అన్వేషించండి

AP Hihgcourt : రామోజీరావుపై దాఖలు చేసిన కేసులో సీఐడీకి షాక్ - తదుపరి దర్యాప్తుపై హైకోర్టు స్టే !

మార్గదర్శిపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఎనిమిది వారాల పాటు తదుపరిచర్యలపై హైకోర్టు స్టే విధించింది.


AP Hihgcourt :   రామోజీరావు, శైలజా కిరణ్‌లపై యూరిరెడ్డి అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ నమోదు చేసిన కేసులో తదుపరి దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ డిసెంబర్ ఆరో తేదీకి వాయిదా వేసింది. యూరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే ఇది తప్పుడు కేసు అని మార్గదర్శి సంస్థ హైకోర్టులో క్వాష్  పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిగిన హైకోర్టు... సీఐడీని పలు అంశాలపై ప్రశ్నించింది. అసలు ఈ కేసు నమోదు చేసి పరధి లేకపోయినా కేసు ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించిది. అయితే ఇది చిట్ ఫండ్ కేసు అని సీఐడీ తరపు లాయర్ వాదించారు. చిట్ ఫండ్ కేసు అయితే చిట్ పండ్ చట్టం కిందకు వస్తుంది కదా అని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. క్వాష్ పిటిషన్ పై కౌంటర్ వేయాలని సీఐడీతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి తరపున సిద్ధార్థ లూధ్రా, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. 

మాజీ షేర్ హోల్డర్ యూరి రెడ్డి ఫిర్యాదు

మార్గదర్శి వ్యవస్థాపకులలో ఒకరైన జి. జగన్నాథ రెడ్డి కుమారుడు గాదిరెడ్డి యూరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు, ఆయన కోడలు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్ లపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్ 42O, 467, 120-8, రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజా కిరణ్ ను చేర్చారు. మార్గదర్శిలో తమ షేర్ల వాటాను శైలజ పేరు మీదకి మార్చారని, తనను బెదిరించి బలవంతంగా తన వాటా లాక్కున్నారని యూరిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వాటా షేర్లు రాసివ్వడానికి నిరాకరించడంతో రామోజీరావు తుపాకీతో తనను బెదిరించి, బలవంతంగా లాక్కున్నారని యూరిరెడ్డి ఆరోపిస్తున్నారు. 

బలవతంగా సంతకాలు చేయించుకున్నారన్న యూరి రెడ్డి 

2016 సంవత్సరం నాటికి తన పేరు మీద ఉన్న షేర్ల విలువ రూ.1,59,69,600 ( కోటి 59 లక్షల 69 వేలు) కాగా, రామోజీరావు కేవలం రూ.39,74,000 (39 లక్షల 74 వేలు) యూనియన్ బ్యాంక్ చెక్కు ఇచ్చారని ఫిర్యాదులో తెలిపారు. అయితే తాను సంతకం పెట్టలేదని, తన సంతకం ఫోర్జరీ చేసి తన పేరిట ఉన్న వాటాలను తమకు సంబంధించిన వారి పేరిట మార్చారని యూరిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టిన సమయంలో తన తండ్రి జగన్నాథరెడ్డి రూ.5 వేలు పెట్టుబడి పెట్టారని చెప్పారు. అందుకుగానూ మార్గదర్శిలో తండ్రి జగన్నాథరెడ్డి పేరిట కొన్ని షేర్లు రామోజీరావు ఇచ్చారని తెలిపారు.

ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు పెట్టారని మార్గదర్శి ఆరోపణ

తన తండ్రికి మార్గదర్శిలో షేర్లు ఉన్నాయని తెలిసి అపాయింట్ మెంట్ కోరగా చాలాకాలం రామోజీరావు తమను కలిసేందుకు ఇష్టపడలేదన్నారు. 29 సెప్టెంబర్ 2016లో రామోజీరావును కలిసిన సమయంలో బెదిరించి తన వాటా రాయించుకున్నారని యూరిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇటీవల తమ షేర్‌ హోల్డింగ్‌పై స్పష్టత రావడంతోనే ఫిర్యాదు చేస్తున్నట్లు ఫిర్యాదుదారుడు యూరిరెడ్డి తెలిపారు. తిరిగి 2 అక్టోబర్ 2016న తన తండ్రి వాటను తన పేరిట మార్చాలని సోదరుడికి ఏ ఇబ్బంది లేదని చెప్పాడు. అఫిడవిట్ పై సంతకం చేయాలని రామోజీరావు కోరడంతో, ఓ పేజీ ఖాళీగా ఉందని సంతకం చేయనని చెప్పగా తుపాకీతో ఆయన తనను బెదిరించి సంతకం చేయించుకున్నారని యూరిరెడ్డి ఆరోపిస్తున్నారు. తమ షేర్లు వేరే వాళ్లకు ఇవ్వాలనే ఆలోచన లేకపోవడంతో రామోజీరావు ఇచ్చిన చెక్ ను నగదుగా మార్చలేదని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు యూరిరెడ్డి సీఐడీని ఆశ్రయించారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
8th Pay Commission: 8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
Kantara Chapter 1 Review : 'కాంతార'పై కామెడీ కామెంట్స్ - ఎట్టకేలకు సారీ చెప్పిన బాలీవుడ్ హీరో రణవీర్
'కాంతార'పై కామెడీ కామెంట్స్ - ఎట్టకేలకు సారీ చెప్పిన బాలీవుడ్ హీరో రణవీర్
Advertisement

వీడియోలు

Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
8th Pay Commission: 8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
Kantara Chapter 1 Review : 'కాంతార'పై కామెడీ కామెంట్స్ - ఎట్టకేలకు సారీ చెప్పిన బాలీవుడ్ హీరో రణవీర్
'కాంతార'పై కామెడీ కామెంట్స్ - ఎట్టకేలకు సారీ చెప్పిన బాలీవుడ్ హీరో రణవీర్
Ravi Teja: రవితేజ సినిమాలో హీరోయిన్స్ గోల... క్లారిటీ ఇచ్చిన మాస్‌ మహారాజా టీమ్
రవితేజ సినిమాలో హీరోయిన్స్ గోల... క్లారిటీ ఇచ్చిన మాస్‌ మహారాజా టీమ్
Eluru Railway Station: ఫొటో చూసి గుడి అనుకున్నారా.. ఇది ఏలూరు రైల్వే స్టేషన్, వినూత్న డిజైన్‌తో నిర్మాణం
ఫొటో చూసి గుడి అనుకున్నారా.. ఇది ఏలూరు రైల్వే స్టేషన్, వినూత్న డిజైన్‌తో నిర్మాణం
Quantum Valley Building Designs: అమరావతిలో క్వాంటం వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్ ఇవే.. రాజధానిలో 50 ఎకరాలు కేటాయింపు
అమరావతిలో క్వాంటం వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్ ఇవే.. రాజధానిలో 50 ఎకరాలు కేటాయింపు
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం 1355 మంది ప్లేయర్లు.. వారి కోసం హోరాహోరీ తప్పదా!
ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం 1355 మంది ప్లేయర్లు.. వారి కోసం హోరాహోరీ తప్పదా!
Embed widget