అన్వేషించండి

AP Dairy Farmers Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విత్తనాలపై 75 శాతం రాయితీ, దాణాపై 50 శాతం సబ్సిడీ

Andhra Pradesh News | రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పశుగ్రాసం విత్తనాలపై 75 శాతం రాయితీ, దాణాపై 50 శాతం సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపింది.

AP Farmers Scheme | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమం కోసం అవసరమైన ఓ పథకాన్ని ప్రారంభించింది. పశువుల ఆరోగ్య సంరక్షణకు ఉచితంగా టీకాలు, మందులు మాత్రమే కాకుండా, పశుగ్రాసం కోసం విత్తనాలు, పశువుల దాణాపై భారీగా రాయితీలు అందిస్తోంది. ఈ పథకం ద్వారా పాడి రైతులకు ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది.

పశుగ్రాస విత్తనాలపై 75 శాతం సబ్సిడీ
పశుగ్రాసం విత్తనాలపై ఏపీ ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ అందిస్తోంది. హైబ్రీడ్ జొన్న, మొక్కజొన్న విత్తనాలను తక్కువ ధరకు రైతులకు అందించనుంది. ఉదాహరణకు, జొన్న విత్తనాల 5 కిలోల ప్యాకెట్ ధర రూ.460 కాగా, రైతులు చెల్లించాల్సిన వాటా కేవలం రూ.115 మాత్రమే. అలాగే, మొక్కజొన్న విత్తనాల 5 కిలోల ప్యాకెట్ ధర రూ.340 కాగా, రైతు చెల్లించాల్సింది రూ.85 మాత్రమే. ప్రతి రైతు కనీసం 5 కేజీల నుంచి గరిష్టంగా 20 కేజీల వరకు విత్తనాలు పొందవచ్చు.

పశువుల దాణాపై 50 శాతం రాయితీ
పశువుల దాణా విషయానికి వస్తే, సమీకృత దాణాపై 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు. దాణా బస్తా ధర రూ.1,110 కాగా, రైతులు సగం ధర అంటే రూ.555 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి రైతు 1 క్వింటా నుంచి 1.5 క్వింటాళ్ల వరకు దాణా పొందవచ్చు. ఇది పశువుల పోషణను మెరుగుపరచడంలో రైతులకు ఎంతో సహాయపడుతుంది.

రైతులు ఎలా పొందాలి? కావాల్సిన పత్రాలు ఇవే
ఈ రాయితీలను పొందడానికి రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రం (RBK)ను సంప్రదించాలి. వారికి అవసరమైన పత్రాలు ఏంటంటే.. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు ఫొటోకాపీలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అర్హత కలిగిన రైతులు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు.

సర్వే చేపట్టిన ప్రభుత్వం
ఇక రైతుల అవసరాలను అంచనా వేసేందుకు పశుసంవర్ధక శాఖ ఈ నెల 15వ తేదీ వరకు ఏపీ వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తోంది. AHAs మరియు పారా సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పాడి రైతులకు ఆర్థికంగా పెద్ద ఊరట కలిగించనుంది. కనుక రైతులు ఆలస్యం చేయకుండా తమ సమీప RBKను సంప్రదించి రాయితీపై విత్తనాలు, దాణా పొందాలని అధికారులు సూచించారు.

రైతుల కొత్త స్కీమ్ ముఖ్యాంశాలు
పశుగ్రాస విత్తనాలపై రైతులకు 75% రాయితీ
సమీకృత దాణాపై రైతులకు 50% సబ్సిడీ
ఉచిత టీకాలు, ఆరోగ్య పరీక్షలు చేస్తారు
ఈ నెల 15 వరకు ఏపీ వ్యాప్తంగా సర్వే చేయనున్న అధికారులు    

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Bandla Ganesh Vs Prakash Raj: దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Visakhapatnam Earthquake: విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Embed widget