అన్వేషించండి

Kodikathi Case: కోడికత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు - హైకోర్టు కీలక ఆదేశాలు

AndhraPradesh News: కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు గురించి మీడియాతో ఎక్కడా మాట్లాడవద్దని నిందితునికి స్పష్టం చేసింది.

AP High Court Bail To Kodikathi Case Accused Srinivas: కోడికత్తి కేసులో (Kodikathi Case) నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ (Srinivas)కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఏపీ హైకోర్టు (AP HighCourt) గురువారం అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. కేసు గురించి మీడియాతో ఎక్కడా మాట్లాడవద్దని నిందితునికి స్పష్టం చేసింది. రూ.25 వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రతీ ఆదివారం ముమ్మిడివరం పీఎస్ లో హాజరు కావాలని ఆదేశించింది. 2018, అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై  దాడి కేసులో శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై కొద్ది రోజుల క్రితం న్యాయస్థానం విచారణ చేపట్టింది. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని.. దీంతో నిందితుడు ఏళ్ల తరబడి జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఓ హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండడం సరికాదని న్యాయస్థానానికి వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా, నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కుటుంబ సభ్యుల హర్షం

అటు, శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు కావడంపై అతని తల్లి సావిత్రమ్మ, సోదరుడు సంతోషం వ్యక్తం చేశారు. చేయని నేరానికి తన కుమారుడు శిక్ష అనుభవించాడని శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జైలుతో తన కుమారుడి ఆరోగ్యం పాడైపోయిందని అన్నారు. తమకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని శ్రీనివాస్ సోదరుడు తెలిపారు. 

ఇదీ జరిగింది

2018లో వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్నారు. సీబీఐ కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో కోర్టుకు హాజరుకావాల్సి ఉండేది. దీంతో అక్టోబర్ 25న మధ్యాహ్నంలోపు పాదయాత్ర ముగించుకుని విశాఖ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన జగన్ వీఐపీ లాంజ్ లోకి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ టీ, కాఫీలు అందించే ఉద్దేశంతో అక్కడి క్యాంటీన్‌లో పని చేస్తున్న శ్రీను కోడికత్తితో ఆయనపై దాడికి పాల్పడ్డాడు. అయితే వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. చిన్న గాయంతో జగన్ బయటపడ్డారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరి వైద్యం తీసుకున్నారు. వైద్యులు ఆయనకు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. జగన్ విజ్ఞప్తిపై ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు.

ఐదేళ్లుగా జైల్లోనే..

కోడికత్తి కేసులో గత ఐదేళ్లుగా నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శీను జైలులోనే మగ్గుతున్నారు.  బాధితుడిగా ఉన్న సీఎం జగన్ నిరభ్యంతర పత్రం ఇవ్వాలని, బెయిల్‌కు అడ్డంకులు తొలగించాలని అభ్యర్థించినప్పటికీ  సీఎం జగన్ స్పందించలేదు. దీంతో శ్రీనివాస్ రిమాండ్ ఖైదీగానే జైల్లో ఉండిపోయాడు. పలు దఫాలుగా ఎన్ఐఏ కోర్టుల్లో కేసు విచారణ వాయిదా పడుతూ వచ్చింది. గతంలో శీను తల్లి సావిత్రమ్మ సీజేఐకి.. రాష్ట్రపతికి లేఖ రాసినా ప్రయోజనం లేకపోయింది. శ్రీనివాస్ ను విడుదల చేయాలంటూ అతని తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు ఇటీవల విజయవాడలో నిరాహార దీక్షకు సైతం దిగారు. తన తమ్ముడ్ని అడ్డుపెట్టుకుని జగన్ ఎన్నికల్లో  సీఎం అయ్యారని, దళితుడు అనే కారణంతో అందరూ వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడని తల్లి సావిత్రి కన్నీటి పర్యంతమయ్యారు. గత ఐదు సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నాడని...ఏపీ సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదని వాపోయారు. అయితే, ఆమె ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు దీక్ష భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. తాజాగా, నిందితుడు శ్రీనివాస్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కుటుంబ సభ్యులు, దళిత, పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Also Read: BJP With TDP: ఆరు ఎంపీ సీట్ల కోసం బీజేపీ పట్టు- అమిత్‌షా చంద్రబాబు చర్చల తర్వాత లెక్క కుదురినట్టేనా..?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manda Krishna On Revanth: మందకృష్ణ యూటర్న్ - రేవంత్‌కు ఓ సోదరుడిగా అండగా ఉంటానని ప్రకటన !
మందకృష్ణ యూటర్న్ - రేవంత్‌కు ఓ సోదరుడిగా అండగా ఉంటానని ప్రకటన !
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
SSMB 29: మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?
మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?
WhatsApp Governance: వాట్సాప్ ద్వారా ఇంద్రీకలాద్రి సేవలు ప్రారంభం, విజయవాడ దుర్గమ్మ సేవలు ఇలా బుక్ చేసుకోండి
వాట్సాప్ ద్వారా ఇంద్రీకలాద్రి సేవలు ప్రారంభం, విజయవాడ దుర్గమ్మ సేవలు ఇలా బుక్ చేసుకోండి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Chilkur Balaji Temple Rangarajan | రామరాజ్యం స్థాపించటానికి వచ్చాం అంటూ దాడి | ABP DesamVishwak sen on Prudhviraj Controversy | 11 గొర్రెలు కాంట్రవర్సీపై విశ్వక్ సారీ | ABP DesamAllu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manda Krishna On Revanth: మందకృష్ణ యూటర్న్ - రేవంత్‌కు ఓ సోదరుడిగా అండగా ఉంటానని ప్రకటన !
మందకృష్ణ యూటర్న్ - రేవంత్‌కు ఓ సోదరుడిగా అండగా ఉంటానని ప్రకటన !
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
SSMB 29: మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?
మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?
WhatsApp Governance: వాట్సాప్ ద్వారా ఇంద్రీకలాద్రి సేవలు ప్రారంభం, విజయవాడ దుర్గమ్మ సేవలు ఇలా బుక్ చేసుకోండి
వాట్సాప్ ద్వారా ఇంద్రీకలాద్రి సేవలు ప్రారంభం, విజయవాడ దుర్గమ్మ సేవలు ఇలా బుక్ చేసుకోండి
Ram Mohan Naidu At Aero India 2025:
"పైలట్‌ రామ్‌"- 'యశస్' యుద్ధ విమానం నడిపిన కేంద్రమంత్రి
Beer Price Hike: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్, భారీగా పెరిగిన బీర్ల ధరలు - ఒకేసారి అంత పెంచారా!
తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్, భారీగా పెరిగిన బీర్ల ధరలు - ఒకేసారి అంత పెంచారా!
KL Rahul News: ఆ ఇండియన్ ప్లేయర్ తో ఆటాడుకుంటున్నారు.. టీమ్ మేనేజ్మెంట్ దిగ్గజ ప్లేయర్ ఫైర్
ఆ ఇండియన్ ప్లేయర్ తో ఆటాడుకుంటున్నారు.. టీమ్ మేనేజ్మెంట్ దిగ్గజ ప్లేయర్ ఫైర్
Gutha Sukhender Reddy: కుల గణన చారిత్రాత్మకం- ఓటర్ల జనాభాకు, సర్వే లెక్కలకు అసలు పొంతన లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
కుల గణన చారిత్రాత్మకం- ఓటర్ల జనాభాకు, సర్వే లెక్కలకు అసలు పొంతన లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
Embed widget