By: ABP Desam | Updated at : 01 Aug 2021 08:38 AM (IST)
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
AP New DA : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నెల నెలా వచ్చే కరవు భత్యాన్ని (డ్రాట్ అలవెన్స్) 3.144 శాతం చొప్పున పెంచుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో ఉద్యోగుల కరవు భత్యం వారి కనీస (బేసిక్) జీతంలో 30.392 శాతం నుంచి 33.536 శాతానికి చేరుకున్నట్లయింది. అయితే, ఈ పెంచిన డీఏ 2019 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వుల్లో స్పష్టంగా వివరించారు. తాజాగా పెంచిన డీఏతోనే జులై నెల జీతాలు, పింఛన్లను ఇవ్వనున్నారు.
అయితే, 2019 జనవరి నుంచి డీఏను పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో అప్పటి నుంచి 2021 జూన్ వరకు ఉన్న డీఏ బకాయిలను పింఛను దార్లకు, సీపీఎస్ ఉద్యోగులకు మూడు విడతల్లో అందజేయనున్నారు. అలాగే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఉన్న ఉద్యోగులకు కూడా బకాయిలను మూడు విడతలుగా వారి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమ చేస్తారు.
Also Read: Case On JC : మీసం మెలేసినా కేసు పెడతారా..? జేసీ ప్రభాకర్ పై పెట్టిన కేసులో నిజమేంటి..?
హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) గడువు కూడా పెంపు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివచ్చిన ఉద్యోగులకు ఇస్తున్న 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ)ను ఇంకో ఏడాది పాటు కొనసాగిస్తూ ఆర్థిక శాఖ మరో ఉత్తర్వు విడుదల చేసింది. హైదరాబాద్లోని సచివాలయం, శాఖల ప్రధాన కార్యాలయాల నుంచి వచ్చి.. అమరావతి, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోని ప్రధాన కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి 2021 జూలై 1 నుంచి ఏడాది పాటు 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ) అమల్లో ఉండనుంది.
సంతోషం వ్యక్తం చేసిన ఉద్యోగులు
కరవు భత్యం పెంపు, బకాయిల చెల్లింపుతోపాటు 30 శాతం హెచ్ఆర్ఏను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఈ మేరకు వారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉందని వారు అన్నారు. ఉద్యోగుల సమస్యలను గురువారం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామి రెడ్డి మీడియాతో అన్నారు.
Also Read: Devineni Issue : దేవినేని ఉమకు జైల్లో హాని..! కుటుంబసభ్యులకు అనుమానం అందుకే..!?
Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు
Anantapur News: వైద్యం వికటించి చిన్నారికి తీవ్ర అస్వస్థత, అధికారులు పట్టించుకోలేదని ఫ్యామిలీ ఆందోళన
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం
AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Chandrababu : తిరుమలకు చంద్రబాబు - వరుసగా ఐదో తేదీ వరకూ ఆలయాల సందర్శన !
Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?
Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం
Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!
Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!
/body>