అన్వేషించండి

Declaration Boards : అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే - తిరుపతిలో పలు చోట్ల బోర్డుల దృశ్యాలు వైరల్

Tirupati : అన్యమతస్తులు శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని తిరుపతిలో పలు చోట్ల బోర్డులు ఏర్పాటయ్యాయి. అలా బోర్డులు ఏర్పాటు చేసిన కాసేపటికే జగన్ పర్యటన రద్దయినట్లుగా ప్రకటన వచ్చింది.

Tirumala : జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన సమయంలో తిరుపతిలో అన్యమతస్తుల డిక్లరేషన్ అంశంపై విధివిధానాలు వివరిస్తూ బోర్డులు ఏర్పాటయ్యాయి.  తిరుపతిలో టీటీడీకి చెందిన భవనాలు ఉన్న చోటల్లా ఈ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. అందులో అన్యమతస్తుల దర్శన సంప్రదాయాల గురించి వివరించారు. డిక్లరేషన్లు అధికారుల వద్ద అందుబాటులో ఉంటాయని.. స్వామివారిపై తమకు విశ్వాసం ఉందని చెప్పి డిక్లరేషన్ ఫాంపై సంతకం  చేయాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు.   తిరుపతితో పాటు తిరుమలలో కూడా ఈ బోర్డులు ఏర్పాటు చేశారు.

జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని అన్ని వర్గాల నుంచి  డిమాండ్స్ 

జగన్మోహన్ రెడ్డి దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ అధికారులు అడుగుతారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ టీటీడీ ఈవో పేరుతో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా  టీటీడీ అధికారులే ఏర్పాటు చేసి ఉంటారని అనుకోవచ్చు. జగన్ తిరుమల పర్యటన ఖరారైనప్పటి నుండి ఆయన డిక్లరేషన్ పై చర్చ జరుగుతోంది. కూటమి నేతలతో పాటు హిందూ సంస్థలకు చెందిన వారు.. స్వామిజీలు కూడా జగన్ డిక్లరేషన్ ఇచ్చి స్వామి వారి దర్శనానికి వెళ్లాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సంప్రదాయం కూడా అదే చెబుతోందని అంటున్నారు.

తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ - వివాదాస్పదం కాకూడదనేనా ?

డిక్లరేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా సమస్యే                                       

తిరుమలలో దర్శనం కోసం జగన్ వెళ్తే డిక్లరేషన్  ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే దర్శనానికి వెళ్లనివ్వరు. డిక్లరేషన్ ఇస్తే క్రిస్టియన్ గా అంగీకరించినట్లు అవుతుంది. ఇది రాజకీయంగా ఇబ్బందికరమని భావిస్తున్నారు. ఒక వేళ అలా డిక్లరేషన్ ఇస్తే వైసీపీకి ఓుట బ్యాంక్ గా ఉన్న క్రిస్టియన్లు కూడా దూరమవుతారన్న అంచనాలు రావడంతో జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనం విషయంలో వెనుకడుగు వేశారని తెలుస్తోంది. గతంలో జగన్ ఎప్పుడూ డిక్లరేషన్ ఇవ్వలేద. గతంలో శ్రీవారిని దర్శించుకున్నప్పుడు .. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండానే దర్శనం చేసుకున్నారు. టీటీడీ అధికారులు డిక్లరేషన్ పుస్తకం  పట్టుకుని టీటీడీ అధికారులు పరుగులు పెట్టినా ప్రయోజనం లేకపోయేది. ఇక సీఎంగా ఉన్నప్పుడు జగన్ ను డిక్లరేషన్ అడిగే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. 

టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! అందుకే రియాక్ట్ కావడం లేదా?

సంప్రదాయాలను అందరూ గౌరవించాలని చంద్రబాబు ట్వీట్                             

జగన్ తిరుమల పర్యటనకు ముందు సీఎం చంద్రబాబు కూడా ఓ ట్వీట్ చేశారు. హిందూ తమ సంప్రదాయాలను అందరూ గౌరవించాలని.. శ్రీవారి ఆలయ సంప్రదాయాలను కూడా గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు.  అదే సమయంలో టీటీడీ కూడా బోర్డులు పెట్టడంతో  జగన్ తిరుమలకు వస్త్ డిక్లరేషన్ అంశం..  హాట్ టాపిక్ అవడం ఖాయం కావడంతో ఆగిపోయినట్లుగా  భావిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget