అన్వేషించండి

Andhra News: 'అధికారం అండగా రూ.4 లక్షల కోట్ల ప్రజాధనం లూటీ' - సీఎం జగన్ పై అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు

Atchennaidu Comments: సీఎం జగన్ అధికారాన్ని అడ్డు పెట్టుకుని రూ.4 లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా మారారని అన్నారు.

Atchennaidu Criticise CM Jagan: తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని సీఎం జగన్ రూ.లక్షల కోట్లు దోచుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ఒకప్పుడు పేదరికంలో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5 లక్షల కోట్లు ఆర్జించింది. 2003లో వైఎస్ కుటుంబం రూ.9.19 లక్షలకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసింది. 2004 ఎన్నికల సమయంలో డబ్బుల్లేక ఇబ్బంది పడింది. ఆ టైంలో వారి ఇల్లు అమ్మేందుకు కూడా సిద్ధపడ్డారు. పాదయాత్రతో వైఎస్ ప్రజలను మభ్యపెట్టారు. అధికారంలోకి వచ్చాక పరిస్థితి అంతా మారిపోయింది.' అని వెల్లడించారు.

'హామీల పేరుతో దోపిడీ'

ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్, సీఎం అయ్యాక రూ.4 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. దేశంలోనే సంపన్న సీఎంగా మారారని మండిపడ్డారు. రాష్ట్రంలో కనీసం అభివృద్ధి లేదని, అధికారం అండతో యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

'సీబీఐ వాయిదాలకు వెళ్లడం లేదు'

'2004లో వైఎస్‌ అధికారంలోకి వచ్చాక, జగన్‌ రూ.లక్ష కోట్లు సంపాదించారు. క్విడ్‌ప్రోకో కింద సీబీఐ 11 కేసులు నమోదు చేసింది. 8 ఛార్జ్‌షీట్లు దాఖలు చేసి రూ.45 వేల కోట్ల ఆస్తులను సీబీఐ అధికారులు సీజ్‌ చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక సీబీఐ వాయిదాలకు హాజరు కావడం లేదు.' అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో పేపర్లు, సిమెంట్ కంపెనీలు పెట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ గుర్తు మీద గెలిచిన ఎంపీనే జగన్ అవినీతిపై విచారణ జరపాలని కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని, అధికారంలోకి వచ్చాక 341 సార్లు కేసుల్లో వాయిదా కోరి న్యాయస్థానానికి వెళ్లకుండా మోసం చేశారన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. సీఎం జగన్ కేసుల్లో న్యాయ సమీక్ష చేయించాలని డిమాండ్ చేశారు. అవినీతిపై కోర్టులో వేసిన నోటీసుపై సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

27 నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర

మరోవైపు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కాబోతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పాదయాత్రను నిలిపేసిన ఆయన తిరిగి ప్రారంభించనున్నారు.  ఈ మేరకు టీడీపీ రూట్ మ్యాప్ విడుదల చేసింది. ఈ యాత్ర ఉమ్మడి తూ.గో జిల్లాలోని రాజోలు మండలం పొదలాడ నుంచి ప్రారంభం కానుంది. చంద్రబాబును అరెస్టు రోజే లోకేశ్ తన యాత్రను పొదలాడలో నిలిపివేశారు. దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి   పాదయాత్ర ప్రారంభం కానుంది. తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో లోకేశ్ పాదయాత్ర ముగియనుంది.  

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

Also Read: Chandrababu Naidu: రేపు ఢిల్లీకి చంద్రబాబు, సిద్ధార్థ్ లుత్రా కుమారుడి రిసెప్షన్‌కు హాజరు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan Tour: సీఎం జగన్ విదేశీ టూర్‌కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
సీఎం జగన్ విదేశీ టూర్‌కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Delhi Fire Accident: ఢిల్లీలోని ఐటీవోలో ఘోర అగ్నిప్రమాదం, మంటల్ని ఆర్పుతున్న 21 ఫైరింజన్లు
ఢిల్లీలోని ఐటీవోలో ఘోర అగ్నిప్రమాదం, మంటల్ని ఆర్పుతున్న 21 ఫైరింజన్లు
Upasana: ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని - క్లింకారను ఒంటరిగా వదిలి వెళ్లేటప్పుడు తనకంటే ఎక్కువ ఏడుస్తాం..
ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని - క్లింకారను ఒంటరిగా వదిలి వెళ్లేటప్పుడు తనకంటే ఎక్కువ ఏడుస్తాం..
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Attack on Pulivarthi Nani | Tirupati |  చంద్రగరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి | ABP DesamPalnadu Fight Between ysrcp and tdp | పల్నాడులో ఆగని హింస.. వైసీపీ కార్యకర్తలపై దాడులు  | ABP DesamAttack on Pulivarthi Nani | Tirupati |  చంద్రగరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి | ABP DesamPM Modi Files Nomination From Varanasi | ఎన్డీయే మిత్రపక్షాలతో మోదీ..ఘనంగా నామినేషన్ కార్యక్రమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan Tour: సీఎం జగన్ విదేశీ టూర్‌కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
సీఎం జగన్ విదేశీ టూర్‌కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Delhi Fire Accident: ఢిల్లీలోని ఐటీవోలో ఘోర అగ్నిప్రమాదం, మంటల్ని ఆర్పుతున్న 21 ఫైరింజన్లు
ఢిల్లీలోని ఐటీవోలో ఘోర అగ్నిప్రమాదం, మంటల్ని ఆర్పుతున్న 21 ఫైరింజన్లు
Upasana: ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని - క్లింకారను ఒంటరిగా వదిలి వెళ్లేటప్పుడు తనకంటే ఎక్కువ ఏడుస్తాం..
ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని - క్లింకారను ఒంటరిగా వదిలి వెళ్లేటప్పుడు తనకంటే ఎక్కువ ఏడుస్తాం..
Pulivarthi Nani: టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి, కారు ధ్వంసం - గాల్లోకి కాల్పులు!
టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి, కారు ధ్వంసం - గాల్లోకి కాల్పులు!
Pig Kidney Transplant Dies : బతికించేందుకు పంది కిడ్నీని పెట్టారు.. ఆపరేషన్ సక్సెస్ కానీ పేషంట్ చనిపోయాడు.. ఎందుకంటే?
బతికించేందుకు పంది కిడ్నీని పెట్టారు.. ఆపరేషన్ సక్సెస్ కానీ పేషంట్ చనిపోయాడు.. ఎందుకంటే?
Modi Nominations Updates: వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధానమంత్రి మోదీ- అట్టహసంగా కార్యక్రమం
వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధానమంత్రి మోదీ- అట్టహసంగా కార్యక్రమం
AP Polling 2024 Updates: ఘర్షణలు దాటుకొని ఓటేసిన ప్రజలు- సహకరించిన సూర్యుడు, వరుణుడు
ఘర్షణలు దాటుకొని ఓటేసిన ప్రజలు- సహకరించిన సూర్యుడు, వరుణుడు
Embed widget