అన్వేషించండి

AP News : సైకిల్ పై దేశవ్యాప్తంగా యాత్ర - రూ. 10 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్ !

ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య సీఎం జగన్ ను కలిశారు. రూ. పది లక్షల సాయాన్ని ఆమెకు సీఎం ప్రకటించారు.

AP News :   ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.మహిళల సాధికారత కోసం ఆశా మాలవ్య దేశ వ్యాప్తంగా సైకిల్ పై యాత్ర చేస్తున్నారు..  ఆశా మాలవ్యను ప్రత్యేకంగా అభినందించిన సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి, ఆమె లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు.  రూ. 10 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.సైకిల్‌పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, ఇప్పటివరకు ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా కిలోమీటర్లు పూర్తయిందని ఆశా మాలవ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెప్పారు. 

అభినందించిన గవర్నర్ 
 
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌ జిల్లా నతారామ్‌ గ్రామానికి చెందిన ఆశా మాలవ్య మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళేందుకు దేశవ్యాప్తంగా ఒంటరిగా సైకిల్‌యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చ ఆమె పలువురు ప్రముఖులను కలిసి,తన లక్ష్యాన్ని గురించి వివరించారు.ఇందులో భాగంగానే ఆమె తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ను కలిశారు.ఆశా మాలవ్య కృషిని ప్రశంసించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి సత్కరించారు.  ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఆశా మాలవ్య గవర్నర్ భిశ్వభూషణ్ హరి చందన్ ను కూడా కలిశారు.తన యాత్ర కు సంబందించిన వివరాలను,ఫోటోలను గవర్నర్ కు చూపించారు.గతంలో పర్వతారోహకురాలిగా తన విజయాలను గురించి గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ కు ఆమె వివరించారు.గవర్నర్ ఆశఆ మాలవ్యను సత్కరించి అభినందించారు.

పర్వత అధిరోహరణలో రికార్డు హోల్డర్ ! 

ఆశా మాలవ్య, మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌ జిల్లా కు చెందిన మహిళ. స్పోర్ట్స్‌లో నేషనల్ ప్లేయర్‌ ..మౌంటైనియరింగ్‌లో ఆశా మాలవ్య రికార్డు హోల్డర్‌ గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆశా మాలవ్య 25వేల కిలోమీటర్ల సంపూర్ణ భారత యాత్ర చేపట్టారు.2022 నవంబర్‌ 1న భోపాల్‌లో  ఆశా మాలవ్య సైకిల్ యాత్ర ప్రారంభించి విజయవాడ చేరుకున్నారు. మొత్తం 28రాష్ట్రాల్లో ఆమెతన సైకిల్ యాత్ర నిర్వహించాలనే  టార్గెట్ తో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే 7రాష్ట్రాల్లో ఆశా మాలవ్య సైకిల్‌ యాత్ర పూర్తయింది. భారత దేశంలో మహిళలకు రక్షణ లేదని,మన దేశం మహిళలకు   సురక్షితమైంది కాదని విదేశాల్లో తప్పుడు అభిప్రాయం ఉందని ఆమె తెలిపారు. మహిళలకు భారతదేశంలో పూర్తి భద్రత ఉందని తాను ప్రపంచానికి  చాటి చెప్పాలనుకుంటున్నాని అందుకేనే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కి తన సైకిల్ యాత్ర ద్వార ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. 

సీఎం జగన్ ను కలవడంపై సంతోషం 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ని కలవటం ఎంతో ఉద్వేగంగా, గర్వంగా ఉందని చెప్పారు. దేశం అభివృద్ధితో పాటు మహిళల భద్రతలాంటి విషయాలపై ముఖ్యమంత్రి  జగన్   అభిప్రాయాలు ఎంతో గొప్పగా ఉన్నాయని ఆమె కొనియాడారు. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలో మహిళల భద్రత కోసం దిశా యాప్‌ ప్రవేశపెట్టటం, మంచి పరిణామమని చెప్పారు.తాను కూడ దిశా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని,పూర్తిగా పరిశీలించానని వెల్లడించారు.దిశ యాప్ ఎంతో గొప్పగా పనిచేస్తోందని ఆశా మాలవ్య కితాబిచ్చారు. ఏపీలో మహిళలు మాత్రమే కాదని, అందరూ సురక్షితంగా ఉన్నారని వివరించారు. తాను తలపెట్టిన సైకిల్ యాత్ర విజయవంతం కావాలని ,భరోసా ఇస్తూ ముఖ్యమంత్రిర జగన్  10లక్షల రూపాయలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి వద్ద ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించానని,అక్కడ నుండి  ప్రత్యేక రక్షణ కల్పించిన ప్రభుత్వానికి ఆశా మాలవ్య ధన్యవాదాలు తెలిపారు. స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిల కోసం ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో మంచిని ఆశా మాలవ్య కితాబిచ్చారు.జగన్‌మోహన్‌రెడ్డిలాంటి మఖ్యమంత్రి దేశానికే ఆదర్శంగా నిలుస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Embed widget