా? స్కాచ్ ఎందుకు అంత ప్రత్యేకమైనది?
Embed widget