అన్వేషించండి

AP Govt : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, బీసీ జాబితాలోకి మున్నూరు కాపులు!

Munnuru Kapu As Bc D: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్నూరు కాపులకు గుడ్ న్యూస్ చెప్పింది. చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ ను నెరవేర్చింది. మున్నూరు కాపులను బీసీ బాజితాలోకి చేర్చింది. 

Munnuru Kapu As Bc D: ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న మున్నూరు కాపు వర్గీయులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మున్నూరు కాపులను బీసీ జాబితాలో చేరుస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మున్నూరు కాపు కులస్తులను బీసీ-డీ కింద ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు శనివారం రోజు మున్నూరు కాపులకు బీసీ - డీ కింద కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా షేషు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఇటీవలే వరద ప్రాంతాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు మున్నూరు కాపులు వినతి పత్రం ఇచ్చారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ రెడ్డి... బీసీ - డీ సర్టిఫికేట్ ఇచ్చేందుకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే శనివారం మున్నూరు కాపులకు బీసీ - డీ ధ్రువ పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మున్నూరు కాపులు బీసీ కోటాలోనే కొనసాగుతున్నారు. చాలా కాలంగా తెలంగాణలో మున్నురు కాపులను బీసీలుగానే గుర్తిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం మున్నూరు కాపులను అగ్రకులస్థులగా చూస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోనూ మున్నూరు కాపులను బీసీ కోటాలోనే చేర్చాలన్న డిమాండ్ చాలా రోజులుగా ఉంది. ఎప్పటి నుండో ఉన్న ఈ డిమాండ్ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. స్థానిక నాయకులు హామీలు ఇస్తున్నప్పటికీ ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదనలు స్వీకరించలేదు. ఈ క్రమంలోనే మున్నూరు కాపుల ఆశలను, ఆకాంక్షలను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి కోరికను నెరవేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. మున్నూరు కాపులను బీసీ డీ జాబితాలో అధికారికంగా చేర్చారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  మున్నూరు కాపులకు బీసీ - డీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. 

7 మండలాల మున్నూరు కాపులకు..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేశారు. అయితే ఈ ప్రాంతాల్లో ఉండే మున్నూరు కాపులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత కాలం వారిని బీసీలుగానే గుర్తించారు. బీసీలు పొందే ప్రయోజనాలే వారూ పొందారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లూ మున్నూరు కాపులకు అందాయి. కాలేజీలు, విశ్వ విద్యాలయాల్లో బీసీ రిజర్వేషన్లు పొందారు. ఎప్పుడైతే ఆయా ఏడు మండలాలను ఏపీలో కలిపారో.. అక్కడి మున్నూరు కాపులు ఓసీలుగా మారిపోయారు. ముందు పొందిన ప్రయోజనాలు లేకుండా పోయాయి. ముందు పొందిన రిజర్వేషన్లు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో, కాలేజీ సీట్లు పొందడంలో, విశ్వ విద్యాలయం సీట్లు పొందడంలోనూ రిజర్వేషన్లు అమలు కావడం లేదు. ఇలాంటి కారణాల వల్ల ఆయా మండలాల్లోని మున్నూరు కాపులు తమను బీసీ లుగా గుర్తించాలని చాలా కాలంగా కోరుతున్నారు. 

Also Read : Nellore News : నెల్లూరు సిటీలో రసవత్తర రాజకీయం, మాజీ మంత్రి అనిల్ ఇలాకాలో వేరు కుంపటి

Also Read : AP Politics: నన్ను టార్గెట్ చేశారు, నాపై కుట్ర జరుగుతోంది - మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadiyam Kavya: బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiyam Kavya: బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Embed widget