అన్వేషించండి

వైజాగ్‌లో సెలబ్రేషన్, భోగి మంటల్లో జీఓలు వేసిన పరిటాల సునీత

Makar Sankranti 2024: వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ పాలనంతా చీకటి జీఓలు, కక్ష సాధింపులకే పరిమితమయ్యారని మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతపురం: ఏపీలో సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ పాలనంతా చీకటి జీఓలు, కక్ష సాధింపులకే పరిమితమయ్యారని మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత పనుల నిమిత్తం వైజాగ్ లో ఉన్న ఆమె రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భోగిమంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ఇటీవల తీసుకొచ్చిన చీకటి జీఓలను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. 

గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులే 
వైసీపీ ప్రభుత్వం (YSRCP Government) తీసుకొచ్చిన జీఓలను భోగి మంటల్లో వేసి కాల్చేసిన తరువాత పరిటాల సునీత మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనలో అనేక జీఓల ద్వారా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. కేవలం ప్రజలతో మాత్రమే కాకుండా వారి పక్షాన నిలబడుతున్న ప్రతిపక్షాలను కూడా అణిచివేసేందుకు దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జీఓలు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఓ-1 ద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఎన్నోసార్లు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, జీఓలపై హైకోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వంలో మాత్రం కనీస స్పందన లేదని పరిటాల సునీత విమర్శించారు. 

వైజాగ్‌లో సెలబ్రేషన్, భోగి మంటల్లో జీఓలు వేసిన పరిటాల సునీత
ఇసుక మీదే 40 వేల కోట్ల దోపిడీ
ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక ఇసుక మీదే 40 వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని ఆరోపణలు ఉన్నాయని ఇక మిగిలిన అంశాల మీద ఎంత దోపిడీ జరిగిందో ఊహించలేమన్నారు. కేవలం జగన్ రెడ్డి మాత్రమే కాకుండా.. ఆయన ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలుగా మారి దోపిడీ చేశారని విమర్శించారు. రానున్న సంవత్సరంలోనైనా ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని... చీకటిలో మగ్గిపోతున్న తెలుగు ప్రజల జీవితాల్లో ఆనంద వెలుగులు నింపవలసిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. పాడి పంటలు, ధాన్యం రాశులు, చక్కని సంస్కృతి, సాంప్రదాయాల మధ్య సంక్రాంతి ఆనందాల్లో మునిగి తేలాల్సిన ఆంధ్రప్రదేశ్ ను సీఎం వైఎస్ జగన్ రెడ్డి రూ.10లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత సైతం వైసీపీకి దక్కుతుందన్నారు.
రాష్ట్ర యువత భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారు!
రైతుల మెడకు ఉరితాళ్లు బిగించి.. గంజాయి, డ్రగ్స్ వంటి వికృత సంస్కృతిని తెచ్చి రాష్ట్ర యువత భవిష్యత్తును సర్వనాశనం చేశాడని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి పైశాచిక ఆనందం పొందారని చెప్పారు. ఈ దుర్మార్గాలన్నీ ఈ భోగి మంటల్లో కాలిపోవాలని... రాష్ట్రాన్ని దుష్టపాలన నుండి విడిపించి... ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి పౌరుడు ముందుకు రావాలన్నారు. 2025 సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలంతా సంతోషంగా గడుపుకోవాలంటే... ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు వచ్చే సంక్రాంతి పండుగకు రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చంద్రబాబు పని చేస్తారని ఆమె అన్నారు.
Also Read: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ నేతలు, పండుగకు ఏపీకి వచ్చారు: మంత్రి రోజా

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
YS Jagan On TET Exam: టీచర్ల టెట్ నిబంధనలపై జగన్ ఫైర్! చంద్రబాబు తీరుపై మండిపడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత ఘాటు ట్వీట్!
టీచర్ల టెట్ నిబంధనలపై జగన్ ఫైర్! చంద్రబాబు తీరుపై మండిపడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత ఘాటు ట్వీట్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget