అన్వేషించండి

PDS Rice: ఆత్మకూరు కేంద్రంగా రేషన్ బియ్యం దందా, 432 క్వింటాళ్ల రీసైక్లింగ్ రేషన్ బియ్యం సీజ్

పీడీఎస్‌ బియ్యం రవాణాపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినప్పటికీ రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్‌ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.

పేదల కోసం ఏపీ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరుకులు పక్కదారి పడుతున్నాయి. పీడీఎస్‌ బియ్యం రవాణాపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినప్పటికీ రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్‌ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. దీంతో అక్రమార్కులు రేషన్ బియ్యంతో కాసులు వెనకేసుకుంటున్నారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పలు రైస్ మిల్లుల్లో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. పేదల నుంచి సేకరిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని దళారులు రైస్ మిల్లులకు  విక్రయిస్తున్నారు. ఇక్కడ నుంచి కాకినాడకు యథేచ్ఛగా రేషన్‌ బియ్యం అక్రమంగా రవాణా చేయడం కామన్ అయిపోయిందని విమర్శలు ఉన్నాయి. సివిల్‌ సప్లై అధికారులు, టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు నామమాత్రంగా ఒకటి, రెండు చోట్ల లారీలను, ఆటోలను సీజ్‌ చేస్తున్నప్పటికి అక్రమార్కులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు.
కిలో రూ.15 నుంచి 20 రూపాయలు
తెల్ల కార్డు ఉన్న లబ్దిదారులందరూ రేషన్‌ బియ్యాన్ని వినియోగించుకునే పరిస్థితులు ఇప్పుడు లేవని అంటున్నారు. ఇందుకు కారణాలు అనేకం. దీంతో రేషన్ కార్డుదారుల వద్ద రేషన్‌ బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళుతున్న దళారులు ఇంటింటికీ తిరిగి రేషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్నారు. కిలో రూ.8 నుంచి రూ.10 చొప్పున చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని రైసు మిల్లర్లకు కిలో రూ.15 నుంచి 20 రూపాయలు చొప్పున తిరిగి విక్రయాలు చేస్తున్నారు. ఇలా సేకరించిన రైస్ ను అత్యంత రహస్యంగా దారి మళ్లిస్తున్నారు.
అధికారుల పాత్ర...
ఈ అక్రమ రవాణా వ్యవహరంలో అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ దందా వెనక  పౌరసరఫరాలశాఖ అధికారుల అండదండలతోనే జరుగుతున్నాయని చాలాసార్లు ప్రతిపక్ష పార్టీల నాయకులు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ఈ వ్యవహరంలో రాజకీయ పార్టీ నేతల హస్తం ఉందని విమర్శలు లేకపోలేదు. తాజాగా మంగళగిరిలో రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ దందా వెనక  పౌరసరఫరాలశాఖ అధికారుల అండదండలు  ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు రైస్ మిల్లుల యజమానులు దళారుల ద్వారా  తక్కువ ధరకు రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేయించి ఆపై  తమ మిల్లు పేరుతో ఉన్న లేబుల్‌ బస్తాల్లో నింపి ఎఫ్‌సీఐకి ఇస్తున్నట్లు తెలుస్తోంది. రైస్ మిల్లుల యజమానులు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి కోట్లలో సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్‌ దందాపై ఉక్కుపాదం మోపుతున్నామని పైకి చెబుతున్న పౌరసరఫరాల శాఖ అధికారులు లోపాయికారిగా అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సివిల్‌ సప్లై అధికారులు, టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు ఎన్నిసార్లు దాడులు చేసి రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ను పట్టుకుంటున్నా దందా మాత్రం ఆగడం లేదు. 
ఆత్మకూరు కేంద్రంగా....
తాజాగా ఆత్మకూరు గుంటూరు ఛానల్ వద్ద గల శంకర్ రైస్ మిల్లులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి 432 క్వింటాళ్ల రీసైక్లింగ్ రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. దీంతో మిల్లర్ల దందా ఎంత భారీగా జరుగుతుందో మరోసారి బహిర్గతం అయ్యింది.నిత్యం ఈ తంతు జరుగుతున్నా  సంబంధిత శాఖలకు మిల్లర్లు మామూళ్లు సమర్పించని సమయంలో విజిలెన్స్ అధికారులు చేత ఇలా దాడులు చేయిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేస్తూ కోట్లాది రూపాయలను గడిస్తోన్న రైస్ మిల్లుల పై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ లు వ్యక్తం అవుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget