అన్వేషించండి

వైజాగ్‌లో సెలబ్రేషన్, భోగి మంటల్లో జీఓలు వేసిన పరిటాల సునీత

Makar Sankranti 2024: వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ పాలనంతా చీకటి జీఓలు, కక్ష సాధింపులకే పరిమితమయ్యారని మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతపురం: ఏపీలో సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ పాలనంతా చీకటి జీఓలు, కక్ష సాధింపులకే పరిమితమయ్యారని మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత పనుల నిమిత్తం వైజాగ్ లో ఉన్న ఆమె రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భోగిమంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ఇటీవల తీసుకొచ్చిన చీకటి జీఓలను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. 

గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులే 
వైసీపీ ప్రభుత్వం (YSRCP Government) తీసుకొచ్చిన జీఓలను భోగి మంటల్లో వేసి కాల్చేసిన తరువాత పరిటాల సునీత మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనలో అనేక జీఓల ద్వారా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. కేవలం ప్రజలతో మాత్రమే కాకుండా వారి పక్షాన నిలబడుతున్న ప్రతిపక్షాలను కూడా అణిచివేసేందుకు దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జీఓలు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఓ-1 ద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఎన్నోసార్లు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, జీఓలపై హైకోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వంలో మాత్రం కనీస స్పందన లేదని పరిటాల సునీత విమర్శించారు. 

వైజాగ్‌లో సెలబ్రేషన్, భోగి మంటల్లో జీఓలు వేసిన పరిటాల సునీత
ఇసుక మీదే 40 వేల కోట్ల దోపిడీ
ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక ఇసుక మీదే 40 వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని ఆరోపణలు ఉన్నాయని ఇక మిగిలిన అంశాల మీద ఎంత దోపిడీ జరిగిందో ఊహించలేమన్నారు. కేవలం జగన్ రెడ్డి మాత్రమే కాకుండా.. ఆయన ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలుగా మారి దోపిడీ చేశారని విమర్శించారు. రానున్న సంవత్సరంలోనైనా ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని... చీకటిలో మగ్గిపోతున్న తెలుగు ప్రజల జీవితాల్లో ఆనంద వెలుగులు నింపవలసిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. పాడి పంటలు, ధాన్యం రాశులు, చక్కని సంస్కృతి, సాంప్రదాయాల మధ్య సంక్రాంతి ఆనందాల్లో మునిగి తేలాల్సిన ఆంధ్రప్రదేశ్ ను సీఎం వైఎస్ జగన్ రెడ్డి రూ.10లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత సైతం వైసీపీకి దక్కుతుందన్నారు.
రాష్ట్ర యువత భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారు!
రైతుల మెడకు ఉరితాళ్లు బిగించి.. గంజాయి, డ్రగ్స్ వంటి వికృత సంస్కృతిని తెచ్చి రాష్ట్ర యువత భవిష్యత్తును సర్వనాశనం చేశాడని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి పైశాచిక ఆనందం పొందారని చెప్పారు. ఈ దుర్మార్గాలన్నీ ఈ భోగి మంటల్లో కాలిపోవాలని... రాష్ట్రాన్ని దుష్టపాలన నుండి విడిపించి... ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి పౌరుడు ముందుకు రావాలన్నారు. 2025 సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలంతా సంతోషంగా గడుపుకోవాలంటే... ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు వచ్చే సంక్రాంతి పండుగకు రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చంద్రబాబు పని చేస్తారని ఆమె అన్నారు.
Also Read: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ నేతలు, పండుగకు ఏపీకి వచ్చారు: మంత్రి రోజా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Vijaya ghee issue: విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వీట్
విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వీట్

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget