అన్వేషించండి

AP PRC: కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి జీతాలు... పట్టువీడని ప్రభుత్వం.. ఆదివారం కూడా విధులకు హాజరైన ట్రెజరీ ఉద్యోగులు..!

కొత్త పీఆర్సీపై ప్రకారమే జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారమే బిల్లులు అప్ లోడ్ చేయాలని ట్రెజరీ ఉద్యోగులను ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఆదివారం కూడా ఉద్యోగులు విధులకు హాజరవ్వాలని ఆదేశించింది.

కొత్త పీఆర్సీపై ఏపీలో ఉద్యోగులు బెట్టు వీడడంలేదు. జీతాల ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలు ససేమీరా అంటున్నారు. 25వ తేదీకే పూర్తి కావాల్సిన ప్రాసెస్ 30వ తేదీ వచ్చినా ఇంకా కొనసాగుతోంది. ఉద్యోగుల సమ్మెకు సంఘీభావంగా ట్రెజరీ ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించడలేదు. దీంతో ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు జీతాల ప్రాసెస్ కు సంబంధించి ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఆదివారం విధులకు హాజరవ్వాలని శనివారం రాత్రి వాట్సప్ మెసేజ్ పంపినట్లు సమాచారం. దీంతో ట్రెజరీ ఉద్యోగులు సెలవు రోజున కూడా విధులకు హాజరయ్యారు. ఉద్యోగులు జీతాలు ప్రాసెస్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్థికశాఖ శనివారం మెమోలు జారీ చేసింది. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పీఆర్సీ జీతాల్లో కొత్త రూపాయి కూడా తగ్గదని ఇప్పటికే మంత్రులు పలుమార్లు స్పష్టం చేశారు. ఉద్యోగులను చర్చలను కావాలని మంత్రులు కమిటీ కోరుతోంది. అయితే పీఆర్సీ జోవోలు రద్దు చేస్తే చర్చలని ఉద్యోగుల సంఘాలు చెబుతున్నాయి. 

కఠిన చర్యలుంటాయని మౌఖిక ఆదేశాలు

ఉద్యోగుల సమ్మె కారణంతో జీతాల ప్రాసెస్ కు ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలు సహకరించడంలేదు. సుమారు 4.5 లక్షల బిల్లులకు కేవలం 1.10 బిల్లులను అయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం పలుమార్లు ట్రెజరీ ఉద్యోగులను హెచ్చరించింది. చివరకి అధికారులపై చర్యలు ఉంటాయని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశాలు కూడా ఇచ్చారు. 11వ పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు అప్‌లోడ్‌ చేయకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని గట్టి సంకేతాలు పంపారు. దీంతో సెలవు రోజున ఆదివారం ట్రెజరీ ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. ముందుగా జడ్జిలు, పోలీసు, మున్సిపల్‌ ఉద్యోగుల జీతాల బిల్లులను అప్‌లోడ్‌ చేస్తున్నారు. 

ఉద్యోగులకు మెమోలు

ఫిబ్రవరి 1వ తేదీ వస్తుండడంతో ఉద్యోగుల జీతాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు పట్టుపడుతున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు ఉంటాయని ప్రభుత్వం అంటోంది. అయితే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయాలంటూ ఇప్పటికే ట్రెజరీ ఉద్యోగులకు, డీడీవోలకు పలుమార్లు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. అయితే శనివారం ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. తక్షణమే జీతాలు ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. పీఆర్సీపై ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్న ఉద్యోగ సంఘాలు, 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు రంగం సిద్ధం చేస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు ఇబ్రహీంపట్నంలో సీఎం చంద్రబాబు పర్యటన
నేడు ఇబ్రహీంపట్నంలో సీఎం చంద్రబాబు పర్యటన
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
TDP MLAs Dissatisfaction: టీడీపీ ఎమ్మెల్యేల్లో గూడుకట్టుకుపోతున్న అసంతృప్తి - బయటపడుతున్న వారు కొందరే - హైకమాండ్ గుర్తించదా?
టీడీపీ ఎమ్మెల్యేల్లో గూడుకట్టుకుపోతున్న అసంతృప్తి - బయటపడుతున్న వారు కొందరే - హైకమాండ్ గుర్తించదా?
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget