అన్వేషించండి

PDS Rice: ఆత్మకూరు కేంద్రంగా రేషన్ బియ్యం దందా, 432 క్వింటాళ్ల రీసైక్లింగ్ రేషన్ బియ్యం సీజ్

పీడీఎస్‌ బియ్యం రవాణాపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినప్పటికీ రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్‌ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.

పేదల కోసం ఏపీ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరుకులు పక్కదారి పడుతున్నాయి. పీడీఎస్‌ బియ్యం రవాణాపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినప్పటికీ రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్‌ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. దీంతో అక్రమార్కులు రేషన్ బియ్యంతో కాసులు వెనకేసుకుంటున్నారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పలు రైస్ మిల్లుల్లో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. పేదల నుంచి సేకరిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని దళారులు రైస్ మిల్లులకు  విక్రయిస్తున్నారు. ఇక్కడ నుంచి కాకినాడకు యథేచ్ఛగా రేషన్‌ బియ్యం అక్రమంగా రవాణా చేయడం కామన్ అయిపోయిందని విమర్శలు ఉన్నాయి. సివిల్‌ సప్లై అధికారులు, టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు నామమాత్రంగా ఒకటి, రెండు చోట్ల లారీలను, ఆటోలను సీజ్‌ చేస్తున్నప్పటికి అక్రమార్కులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు.
కిలో రూ.15 నుంచి 20 రూపాయలు
తెల్ల కార్డు ఉన్న లబ్దిదారులందరూ రేషన్‌ బియ్యాన్ని వినియోగించుకునే పరిస్థితులు ఇప్పుడు లేవని అంటున్నారు. ఇందుకు కారణాలు అనేకం. దీంతో రేషన్ కార్డుదారుల వద్ద రేషన్‌ బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళుతున్న దళారులు ఇంటింటికీ తిరిగి రేషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్నారు. కిలో రూ.8 నుంచి రూ.10 చొప్పున చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని రైసు మిల్లర్లకు కిలో రూ.15 నుంచి 20 రూపాయలు చొప్పున తిరిగి విక్రయాలు చేస్తున్నారు. ఇలా సేకరించిన రైస్ ను అత్యంత రహస్యంగా దారి మళ్లిస్తున్నారు.
అధికారుల పాత్ర...
ఈ అక్రమ రవాణా వ్యవహరంలో అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ దందా వెనక  పౌరసరఫరాలశాఖ అధికారుల అండదండలతోనే జరుగుతున్నాయని చాలాసార్లు ప్రతిపక్ష పార్టీల నాయకులు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ఈ వ్యవహరంలో రాజకీయ పార్టీ నేతల హస్తం ఉందని విమర్శలు లేకపోలేదు. తాజాగా మంగళగిరిలో రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ దందా వెనక  పౌరసరఫరాలశాఖ అధికారుల అండదండలు  ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు రైస్ మిల్లుల యజమానులు దళారుల ద్వారా  తక్కువ ధరకు రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేయించి ఆపై  తమ మిల్లు పేరుతో ఉన్న లేబుల్‌ బస్తాల్లో నింపి ఎఫ్‌సీఐకి ఇస్తున్నట్లు తెలుస్తోంది. రైస్ మిల్లుల యజమానులు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి కోట్లలో సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్‌ దందాపై ఉక్కుపాదం మోపుతున్నామని పైకి చెబుతున్న పౌరసరఫరాల శాఖ అధికారులు లోపాయికారిగా అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సివిల్‌ సప్లై అధికారులు, టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు ఎన్నిసార్లు దాడులు చేసి రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ను పట్టుకుంటున్నా దందా మాత్రం ఆగడం లేదు. 
ఆత్మకూరు కేంద్రంగా....
తాజాగా ఆత్మకూరు గుంటూరు ఛానల్ వద్ద గల శంకర్ రైస్ మిల్లులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి 432 క్వింటాళ్ల రీసైక్లింగ్ రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. దీంతో మిల్లర్ల దందా ఎంత భారీగా జరుగుతుందో మరోసారి బహిర్గతం అయ్యింది.నిత్యం ఈ తంతు జరుగుతున్నా  సంబంధిత శాఖలకు మిల్లర్లు మామూళ్లు సమర్పించని సమయంలో విజిలెన్స్ అధికారులు చేత ఇలా దాడులు చేయిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేస్తూ కోట్లాది రూపాయలను గడిస్తోన్న రైస్ మిల్లుల పై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ లు వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Hyderabad News: HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

MS Dhoni To Play IPL 2025: సీఎస్కే ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ధోనీ మిత్రుడు సురేష్ రైనాSunil Nostalgic About His School Days: స్కూల్ రోజుల్లో తనపై ఇన్విజిలేటర్ల ఓపినియనేంటో చెప్పిన సునీల్BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలుRaja Singh Srirama Navami Sobhayatra: శోభాయాత్ర సందడి, యువకులను ఉద్దేశిస్తూ రాజాసింగ్ ప్రసంగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Hyderabad News: HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
Nisha Agarwal : సమ్మర్ స్పెషల్ ఎల్లో ఫ్రాక్​లో సిగ్గు పడుతున్న నిషా అగర్వాల్.. ఫోటోల్లో క్యూట్​గా ఉందిగా
సమ్మర్ స్పెషల్ ఎల్లో ఫ్రాక్​లో సిగ్గు పడుతున్న నిషా అగర్వాల్.. ఫోటోల్లో క్యూట్​గా ఉందిగా
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్ - జులై నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల
శ్రీవారి భక్తులకు అలర్ట్ - జులై నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల
Viral Video: మీకు అవతార్ బిర్యానీ గురించి తెలుసా? భలే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇది - మీరూ ట్రై చేయండి
Viral Video: మీకు అవతార్ బిర్యానీ గురించి తెలుసా? భలే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇది - మీరూ ట్రై చేయండి
ప్రపంచకప్ జట్టులో దినేశ్ కార్తీక్ ఉంటాడా అనే ప్రశ్నకు  రోహిత్ శర్మ ఇచ్చిన ఫన్నీ జవాబు
ప్రపంచకప్ జట్టులో దినేశ్ కార్తీక్ ఉంటాడా అనే ప్రశ్నకు రోహిత్ శర్మ ఇచ్చిన ఫన్నీ జవాబు
Embed widget