అన్వేషించండి

AP Election News: కౌంటింగ్ వేళ రాజకీయ పార్టీలకు ఈసీ గుడ్ న్యూస్, లోనికి వారికి ఛాన్స్

Telugu News: ఏపీలో ఎన్నికల లెక్కింపు జరుగుతున్న సమయంలో మరో ఏజెంట్‌కు నియమించుకోవడం కోసం రాజకీయ పార్టీలకు ఈసీ అనుమతి ఇచ్చింది.

Election Counting in AP: ఏపీలో ఓట్ల లెక్కింపు జరిగే వేళ ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు ఓ వెసులుబాటు కల్పించింది. జూన్ 4 మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్ సభ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలో ఈసీ రాజకీయ పార్టీలకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ కేంద్రంలో మరో ఏజెంట్‌కు నియమించుకోవడం కోసం రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ దగ్గర మరో ఏజెంట్‌ను పార్టీలు నియమించుకోవచ్చని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం వెల్లడించింది. 

అభ్యర్థి లేని సమయంలో మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించుకునేలా రాజకీయ పార్టీల ఏజెంట్‌లకు అవకాశం కల్పించినట్లుగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మరోవైపు, కౌంటింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘట నలకు తావులేకుండా ముడంచెల భద్రతను ఎన్నికల సంఘం కేంద్ర భద్రతా సంస్థల సాయంతో ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఐడీ కార్డులు, ప్రత్యేక పాసులు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించేలా కఠినంగా వ్యవహరించనున్నారు. ఈ విషయంలో ఎవరు ఆలసత్వంగా వ్యవహరించినా వారిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కలెక్టర్‌, ఎస్పీలు హెచ్చరికలు జారీ చేశారు.

ఏజెంట్ ఎవరంటే..
ఓట్ల లెక్కింపు సమయంలో రాజకీయ పార్టీలు పంపిన ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తారు. కౌంటింగ్ కేంద్రాల్లో వీరు అన్ని విషయాలను క్షుణ్నంగా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎన్డీయే కూటమి, అధికార వైసీపీ అభ్యర్థులు తమకు, తమ పార్టీకి విధేయులుగా ఉన్న వారిని ఇప్పటికే కౌంటింగ్‌ ఏజెంట్లుగా నియమించుకున్నారు. వీరు కౌంటింగ్‌ కేంద్రాల్లో ఉండి అప్రమత్తంగా వ్యవహరిస్తుండాలి. 

ఈ క్రమంలో ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు వారి ఏజెంట్లకు గత 3 రోజుల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆదివారం కూడా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీల అభ్యర్థులు ఏజెంట్లకు శిక్షణనిచ్చే పనిలోనే ఉన్నారు. ఎక్కడా ఏమరుపాటుకు తావులేకుండా... చర్చలకు తావివ్వకుండా జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను ఆయా పార్టీల అభ్యర్థులు వారి వారి ఏజెంట్లకు వివరించడం గమనార్హం.

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: 20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget