Breaking News: ప్రధానమంత్రితో సీఎం కేసీఆర్ భేటీ.. తెలుగు రాష్ట్రాల జలవివాదంపై చర్చ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 3న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగాం మండలం లట్టిగాం వద్ద బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను పలాస మండలం చిన్నబడాం వాసులుగా గుర్తించారు.
Modi KCR: ప్రధానమంత్రితో తెలంగాణ సీఎం సమావేశం
ఢిల్లీలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రా మధ్య నెలకొన్న జలవివాదాలపై చర్చించారు. తెలంగాణకు రావాల్సిన నిధుల అంశంపై మెమొరాండం ఇచ్చినట్టు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి బోర్డు విడుదల చేసిన గెజిట్పై తమ అభ్యంతరాన్ని ప్రధానికి కేసీఆర్ వివరించినట్టు తెలుస్తోంది.
కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు సహా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా సంస్థల పున:ప్రారంభంపై శుక్రవారం సీఎస్ సోమేశ్ సమీక్ష చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బందికి వంద శాతం టీకాలు వేయించాలని అధికారులను ఆదేశించారు. టీకాలు వేయించుకున్నట్లు పాఠశాలల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంతేకాక విద్యాసంస్థలను ప్రతిరోజూ శుభ్రపరచాలని కూడా సీఎస్ ఆదేశించారు.





















