అన్వేషించండి

Chandrababu: కుప్పానికి కృష్ణా జలహారతి - చెప్పిన మాట చేసి చూపించామని చంద్రబాబు సంతోషం

Kuppam Krishna Water: కుప్పం నియోజకవర్గంలో కృష్ణా జలహారతిని చంద్రబాబు నిర్వహించారు. అసెంబ్లీలో చెప్పినట్లుగానే ఎవరు అడ్డుకున్నా.. హంద్రీనీవా ద్వారా నీళ్లు తీసుకొస్తామని చెప్పాం.. చేసి చూపిస్తున్నామని సంతృప్తి వ్యక్తం చేశారు.

Chandrababu Naidu conducted Krishna Jala Aarti in Kuppam: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు   కుప్పం మండలంలోని పరమసముద్రం చెరువు వద్ద కృష్ణా నది జలాలకు  జలహారతి అర్పించారు.  హంద్రీ-నీవా కాలువ విస్తరణ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలకు చిత్తూరు, కుప్పం, పలమనేరు మొదలైన ప్రాంతాలు కృష్ణా నది నీరు చేరుకోవడానికి చేపట్టిన భారీ ప్రాజెక్ట్.  ఈ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు,  33 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రసంగించారు.  
   
వైసీపీ హయాంలో గేట్లతో సెట్టింగ్ లు వేసి నీళ్లు కూడా బయట నుంచి తీసుకొచ్చి నాటకాలు ఆడిన ఘటనలు చూశాం..విమానం ఎక్కేలోపు నీళ్లన్నీ ఇంకిపోయిన పరిస్థితులను చూశాం. అసెంబ్లీలో చెప్పినట్లుగానే ఎవరు అడ్డుకున్నా.. హంద్రీనీవా ద్వారా నీళ్లు తీసుకొస్తామని చెప్పాం.. చేసి చూపిస్తున్నామని చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.  రాయలసీమలో కరవు వస్తే పశువుల కోసం రైలులో నీళ్లు తెప్పించి కాపాడుకున్నాం..అలాంటి పరిస్థితి రావొద్దని హంద్రీనీవాకు శ్రీకారం చుట్టాను. నేను ఏ పని చేయలన్నా వెంకన్నపై భారం వేసి .. బుల్లెట్ మాదిరి దూసుకువెళ్తా.. వెనుదిరిగి చూడటం తనకు తెలియదని చంద్రబాబు అన్నారు.  

" సాగు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది" అని  చంద్రబాబు అన్నారు.  హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా సీమ ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ 738 కి.మీ. ప్రయాణించి కుప్పానికి చేరడం గొప్ప విజయమని అన్నారు. ఇది రికార్డు స్థాయి పఅన్నారు.  గతంలో ఎన్‌టీఆర్ రాయలసీమను ఆకుపచ్చగా మార్చాలని కలలు కన్నారు. ఆ కలను తాను సాకారం చేస్తున్నానని, సీమ పల్లెల్లోకి నీళ్లు పారించడం ద్వారా పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు అందుతున్నాయని ప్రసంగించారు. ఇది రాష్ట్ర ప్రగతికి మైలురాయి అని చెప్పారు.పోలవరం, వెలుగొండ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం మరింత ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.  

ప్రాజెక్టు వద్దకు వచ్చేటప్పుడు మహిళలు, రైతులతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు బస్సులో ప్రయాణించారు. బస్సులోని వారితో ఫోటోలు దిగారు.  

పూజలు చేసిన తర్వాత పరమ సముద్రం చెరువులో బోటు ద్వారా తిరిగారు. ఆ చెరువులో నళ్లు దశాబ్దాలుగా నిలబడలేదు.  ఇప్పుడు దాదాపుగా చెరువు నిండుగా నీరు ఉండటంతో ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Karimnagar SI Chandrasekhar Suicide : కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
Trump Iran War:ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
Embed widget