అన్వేషించండి

MP Vijayasai Reddy: రాజ్యసభలో పదే పదే చంద్రబాబు ప్రస్తావన, ఇంతకీ విజయసాయి టార్గెట్ ఏంటి?

చంద్రబాబు అన్నీ కనిపెడితే, వాటిపై పేటెంట్ కు భారత్ దరఖాస్తు చేసుకుంటే కోట్ల రూపాయల్లో మనకు ఆదాయం వస్తుందని వెటకారంగా అన్నారు విజయసాయి. దీంతో బీఆర్ఎస్ సభ్యులు ఆయన్ను వారించారు.

రాజ్యసభలో చంద్రబాబు ప్రస్తావన ఎందుకు..? అయితే గియితే ఆయన అరెస్ట్ ని ఖండిస్తూ టీడీపీ ఎంపీలు ఆ ప్రస్తావన తెచ్చారంటే ఓ అర్థముంది. కానీ అవసరం ఉన్నా లేకపోయినా పదే పదే చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రెండుసార్లు ఆయన పేరు చెప్పి మరీ విమర్శలు చేశారు. 

రాజ్యసభలో ఈరోజు జరిగిన చర్చలో కూడా చంద్రబాబు టాపిక్ తీసుకొచ్చారు విజయసాయిరెడ్డి. వాస్తవానికి చంద్రయాన్ సక్సెస్ గురించి శాస్త్రవేత్తలను అభినందించే చర్చ అది. కానీ విజయసాయిరెడ్డి చంద్రయాన్ తో మొదలు పెట్టి చివరకు చంద్రబాబు వద్దకు వచ్చి ఆగారు. చంద్రయాన్-3 తక్కువ బడ్జెట్ తో రూపొందించారని, ఓ భారీ సినిమా బడ్జెట్ కంటే చంద్రయాన్ బడ్జెట్ తక్కువ అని చెప్పారు. అదే సమయంలో మోదీ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి ఎంతో మేలు చేస్తున్నారని చెప్పారు. పనిలో పనిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో శాస్త్రవేత్తలను వేధించారని, జైలులో పెట్టారని, నంబి నారాయణ ఉదంతాన్ని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. అక్కడితో ఆగితే బాగుండేది, కానీ చంద్రబాబు ప్రస్తావన మాత్రం విమర్శలకు దారితీసింది. 

ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు తానే అన్నీ కనిపెట్టానని చెప్పుకుంటారని, కంప్యూటర్, సెల్ ఫోన్ కూడా తానే కనిపెట్టానని అంటారని, అలాంటి వ్యక్తి గురించి లోతుగా చర్చించాలన్నారు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు అవన్నీ కనిపెడితే, వాటిపై పేటెంట్ కు భారత్ దరఖాస్తు చేసుకుంటే కోట్ల రూపాయల్లో మనకు ఆదాయం వస్తుందని వెటకారంగా అన్నారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు ఆయన్ను వారించారు, సబ్జెక్ట్ మాట్లాడాలన్నారు. ఎవరు వారించినా వినకుండా విజయసాయి, చంద్రబాబుపై తన అక్కసు వెళ్లగక్కారు. 

సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రారంభ సందర్భంలో కూడా చంద్రబాబుపై రాజ్యసభలో తీవ్ర ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి. అవినీతి, వెన్నుపోటుకి చంద్రబాబు కేరాఫ్ అని అన్నారు. చంద్రబాబు గతంలో బీజేపీతో కలసి పనిచేశారని, కాంగ్రెస్, వామపక్షాలతో కూడా పొత్తు పెట్టుకున్నారని, చివరకు అందరికీ వెన్నుపోటు పొడిచారని చెప్పారు విజయసాయిరెడ్డి. ఆయన వెన్నుపోటు ఎపిసోడ్ లు సభకు గుర్తు చేస్తున్నానని చెప్పారు. అఖిలపక్షంలో చంద్రబాబు వ్యవహారాన్ని తీసుకు రావడం తప్పన్నారు. టీడీపీ ఎంపీలు ఆ పని చేసినందుకే తాను రాజ్యసభలో ఆయన వ్యవహారం హైలైట్ చేయాల్సి వచ్చిందన్నారు విజయసాయి. 

పదే పదే చంద్రబాబు ప్రస్తావన తేవడం రాజ్యసభలో ఆయన్ను అవమానించేలా మాట్లాడటం విజయసాయి టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీపై అవసరానికి మించి అభినందనలు తెలుపుతూ, కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారాయన. ఒకరకంగా చంద్రబాబు-బీజేపీ మైత్రి వైసీపీకి ఇష్టం లేదని ఆయన చెప్పాలనుకుంటున్నారు. అయితే చంద్రబాబు ప్రస్తావన తేవడం మాత్రం చాలామంది ఇతర పార్టీల నేతలకు ఇష్టంలేదు. సభలో లేని వ్యక్తి గురించి, ప్రస్తుతం జైలులో ఉన్న వ్యక్తి గురించి మరీ అంత వ్యంగ్యంగా మాట్లాడటం అవసరమా అంటున్నారు.  అయితే ఓ వ్యూహం ప్రకారం చంద్రబాబుని టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి. టీడీపీ ఎంపీలు ఆయనపై సింపతీ తేవాలనుకునే ప్రయత్నాలను ఇలా నిలువరిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
The Raja Saab Trailer : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
The Raja Saab Trailer : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Mowgli Review : నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Bigg Boss Telugu Latest Promo : బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
Embed widget