అన్వేషించండి

AP Election News: కౌంటింగ్ వేళ రాజకీయ పార్టీలకు ఈసీ గుడ్ న్యూస్, లోనికి వారికి ఛాన్స్

Telugu News: ఏపీలో ఎన్నికల లెక్కింపు జరుగుతున్న సమయంలో మరో ఏజెంట్‌కు నియమించుకోవడం కోసం రాజకీయ పార్టీలకు ఈసీ అనుమతి ఇచ్చింది.

Election Counting in AP: ఏపీలో ఓట్ల లెక్కింపు జరిగే వేళ ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు ఓ వెసులుబాటు కల్పించింది. జూన్ 4 మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్ సభ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలో ఈసీ రాజకీయ పార్టీలకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ కేంద్రంలో మరో ఏజెంట్‌కు నియమించుకోవడం కోసం రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ దగ్గర మరో ఏజెంట్‌ను పార్టీలు నియమించుకోవచ్చని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం వెల్లడించింది. 

అభ్యర్థి లేని సమయంలో మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించుకునేలా రాజకీయ పార్టీల ఏజెంట్‌లకు అవకాశం కల్పించినట్లుగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మరోవైపు, కౌంటింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘట నలకు తావులేకుండా ముడంచెల భద్రతను ఎన్నికల సంఘం కేంద్ర భద్రతా సంస్థల సాయంతో ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఐడీ కార్డులు, ప్రత్యేక పాసులు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించేలా కఠినంగా వ్యవహరించనున్నారు. ఈ విషయంలో ఎవరు ఆలసత్వంగా వ్యవహరించినా వారిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కలెక్టర్‌, ఎస్పీలు హెచ్చరికలు జారీ చేశారు.

ఏజెంట్ ఎవరంటే..
ఓట్ల లెక్కింపు సమయంలో రాజకీయ పార్టీలు పంపిన ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తారు. కౌంటింగ్ కేంద్రాల్లో వీరు అన్ని విషయాలను క్షుణ్నంగా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎన్డీయే కూటమి, అధికార వైసీపీ అభ్యర్థులు తమకు, తమ పార్టీకి విధేయులుగా ఉన్న వారిని ఇప్పటికే కౌంటింగ్‌ ఏజెంట్లుగా నియమించుకున్నారు. వీరు కౌంటింగ్‌ కేంద్రాల్లో ఉండి అప్రమత్తంగా వ్యవహరిస్తుండాలి. 

ఈ క్రమంలో ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు వారి ఏజెంట్లకు గత 3 రోజుల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆదివారం కూడా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీల అభ్యర్థులు ఏజెంట్లకు శిక్షణనిచ్చే పనిలోనే ఉన్నారు. ఎక్కడా ఏమరుపాటుకు తావులేకుండా... చర్చలకు తావివ్వకుండా జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను ఆయా పార్టీల అభ్యర్థులు వారి వారి ఏజెంట్లకు వివరించడం గమనార్హం.

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 31 ఏళ్ల కిందట సీఎంగా తొలిసారి.. ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు
31 ఏళ్ల కిందట సీఎంగా తొలిసారి.. ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు
Kotamreddy On Vijayasai Reddy Sajjala Issue: చొక్కా పట్టుకుని కొట్టారు.. విజయసాయిరెడ్డి-సజ్జల వివాదంపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
చొక్కా పట్టుకుని కొట్టారు.. విజయసాయిరెడ్డి-సజ్జల వివాదంపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
APSRTC: ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. వినూత్న ప్రయోగానికి ఆర్టీసీ నిర్ణయం
ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. వినూత్న ప్రయోగానికి ఆర్టీసీ నిర్ణయం
Vijayawada Crime News: పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న సిబ్బంది
పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న సిబ్బంది

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Politics: ఢిల్లీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ ఏం చెబుతారు! కొండా సురేఖ వెనక్కి తగ్గుతారా..
ఢిల్లీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ ఏం చెబుతారు! కొండా సురేఖ వెనక్కి తగ్గుతారా..
Vijayawada Crime News: పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న సిబ్బంది
పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న సిబ్బంది
CM Chandrababu: 31 ఏళ్ల కిందట సీఎంగా తొలిసారి.. ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు
31 ఏళ్ల కిందట సీఎంగా తొలిసారి.. ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు
Sadhguru Donation to Nepal: నేపాల్ వరద భాదితులకు సద్గురు రూ.1 కోటి విరాళం, 5 దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటుకు పిలుపు
నేపాల్ వరద భాదితులకు సద్గురు రూ.1 కోటి విరాళం, 5 దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటుకు పిలుపు
Vijay TVK Prime Minister candidate: ఢిల్లీ పీఠంపై మిత్రపక్షాల పేచీ - రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయంగా విజయ్ రేసులోకి రాగలరా?
ఢిల్లీ పీఠంపై మిత్రపక్షాల పేచీ - రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయంగా విజయ్ రేసులోకి రాగలరా?
Kakinada News: కాకినాడలో లవ్ జిహాద్ కలకలం! ఆరుగురితో సహజీవనం చేసి మత మార్పిడి.. భర్తపై వివాహిత ఆరోపణలు
కాకినాడలో లవ్ జిహాద్ కలకలం! ఆరుగురితో సహజీవనం చేసి మత మార్పిడి.. భర్తపై వివాహిత ఆరోపణలు
Jago Telangana Yatra: ఇంద్రవెల్లి నుంచి జోగులాంబ వరకు 15000 కిలోమీటర్లు జాగో తెలంగాణ యాత్ర, ఉద్దేశం ఏంటీ
ఇంద్రవెల్లి నుంచి జోగులాంబ వరకు 15000 కిలోమీటర్లు జాగో తెలంగాణ యాత్ర, ఉద్దేశం ఏంటీ
Kavitha: హరీష్, సంతోష్‌లను క్షమిస్తానేమో! ఆయనకు మాత్రం నా ఉసురు తగులుతుంది: కవిత
హరీష్, సంతోష్‌లను క్షమిస్తానేమో! ఆయనకు మాత్రం నా ఉసురు తగులుతుంది: కవిత
Embed widget