By: ABP Desam | Updated at : 03 May 2023 12:24 PM (IST)
గత ప్రభుత్వ నిర్ణయాలపై వేసిన సిట్ను సమర్ధించిన సుప్రీం- హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేత
గత ప్రభుత్వం హయాంలో జరిగిన పనులపై ప్రస్తుతం జగన్ ప్రభుత్వం వేసిన సిట్ వేయడంపై సుప్రీం కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ తీర్పు వెల్లడించింది. హైకోర్టు తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చాలా పనుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వం గతేడాది సిట్ ఏర్పాటు చేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణంసహా భారీ ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది.
ఈ సిట్ ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీన్ని విచారించిన జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజాధనం దుర్వినియోగం, వృథా, దురుద్దేశం వంటి అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దని అంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా అని ప్రశ్నించింది. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం కరెక్టు కాదని చెప్పింది సుప్రీంకోర్టు.
Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు
YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !
AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్ పరీక్ష, హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి!
చంద్రబాబుతో పొత్తు వద్దు- అధిష్ఠానానికి ఏపీ బీజేపీలోని ఓ వర్గం లీడర్ల సూచన !
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్నగర్ టూర్లో కేటీఆర్
KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్
IND VS AUS: మొదటి సెషన్ మనదే - నాలుగు వికెట్లు తీసిన బౌలర్లు - ఇక నుంచి కీలకం!
Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్లో కాల్మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్