అన్వేషించండి

Vangalapudi Anitha: 'కక్ష సాధింపు ఉంటే ఇంతవరకా?' - 'రెడ్ బుక్'పై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

Andhrapradesh News: 'రెడ్ బుక్' అంశంపై రాష్ట్ర హోంమంత్రి అనిత గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు కక్ష సాధింపులు తెలియవని.. అయితే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలుంటాయన్నారు.

Home Minister Vangalapudi Anitha Comments On Red Book: 'తమకు కక్ష సాధింపు, ప్రతీకారం ఉంటే ఇంతవరకూ ఆగుతామా.?' అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అన్నారు. గురువారం డీజీపీ, ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తొలిసారిగా 'రెడ్ బుక్'పై స్పందించిన ఆమె.. అది కక్ష సాధింపు చర్యలకు కాదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా పని చేసిన అధికారులపై చట్టపరంగా చర్యలుంటాయని స్పష్టం చేశారు. తాము ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎంతోమందిని అరెస్ట్ చెయ్యొచ్చని.. కానీ ఎక్కడా కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని చెప్పారు. తమ నాయకుడు, సీఎం చంద్రబాబు చెప్పిన ప్రకారం రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తామని తెలిపారు. 

'ఆ 4 అంశాలే ఎజెండా'

రాష్ట్రంలో 4 అంశాలను ఎజెండాగా పెట్టుకుని ముందుకెళ్తున్నామని హోం మంత్రి అనిత వెల్లడించారు. మహిళలకు రక్షణ, గంజాయి నిర్మూలన, పోలీసుల సంక్షేమం, పోలీస్ శాఖలో నియమకాల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 'గత ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా వైఫల్యం చేయించారు. ఆ శాఖకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించటంలో వైఫల్యం చెందారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ 12 రోజుల్లో చాలా అంశాలను పరిశీలించాను. పోలీస్ అకాడమీ లేదు, గ్రేహౌండ్స్ అకాడమీ లేదు. కేంద్రం నుంచి నిధులొచ్చినా పోలీస్ అకాడమీ నిర్మించలేదు. గత ఐదేళ్లలో హోంగార్డులు, కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. వైసీపీ హయాంలో పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారు. నేటికీ విశాఖ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ రేకుల షెడ్డులోనే నడుస్తోంది. ఎస్కార్ట్ వాహనాలు కూడా పనిచేయడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. 2014లో ఇచ్చిన వాహనాలనే ఇప్పటికీ వాడుతున్నారు. పోలీస్ స్టేషన్లలో మెయింటెనెన్స్ ఖర్చు రూ.8 వేలు కూడా ఇవ్వలేదు.' అని పేర్కొన్నారు.

సచివాలయాల్లో మహిళా పోలీసులపై

ఎలాంటి శిక్షణ లేకుండా సచివాలయాల్లో మహిళా పోలీసులను పెట్టారని.. ఏ విధంగా వారు పోలీసు విధులు నిర్వహిస్తారని హోంమంత్రి అన్నారు. వారి సేవలు ఏ విధంగా వినియోగించాలనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గంజాయి రవాణా బాగా పెరిగిందని.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్‌లో రాష్ట్రాన్ని మూడో స్థానంలోకి తెచ్చారని అన్నారు. గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని.. ఇప్పటికే ఉప సంఘం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రజల భాగస్వామ్యంతోనే గంజాయిని అరికట్టే వీలుంటుందని అన్నారు. మంచి ఆలోచనలతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని స్పష్టం చేశారు.

'రాజకీయాలు చెయ్యొద్దు'

పోలీసులు రాజకీయాలు చెయ్యొద్దని.. వారి విధులు వారు బాధ్యతగా నిర్వర్తించాలని మంత్రి అనిత సూచించారు. 'ప్రజలు ధైర్యంగా స్టేషన్‌‍కు వెళ్లి బాధలు చెప్పుకొనేలా భరోసా ఇవ్వాలి. పోలీస్ సిబ్బంది ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలి. ఇకపై ఫ్రెండ్లీ పోలీసింగ్ రావాలి. సోషల్ మీడియాలో నేనూ ఓ బాధితురాలినే. కొంతమంది ఐపీఎస్ అధికారుల తీరుతో పోలీస్ వ్యవస్థకే  చెడ్డపేరు వస్తోంది. గత ప్రభుత్వంలో నాపైనే అక్రమంగా కేసులు నమోదు చేశారు. అసభ్య పోస్టులపై విచారించి చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో దిశ చట్టమే లేదు. ఇక ఆ స్టేషన్ల పేరు కూడా మార్చే ఆలోచన చేస్తాం.' అని తెలిపారు.

Also Read: CS Neerabh Kumar: ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం పొడిగింపు - కేంద్రం కీలక ఉత్తర్వులు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget