అన్వేషించండి

AP Assembly Session 2022: వైఎస్ఆర్-రోశయ్య మంచి స్నేహితులు, విద్యార్థి నాయకుడి నుంచి సీఎం వరకూ ఎదిగారు : సీఎం జగన్

AP Assembly Session 2022: మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. సభలో సంతాప తీర్మానంపై సీఎం జగన్ మాట్లాడారు. రోశయ్య, వైఎస్ఆర్ మంచి స్నేహితులని గుర్తుచేసుకున్నారు.

AP Assembly Session 2022: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(Konijeti Roshaiah) మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై సభలో సీఎం వైఎస్‌ జగన్‌(CM YS Jagan) మాట్లాడారు. రోశయ్య విద్యార్థి నాయకుడు స్థాయి నుంచి ముఖ్యమంత్రి, చివరకు గవర్నర్‌గా ఎదిగారని సీఎం జగన్ అన్నారు. ఆయన ఏ బాధ్యత నిర్వర్తించినా అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఉమ్మడి ఏపీలో ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద రోశయ్య పనిచేశారన్నారు. వైఎస్సార్‌(YSR) హయాంలో రోశయ్య ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారని సీఎం గుర్తుచేసుకున్నారు. ఇరువురి మధ్య మంచి సంబంధాలు ఉండేవన్నారు. ఇద్దరూ మంచి స్నేహితులని సీఎం జగన్ అన్నారు. అలాంటి ఆయన ఇవాళ మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. 

మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం 

అసెంబ్లీ సమావేశాల్లో ఇటీవల మృతి చెందిన మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సంతాపం తెలిపారు. వల్లూరి నారాయణమూర్తి, వీవీఎస్‌ఎస్‌ చౌదరి, కడప ప్రభాకర్‌రెడ్డి, మంగమూరి శ్రీధర కృష్ణారెడ్డి, గారపాటి సాంబశివరావు, టీఎన్‌ అనసూయమ్మ, పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి, యల్లసిరి శ్రీనివాసులురెడ్డి, యడ్లపాటి వెంకట్రావు మృతికి సభలో సంతాపం తెలిపారు. అనంతరం స్పీకర్‌ తమ్మినేని సీతారాం సూచనతో సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

టీడీపీ తీరుపై సీఎం జగన్ సీరియస్ 

గవర్నర్ ప్రసంగం(Governor Speech)పై చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి శాసనసభలో ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు గవర్నర్‌ ప్రసంగం సమయంలో టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును శ్రీకాంత్‌రెడ్డి తప్పుపట్టారు. అనంతరం మాట్లాడిన సీఎం జగన్... టీడీపీ సభ్యులు అనుచిత ప్రవర్తనతో గవర్నర్‌ను అవమానించారని మండిపడ్డారు. చంద్రబాబు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో ఆయనకే తెలియట్లేదన్నారు. గవర్నర్‌ వయసుకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరికీ ఉందన్న సీఎం.. గవర్నర్‌ పట్ల ఇలాంటి ప్రవర్తన గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ ఈ విధంగా ప్రవర్తించలేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలంటే చంద్రబాబుకు కడుపు మంట అని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు(Chandrbabu) దిగజారుడు రాజకీయాలకు ఈ సంఘటన నిదర్శనమన్నారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు పథకం మాత్రమే గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు టీడీపీ(TDP) ఎప్పుడూ విలువ ఇవ్వలేదన్నారు. ఏ ఎన్నికల్లో అయినా ప్రజలు వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారన్నారు. 87 మున్సిపాలిటీలకు 84 గెలిచామన్నారు. 12 కార్పొరేషన్లలలో వైసీపీ గెలుచుకుందన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
Embed widget