అన్వేషించండి

AP Employees GPF Money : జీపీఎఫ్ సొమ్ము తీసుకున్నట్లుగా అంగీకరించని ప్రభుత్వం - ఏపీ ఉద్యోగుల్లో టెన్షన్ !

ఉద్యోగుల జీపీఎఫ్ నిధుల మాయంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. విచారణ చేస్తామని ఉద్యోగ నేతలకు ఆర్థిక శాఖ అధికారులకు ముక్తసరిగా సమాధానం ఇచ్చారు.

AP Employees GPF Money :   90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము మాయం అయిన అంశం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ప్రభుత్వం తీసుకున్నట్లుగా అంగీకరిస్తే ఉద్యోగులు రిలాక్స్ గా ఉంటారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతోంది. దాదాపుగా రూ. 800 కోట్లు మాయం కావడంతో ఉద్యోగ సంఘాల నేతలు ఆర్థిక  ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శిని కలిశారు. ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము మాయంపై ఫిర్యాదు చేశారు. 

జీపీఎఫ్ సొమ్ము మాయం కావడంపై ఏమీ తెలియదన్న ఆర్థిక శాఖ

అయితే ఆర్థిక శాక ప్రత్యేక కార్యదర్శి.. అసలు ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము గురించి తమకేమీ తెలియదని తేల్చేశారు.  ఇది ఎలా జరిగిందో తెలియడం లేదనీ.. దీనిపై విచారణ చేసి స్పష్టత ఇస్తామని ఆర్థికశాఖ అధికారులు సమాధానం ఇచ్చారు. పొరపాటు ఎక్కడ జరిగిందో విచారిస్తామని, కింది స్థాయి అధికారుల నుంచి నివేదిక తెప్పించి సమస్యను పరిష్కారిస్తామని చెప్పారు. టెక్నికల్ సమస్య ఏమైనా ఉందేమో తెలుసుకుంటామని చెప్పడంతో ఉద్యోగులు ఏదో తేడా జరుగుతోందన్న అనుమానంలో ఉన్నారు. 

ప్రభుత్వం సరిగ్గా సమధానం చెప్పడం లేదన్న ఉద్యోగ సంఘాల నేతలు

జీపీఎఫ్ ఖాతాలో రూ.800 కోట్లు మాయమైనట్లు భావిస్తున్నామని  ఆర్థికశాఖ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు.  ఉద్యోగుల అకౌంట్‌ను హ్యాకింగ్ చేసినట్లు భావిస్తున్నామని  ఉద్యోగ నేత సూర్యనారాయణ చెప్పారు.  ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.  గతేడాది వలే ఈ ఏడాదీ మా ఖాతాల్లో సొమ్ము పోయిందిని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎఫ్ఎంఎస్ చేసిన పని రాజ్యాంగ విరుద్ధమని.. పొరపాట్లు చేస్తున్న వారిపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు.

సీఎంఎఫ్‌ఎస్‌లో సమస్య కావొచ్చని కొంత మంది ఉద్యోగ నేతల వివరణ

ఇంత జరిగినా ఏమీ తెలియనట్లుగా ఆర్థిక శాఖ అధికారులు చెబుతూండటంతో ఉద్యోగులు గందరగోళంలో ఉన్నారు. సీఎఫ్‌ఎంఎస్‌లో పొరపాటు జరిగిందని అధికారులు చెబుతున్నారని..  ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని మరికొంత మంది ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు. అప్పుల లెక్కలు సరి చేసేందుకు ఇలా జీపీఎఫ్ సొమ్మును మళ్లిస్తున్నారని..  ఆడిట్ పూర్తయిన తర్వాత మళ్లీ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తున్నారన్న  ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఉద్యోగుల అకౌంట్లలో నగదు వారి అనుమతి లేకుండా తరలించడం చట్టవిరుద్ధం. ఈ అంశంపై ఫిర్యాదు చేయాలని ఉద్యోగులు భావిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget