అన్వేషించండి

Andhra Pradesh వరద బాధితుల కోసం విజయవాడకు 40 టన్నుల టమోటా

Anantapur News | ఏపీలో భారీ వర్షాలు, వరదలతో ఎక్కువగా నష్టపోయింది విజయవాడకు చెందినవారే. దాంతో అనంతపురం నుంచి 40 టన్నుల టమాటాను విజయవాడ వరద బాధితులకు ఉచితంగా పంపించారు.

Tomota sent to Vijayawada from Anantapur Market | రాప్తాడు: ఏపీలో వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 74 ఏళ్ల వయసులో కూడా నిత్య యువకుడిలా పని చేస్తున్నారని మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. విజయవాడ ప్రాంతంలోని వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా టమోటా మండి ఓనర్స్ అసోసియేషన్ వారు ముందుకొచ్చారు. అనంతపురం మార్కెట్ నుంచి 40 టన్నుల టమోటాను ప్రత్యేక వాహనాల్లో పంపే ఏర్పాట్లు చేశారు. ఈ టమోటాను విజయవాడకు రవాణా చార్జీలు లేకుండా తీసుకెళ్లేందుకు లారీ ఓనర్స్ అసోషియేషన్ వారు ముందుకొచ్చారు. 

అనంతపురం నుంచి విజయవాడకు భారీ సాయం
ఎమ్మెల్యే పరిటాల సునీత చేతుల మీదుగా శుక్రవారం నాడు (సెప్టెంబర్ 6న) వాహనాలను విజయవాడకు పంపారు. సునీత జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ.. కనివినీ ఎరుగని రీతిలో విజయవాడ ప్రాంతంలో వరదలువచ్చి.. వేలాది కుటుంబాలు నిరాశ్రయలుగా మిగిలారు. బాధితుల్ని ఆదుకునేందుకు టమోటా మండి ఓనర్స్ ముందుకు రావడంపై ఆమె అభినందించారు. అలాగే రవాణా సౌకర్యం ఏర్పాటు చేసిన లారీ, ఐచర్ వాహణాల అసోసియేషన్ సభ్యుల్ని కూడా అభినందించారు. ఇంకా చాలా మంది వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు. వీరిని ఆదుకునేందుకు చంద్రబాబు గత ఐదు రోజులుగా అక్కడే ఉన్నారన్నారు. 

గత సీఎం విమానాల్లో పర్యటనలు - ట్రాక్టర్లు, జేసీబీలు ఎక్కుతూ చంద్రబాబు
పగలు, రాత్రి అనే తేడా లేకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. బాధితులను సీఎం చంద్రబాబు ఆదుకుంటున్నారని చెప్పారు. 74 ఏళ్ల వయసులో జేసీబీలు, ట్రాక్టర్లు ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్తున్నారన్నారు. ప్రభుత్వం ఇంత సాయం చేస్తుంటే.. వైసీపీ నేతలు వరదల సమయంలో కూడా బురద రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు వరదలపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై చేస్తున్న వ్యాఖ్యలను వెనుక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్షేత్ర స్థాయికి వెళ్లకుండా విమానాల్లో పర్యటించిన విషయం మరువద్దని వైసీపీ నేతలకు సూచించారు. ఇలాంటి కష్ట సమయంలో కూడా రాజకీయాలు మానకపోతే.. ప్రజలు ఎప్పటికీ క్షమించరని పరిటాల సునీత మండిపడ్డారు.

Also Read: Chandrababu: ఏపీలో వరదలపై ఒక్క రూపాయీ ఇవ్వలేదు - కేంద్రం సాయంపై చంద్రబాబు స్పష్టత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget