అన్వేషించండి

AP Dairy Farmers Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విత్తనాలపై 75 శాతం రాయితీ, దాణాపై 50 శాతం సబ్సిడీ

Andhra Pradesh News | రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పశుగ్రాసం విత్తనాలపై 75 శాతం రాయితీ, దాణాపై 50 శాతం సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపింది.

AP Farmers Scheme | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమం కోసం అవసరమైన ఓ పథకాన్ని ప్రారంభించింది. పశువుల ఆరోగ్య సంరక్షణకు ఉచితంగా టీకాలు, మందులు మాత్రమే కాకుండా, పశుగ్రాసం కోసం విత్తనాలు, పశువుల దాణాపై భారీగా రాయితీలు అందిస్తోంది. ఈ పథకం ద్వారా పాడి రైతులకు ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది.

పశుగ్రాస విత్తనాలపై 75 శాతం సబ్సిడీ
పశుగ్రాసం విత్తనాలపై ఏపీ ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ అందిస్తోంది. హైబ్రీడ్ జొన్న, మొక్కజొన్న విత్తనాలను తక్కువ ధరకు రైతులకు అందించనుంది. ఉదాహరణకు, జొన్న విత్తనాల 5 కిలోల ప్యాకెట్ ధర రూ.460 కాగా, రైతులు చెల్లించాల్సిన వాటా కేవలం రూ.115 మాత్రమే. అలాగే, మొక్కజొన్న విత్తనాల 5 కిలోల ప్యాకెట్ ధర రూ.340 కాగా, రైతు చెల్లించాల్సింది రూ.85 మాత్రమే. ప్రతి రైతు కనీసం 5 కేజీల నుంచి గరిష్టంగా 20 కేజీల వరకు విత్తనాలు పొందవచ్చు.

పశువుల దాణాపై 50 శాతం రాయితీ
పశువుల దాణా విషయానికి వస్తే, సమీకృత దాణాపై 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు. దాణా బస్తా ధర రూ.1,110 కాగా, రైతులు సగం ధర అంటే రూ.555 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి రైతు 1 క్వింటా నుంచి 1.5 క్వింటాళ్ల వరకు దాణా పొందవచ్చు. ఇది పశువుల పోషణను మెరుగుపరచడంలో రైతులకు ఎంతో సహాయపడుతుంది.

రైతులు ఎలా పొందాలి? కావాల్సిన పత్రాలు ఇవే
ఈ రాయితీలను పొందడానికి రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రం (RBK)ను సంప్రదించాలి. వారికి అవసరమైన పత్రాలు ఏంటంటే.. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు ఫొటోకాపీలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అర్హత కలిగిన రైతులు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు.

సర్వే చేపట్టిన ప్రభుత్వం
ఇక రైతుల అవసరాలను అంచనా వేసేందుకు పశుసంవర్ధక శాఖ ఈ నెల 15వ తేదీ వరకు ఏపీ వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తోంది. AHAs మరియు పారా సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పాడి రైతులకు ఆర్థికంగా పెద్ద ఊరట కలిగించనుంది. కనుక రైతులు ఆలస్యం చేయకుండా తమ సమీప RBKను సంప్రదించి రాయితీపై విత్తనాలు, దాణా పొందాలని అధికారులు సూచించారు.

రైతుల కొత్త స్కీమ్ ముఖ్యాంశాలు
పశుగ్రాస విత్తనాలపై రైతులకు 75% రాయితీ
సమీకృత దాణాపై రైతులకు 50% సబ్సిడీ
ఉచిత టీకాలు, ఆరోగ్య పరీక్షలు చేస్తారు
ఈ నెల 15 వరకు ఏపీ వ్యాప్తంగా సర్వే చేయనున్న అధికారులు    

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
Women Reservation AP: ఏపీలో మహిళా నేతల విశ్వరూపం ఖాయం - లోకేష్ ప్రకటనే కాదు కార్యాచరణ కూడా - పక్కా ప్లానే ?
ఏపీలో మహిళా నేతల విశ్వరూపం ఖాయం - లోకేష్ ప్రకటనే కాదు కార్యాచరణ కూడా - పక్కా ప్లానే ?
AP Local Elections: ఏపీ స్థానిక సమరానికి జగన్ సై - ఏకగ్రీవాలుండవ్ - కానీ క్యాడర్ ధైర్యం చేస్తుందా?
ఏపీ స్థానిక సమరానికి జగన్ సై - ఏకగ్రీవాలుండవ్ - కానీ క్యాడర్ ధైర్యం చేస్తుందా?
Breaking News: తుమ్మిడిహెట్టి వివాదంపై చర్చలకు సిద్ధమని మహారాష్ట్ర సీఎంకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ
తుమ్మిడిహెట్టి వివాదంపై చర్చలకు సిద్ధమని మహారాష్ట్ర సీఎంకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy strategy 2026: రేవంత్ సర్కార్ మైలేజీ మ్యాజిక్ - సునీల్ కనుగోలుతో కలిసి కొత్త ప్లాన్ - ఇమేజ్ మారిపోతుందా?
రేవంత్ సర్కార్ మైలేజీ మ్యాజిక్ - సునీల్ కనుగోలుతో కలిసి కొత్త ప్లాన్ - ఇమేజ్ మారిపోతుందా?
Women Reservation AP: ఏపీలో మహిళా నేతల విశ్వరూపం ఖాయం - లోకేష్ ప్రకటనే కాదు కార్యాచరణ కూడా - పక్కా ప్లానే ?
ఏపీలో మహిళా నేతల విశ్వరూపం ఖాయం - లోకేష్ ప్రకటనే కాదు కార్యాచరణ కూడా - పక్కా ప్లానే ?
US Attacks Iran:హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి - కింద పడ్డ ఫ్యాన్‌‌కు హీరో చేయూత
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి - కింద పడ్డ ఫ్యాన్‌‌కు హీరో చేయూత
Drishyam 3 Collections: 'దృశ్యం 3' @ 180 కోట్లు... స్టడీగా మోహన్ లాల్ సినిమా కలెక్షన్లు... ఏడో రోజు ఎంత వచ్చిందంటే?
'దృశ్యం 3' @ 180 కోట్లు... స్టడీగా మోహన్ లాల్ సినిమా కలెక్షన్లు... ఏడో రోజు ఎంత వచ్చిందంటే?
2026 జూన్‌లో ఎవరి ఉద్యోగాలు సురక్షితం, ఎవరివి ప్రమాదంలో పడతాయ్?
2026 జూన్‌లో ఎవరి ఉద్యోగాలు సురక్షితం, ఎవరివి ప్రమాదంలో పడతాయ్?
Chandrayaan-2 Discovery Ice on Moon:చంద్రుడి దక్షిణ ధ్రువంలో భారీగా మంచు! చంద్రయాన్ -2 ఆర్బిటర్ పంపిన అద్భుత డేటా!
చంద్రుడి దక్షిణ ధ్రువంలో భారీగా మంచు! చంద్రయాన్ -2 ఆర్బిటర్ పంపిన అద్భుత డేటా!
Trump Threatens Oman:ట్రంప్ నెక్స్ట్‌ టార్గెట్ ఒమన్! హోర్ముజ్ జలసంధిపై మాట వినకపోతే తుడిచిపెట్టేస్తామని హెచ్చరిక!
ట్రంప్ నెక్స్ట్‌ టార్గెట్ ఒమన్! హోర్ముజ్ జలసంధిపై మాట వినకపోతే తుడిచిపెట్టేస్తామని హెచ్చరిక!
Embed widget