అన్వేషించండి

Cardiac Arrest: పేపర్ వేల్యూషన్ చేస్తూ టీచర్, ఆస్పత్రికి చికిత్స తీసుకుంటూ ఎమ్మార్వో మృతి - గుండెపోటే కారణం 

Cardiac Arrest: పేపర్ వేల్యూషన్ చేస్తూ తెలంగాణ టీచర్, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తెలంగాణ ఎమ్మార్వో గుండెపోటుతో మృతి చెందారు. 

Cardiac Arrest: ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి 30 ఏళ్ల వయసు వారు గుండెపోటు బారిన పడి మరణిస్తున్నారు. డ్యాన్స్ చేస్తూనో, కాలేజీలో స్నేహితులతో కబుర్లు చెబుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఒకప్పుడు యాభై ఏళ్లు దాటిన వారిలో గుండెపోటు, ఇతర గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తేవి. కానీ ఇప్పుడు యువత కూడా గుండె జబ్బుల ప్రమాదంలో పడింది. ఎక్కడికక్కడ నడుస్తూ, పని చేసుకుంటూనే ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా ఏపీలో పేపర్ వేల్యూషన్ చేస్తూ ఓ టీచర్, తెలంగాణలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ ఎమ్మార్వో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. 

అసలేం జరిగిందంటే..?

మహబూబాబద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు స్థానిక తహసీల్దార్ కూడా హాజరయ్యారు. అయితే రాత్రి 10 గంటలకు ఇంటికి వెళ్లిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కారు డ్రైవర్ వెంటనే ఎమ్మార్వోను కారులో కేసముద్రం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యునికి చూపించగా తహసీల్దార్ గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించి వెంటనే మహబూబాబాద్  కు తరలించాలని సూచించారు. ఈ క్రమంలోనే డ్రైవర్ ఎమ్మార్వోను వెంటనే మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అక్కడి సిబ్బంది సీపీఆర్ చేసి చికిత్స అందించారు. కానీ రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎమ్మార్వో మృతి చెందారు. తహాసీల్దార్ కు గుండెపోటు వచ్చిందన్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి వచ్చారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు తెలుసుకొని తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. తమతోపాటు అప్పటి వరకు కలిసి మెలిసి ఉన్న తహసీల్దార్ కొద్ది క్షణాల్లోనే మరణించడం తీవ్ర విషాదాన్ని కలిగించిందని ఎమ్మెల్యే చెప్పారు. తహాసిల్దార్ ఫరీదుద్దీన్ స్వస్థలం హన్మకొండ కాగా భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం కేసముద్రం తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. 

ఏపీలో పేపర్ వేల్యూషన్ కు వెళ్లి టీచర్ మృతి 

బాపట్ల  జిల్లా మున్సిపల్ స్కూల్ లో మూల్యాంకనం చేసేందుకు వచ్చిన ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు(48) గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పేపర్ దిద్దుతూ ఒక్కసారిగా కుప్ప కూలి‌ పడిపోయిన శ్రీనివాసరావు.. బీపీ పెరిగి బ్రెయిన్ స్ట్రోక్ తో‌‌ మృతి చెందినట్లు వైద్యల‌ వెల్లడించారు. అయితే శ్రీనివాస రావు పర్చూరులో గణిత ఉపాద్యాయుడుగా పని చేస్తున్నాడు. 

ఇటీవలే ఎనిమిదో తరగతి విద్యార్థి మృతి

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఎస్సీ హాస్టల్ లో ఉంటున్న ఓ 13 ఏళ్ల బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అప్పటివరకు బాగున్న బాలుడు భోజనం చేసిన తర్వాత నుంచి ఛాతీలో నొప్పిగా ఉందని, ఊపిరాడడం లేదని తన స్నేహితులతో చెప్పాడు. వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలపగా వెంటనే వారు ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు. బాగా చదువుకొని తమకు చక్కగా చూసుకుంటాడని అనుకున్న కొడుకు చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం ఏంటా అని కన్నీరుమున్నీరవుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Embed widget