అన్వేషించండి

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

Michaung cyclone : మిగ్‌జాం తీవ్ర తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని రెండు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.

Michaung Cyclone Effect In Andhra Pradesh And Telangana :పశ్చిమబంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్‌జాం తీవ్ర తుపానుగా మారుతోంది. చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 90కిలోమీటర్లు దూరంలో నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో పుదుచ్చేరికి 200 కిలోమీటర్ల దూరాన బాపట్లకు 300కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుపాను వేగంగా దూసుకొస్తోంది. బాపట్ల దివిసీమ మధ్యలోనే మంగళవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. 

తీరం దాటే ప్రాంతంలో భారీ ఆస్తి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో అధికారులను అప్రమత్తం చేసింది. ఈ తుపాను ప్రభావంతో తెలంగాణలో కూడా రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని చెబుతోంది. అక్కడ కూడా అధికారులు అప్రమతంగా ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమతం చేయాలని చెబుతోంది. 

తుపాను ప్రభావంతో తీర ప్రాంతంలో అలజడి మొదలైంది. సముద్రపు అలలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నారు. ఈ ప్రమాదకర పరిస్థితిలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుక ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నిజాంపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో పదో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు కృష్ణ పట్నంలో 8 హెచ్చరిగా ఎగరేశారు. మిగతా పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. 

తీర్ప ప్రాంతంలోని చాలా జిల్లాలో వర్షాలు ఊపందుకున్నాయి. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగతా కోస్తా ప్రాంతాల్లో వాతావరణం చాలా గంభీరంగా ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. తుపాను ప్రభావం తగ్గే వరకు వరి కోతలు వద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే కోత చేసిన వాళ్లు వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెబుతున్నారు. 

తుపాను ప్రభావం తిరుమలపై గట్టిగానే ఉంది. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. దీంతో ఏఎన్సి కాటేజ్, బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద భారీ వృక్షాలు నెలకొరిగాయి. దీని వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు వృక్షాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్దరించారు. 

భారీగా కురుస్తున్న వర్షాలకు తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. పాపవినాశనం మార్గంలోని పలు ప్రదేశాల్లో చెట్లు కూలి పోవడంతో పాపవినాశనం వైపుగా భక్తులను వెళ్లనియ్యడం లేదు. సందర్శనీయ ప్రదేశాలైన శ్రీపాదాలు, శిలాతోరణానికి కూడ భక్తులను వెళ్లనియ్యకుండా అడ్డుకుంటున్నారు. 

నెల్లూరు నగరంలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు తిష్టవేసింది. ప్రధాన రహదారులపై కూడా ప్రయాణం నరకంగా మారింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాదచారులు కూడా ఇబ్బందులు పడ్డారు. వర్షం వస్తే నగరంలోని అండర్ బ్రిడ్జ్‌లు నీట మునుగుతాయి. ఇక్కడ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. వర్షం వచ్చిన ప్రతిసారీ ఈ సమస్య ఉండేదే అయినా నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో మిచౌంగ్ తుపాను ప్రభావం కొనసాగుతున్న ఈ సమయంలో నెల్లూరు అండర్ బ్రిడ్జ్ లు నీట మునిగాయి. నగర వాసులకు నరకం చూపించాయి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

First GBS Death in Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
Pushpa 2 Thanks Meet: 'పుష్ప 3 సినిమా ఓ అద్భుతం' - అందరూ గర్వపడేలా చేస్తానన్న బన్నీ, 'బాలీవుడ్'పై కామెంట్స్ వైరల్
'పుష్ప 3 సినిమా ఓ అద్భుతం' - అందరూ గర్వపడేలా చేస్తానన్న బన్నీ, 'బాలీవుడ్'పై కామెంట్స్ వైరల్
Caribbean Earthquake: కరేబియన్‌ సముద్రంలో 8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
కరేబియన్‌ సముద్రంలో 8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
Tirumala News: ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త,  ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులకు బ్రేక్‌ దర్శనం కోటా పెంపు
ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులకు బ్రేక్‌ దర్శనం కోటా పెంపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

AAP Loss Yamuna Pollution Key Role | Delhi Election Results 2025లో కేజ్రీకి కలిసి రాని యమున | ABP DesamArvind Kejriwal on AAP Election Loss | ఆమ్ ఆద్మీ ఓటమిపై స్పందించిన కేజ్రీవాల్ | ABP DesamDelhi Elections Results 2025 | మాస్టర్ మైండ్ Manish Sisodia ను వీక్ చేశారు..ఆప్ ను గద్దె దింపేశారు | ABP DesamDelhi Elections Results 2025 | Delhi గద్దె Arvind Kejriwal దిగిపోయేలా చేసింది ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
First GBS Death in Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
Pushpa 2 Thanks Meet: 'పుష్ప 3 సినిమా ఓ అద్భుతం' - అందరూ గర్వపడేలా చేస్తానన్న బన్నీ, 'బాలీవుడ్'పై కామెంట్స్ వైరల్
'పుష్ప 3 సినిమా ఓ అద్భుతం' - అందరూ గర్వపడేలా చేస్తానన్న బన్నీ, 'బాలీవుడ్'పై కామెంట్స్ వైరల్
Caribbean Earthquake: కరేబియన్‌ సముద్రంలో 8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
కరేబియన్‌ సముద్రంలో 8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
Tirumala News: ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త,  ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులకు బ్రేక్‌ దర్శనం కోటా పెంపు
ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులకు బ్రేక్‌ దర్శనం కోటా పెంపు
Ration Card Online Apply Telangana: మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేయడానికి లేదు- తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ
మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేయడానికి లేదు- తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ
Delhi Election Result 2025: ఢిల్లీ ఫలితాలు అన్నా హజారేను సంతోష పెట్టి ఉంటాయి- 'ఆప్ అవినీతి పార్టీ, కాంగ్రెస్ పరాన్నజీవి', ప్రధాని మోదీ విమర్శలు
ఢిల్లీ ఫలితాలు అన్నా హజారేను సంతోష పెట్టి ఉంటాయి- 'ఆప్ అవినీతి పార్టీ, కాంగ్రెస్ పరాన్నజీవి', ప్రధాని మోదీ విమర్శలు
Kiran Royal: వివాదంలో జనసేన నేత కిరణ్ రాయల్ - డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదన్న మహిళ
వివాదంలో జనసేన నేత కిరణ్ రాయల్ - డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదన్న మహిళ
Andhra Pradesh: కూటమి ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేరు -  పేదల ప్రాణాలను కాపాడేలా ఉచితంగా ఖరీదైన ఇంజక్షన్
కూటమి ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేరు - పేదల ప్రాణాలను కాపాడేలా ఉచితంగా ఖరీదైన ఇంజక్షన్
Embed widget