అన్వేషించండి

AP Govt : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, బీసీ జాబితాలోకి మున్నూరు కాపులు!

Munnuru Kapu As Bc D: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్నూరు కాపులకు గుడ్ న్యూస్ చెప్పింది. చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ ను నెరవేర్చింది. మున్నూరు కాపులను బీసీ బాజితాలోకి చేర్చింది. 

Munnuru Kapu As Bc D: ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న మున్నూరు కాపు వర్గీయులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మున్నూరు కాపులను బీసీ జాబితాలో చేరుస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మున్నూరు కాపు కులస్తులను బీసీ-డీ కింద ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు శనివారం రోజు మున్నూరు కాపులకు బీసీ - డీ కింద కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా షేషు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఇటీవలే వరద ప్రాంతాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు మున్నూరు కాపులు వినతి పత్రం ఇచ్చారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ రెడ్డి... బీసీ - డీ సర్టిఫికేట్ ఇచ్చేందుకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే శనివారం మున్నూరు కాపులకు బీసీ - డీ ధ్రువ పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మున్నూరు కాపులు బీసీ కోటాలోనే కొనసాగుతున్నారు. చాలా కాలంగా తెలంగాణలో మున్నురు కాపులను బీసీలుగానే గుర్తిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం మున్నూరు కాపులను అగ్రకులస్థులగా చూస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోనూ మున్నూరు కాపులను బీసీ కోటాలోనే చేర్చాలన్న డిమాండ్ చాలా రోజులుగా ఉంది. ఎప్పటి నుండో ఉన్న ఈ డిమాండ్ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. స్థానిక నాయకులు హామీలు ఇస్తున్నప్పటికీ ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదనలు స్వీకరించలేదు. ఈ క్రమంలోనే మున్నూరు కాపుల ఆశలను, ఆకాంక్షలను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి కోరికను నెరవేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. మున్నూరు కాపులను బీసీ డీ జాబితాలో అధికారికంగా చేర్చారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  మున్నూరు కాపులకు బీసీ - డీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. 

7 మండలాల మున్నూరు కాపులకు..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేశారు. అయితే ఈ ప్రాంతాల్లో ఉండే మున్నూరు కాపులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత కాలం వారిని బీసీలుగానే గుర్తించారు. బీసీలు పొందే ప్రయోజనాలే వారూ పొందారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లూ మున్నూరు కాపులకు అందాయి. కాలేజీలు, విశ్వ విద్యాలయాల్లో బీసీ రిజర్వేషన్లు పొందారు. ఎప్పుడైతే ఆయా ఏడు మండలాలను ఏపీలో కలిపారో.. అక్కడి మున్నూరు కాపులు ఓసీలుగా మారిపోయారు. ముందు పొందిన ప్రయోజనాలు లేకుండా పోయాయి. ముందు పొందిన రిజర్వేషన్లు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో, కాలేజీ సీట్లు పొందడంలో, విశ్వ విద్యాలయం సీట్లు పొందడంలోనూ రిజర్వేషన్లు అమలు కావడం లేదు. ఇలాంటి కారణాల వల్ల ఆయా మండలాల్లోని మున్నూరు కాపులు తమను బీసీ లుగా గుర్తించాలని చాలా కాలంగా కోరుతున్నారు. 

Also Read : Nellore News : నెల్లూరు సిటీలో రసవత్తర రాజకీయం, మాజీ మంత్రి అనిల్ ఇలాకాలో వేరు కుంపటి

Also Read : AP Politics: నన్ను టార్గెట్ చేశారు, నాపై కుట్ర జరుగుతోంది - మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Apple iPhone Record Sales: ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
Embed widget