అన్వేషించండి

AP PRC: కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి జీతాలు... పట్టువీడని ప్రభుత్వం.. ఆదివారం కూడా విధులకు హాజరైన ట్రెజరీ ఉద్యోగులు..!

కొత్త పీఆర్సీపై ప్రకారమే జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారమే బిల్లులు అప్ లోడ్ చేయాలని ట్రెజరీ ఉద్యోగులను ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఆదివారం కూడా ఉద్యోగులు విధులకు హాజరవ్వాలని ఆదేశించింది.

కొత్త పీఆర్సీపై ఏపీలో ఉద్యోగులు బెట్టు వీడడంలేదు. జీతాల ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలు ససేమీరా అంటున్నారు. 25వ తేదీకే పూర్తి కావాల్సిన ప్రాసెస్ 30వ తేదీ వచ్చినా ఇంకా కొనసాగుతోంది. ఉద్యోగుల సమ్మెకు సంఘీభావంగా ట్రెజరీ ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించడలేదు. దీంతో ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు జీతాల ప్రాసెస్ కు సంబంధించి ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఆదివారం విధులకు హాజరవ్వాలని శనివారం రాత్రి వాట్సప్ మెసేజ్ పంపినట్లు సమాచారం. దీంతో ట్రెజరీ ఉద్యోగులు సెలవు రోజున కూడా విధులకు హాజరయ్యారు. ఉద్యోగులు జీతాలు ప్రాసెస్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్థికశాఖ శనివారం మెమోలు జారీ చేసింది. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పీఆర్సీ జీతాల్లో కొత్త రూపాయి కూడా తగ్గదని ఇప్పటికే మంత్రులు పలుమార్లు స్పష్టం చేశారు. ఉద్యోగులను చర్చలను కావాలని మంత్రులు కమిటీ కోరుతోంది. అయితే పీఆర్సీ జోవోలు రద్దు చేస్తే చర్చలని ఉద్యోగుల సంఘాలు చెబుతున్నాయి. 

కఠిన చర్యలుంటాయని మౌఖిక ఆదేశాలు

ఉద్యోగుల సమ్మె కారణంతో జీతాల ప్రాసెస్ కు ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలు సహకరించడంలేదు. సుమారు 4.5 లక్షల బిల్లులకు కేవలం 1.10 బిల్లులను అయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం పలుమార్లు ట్రెజరీ ఉద్యోగులను హెచ్చరించింది. చివరకి అధికారులపై చర్యలు ఉంటాయని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశాలు కూడా ఇచ్చారు. 11వ పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు అప్‌లోడ్‌ చేయకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని గట్టి సంకేతాలు పంపారు. దీంతో సెలవు రోజున ఆదివారం ట్రెజరీ ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. ముందుగా జడ్జిలు, పోలీసు, మున్సిపల్‌ ఉద్యోగుల జీతాల బిల్లులను అప్‌లోడ్‌ చేస్తున్నారు. 

ఉద్యోగులకు మెమోలు

ఫిబ్రవరి 1వ తేదీ వస్తుండడంతో ఉద్యోగుల జీతాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు పట్టుపడుతున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు ఉంటాయని ప్రభుత్వం అంటోంది. అయితే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయాలంటూ ఇప్పటికే ట్రెజరీ ఉద్యోగులకు, డీడీవోలకు పలుమార్లు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. అయితే శనివారం ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. తక్షణమే జీతాలు ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. పీఆర్సీపై ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్న ఉద్యోగ సంఘాలు, 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు రంగం సిద్ధం చేస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Producers Meeting: పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?
పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?
Breaking News: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్
AP FDC Chairman: ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా
ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mahesh Babu: 'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?
'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Driving Without Insurance: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
AIADMK MLAs resignation: ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
AP FDC Chairman: ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా
ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా
Embed widget