అన్వేషించండి

Nara Lokesh: విద్యా దీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కీమ్ అమలు: మంత్రి నారా లోకేష్

Andhra Pradesh News | విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు బదులుగా ఏపీలో పాత ఫీజు రీయింబర్స్ మెంట్ స్కీమ్ ద్వారా విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు చెల్లించాలని ఏపీ మంత్రి నారా లోకేష్ సమీక్షించారు.

Vidya Deevena in Andhra Pradesh | అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ విధానంపై ఫోకస్ చేసింది. విద్యార్థులకు ట్యూషన్ ఫీజు అందేలా చేయడంలో భాగంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఉన్నతవిద్య శాఖపై అధికారులతో మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు. విద్యా దీవెన, వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ (Fee Reimbursement) విధానాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ విధానం అమలు చేసేందుకు విధివిధానాలను రూపొందించాలని ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... వసతి దీవెన, విద్యాదీవెన సంబంధించి వైసీపీ ప్రభుత్వం 3,480 కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. బకాయిల కారణంగా విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా కాలేజీల్లో నిలిచిపోయినట్లు తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైందన్నారు. ఏపీలో కళాశాలల్లో డ్రగ్స్ ను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లు నియామించిన సరేనన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టం, సమస్యలు, కేసులపై విద్యార్థులకు అవేర్ నెస్ తెచ్చేందుకు స్వచ్చంద సంస్థల సహకారం తీసుకోవాలని మంత్రి లోకేష్ చెప్పారు. 

Nara Lokesh: విద్యా దీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కీమ్ అమలు: మంత్రి నారా లోకేష్

లెక్చరర్ పోస్టుల భర్తీపై చర్చ 
ఏపీలో 3,220 లెక్చరర్ పోస్టుల భర్తీకి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి లోకేష్ ఈ సమావేశంలో చర్చించారు. న్యాయపరమైన చిక్కులను తొలగించి సాధ్యమైనంత త్వరగా పోస్టులను భర్తీ చేయాలన్నారు. పూర్తి పారదర్శకంగా, టాలెంట్ ఆధారంగా లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఉండాలని అధికారులకు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. యూనివర్సిటీలకు సంబంధించి అకడమిక్, ఎగ్జామినేషన్ షెడ్యూలు, క్యాలండర్ తయారుచేయాలని సూచించారు. దాంతో విద్యార్థులకు నిర్ణీత సమయంలో పరీక్షలు నిర్వహణ, ఫలితాల వెల్లడికి తేలికగా ఉంటుందని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని అన్నారు.
ప్రవేశాలు తగ్గిపోవడంపై లోకేష్ ఆందోళన
రాష్ట్రంలో గత అయిదేళ్లుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గిపోవడంపై మంత్రి లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్ గా తీసుకుని, అడ్మిషన్ల పెంపుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఉన్నత విద్యా సంస్థల వివరాలు, మౌలిక సదుపాయాలు, అడ్మిషన్లు, కోర్టు కేసుల వివరాలు డ్యాష్ బోర్డులో పొందుపర్చాలని అన్నారు.

యూనివర్సిటీల ఏర్పాటుపై చర్చ
ఇంజనీరింగ్ కాలేజీలలో అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజులు ఏమేరకు ఉండాలనే అంశాలపై సమావేశంలో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఏపీలోని ప్రైవేటు యూనివర్సిటీల పనితీరు, అప్రెంటీస్ షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ కు కాలేజీల సెలక్షన్, రాష్ట్రంలో శ్రీ పొట్టిశ్రీరాములు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం లాంటి అంశాలపై సమీక్షించారు. మంత్రి లోకేష్ నిర్వహించిన ఈ సమావేశంలో ఉన్నత విద్య కార్యదర్శి సౌరబ్ గౌర్, ఉన్నత విద్యశాఖ ఇన్ ఛార్జి చైర్మన్ రామ్మోహన్ రావు, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ బి.నవ్య తదితరులు పాల్గొన్నారు.

Also Read: https://telugu.abplive.com/andhra-pradesh/ap-cabinet-key-decisions-latest-updates-171676

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Letter To Revanth: ఫార్ములా-ఈ రేస్‌పై చర్చకు సిద్దమా? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR Letter To Revanth: ఫార్ములా-ఈ రేస్‌పై చర్చకు సిద్దమా? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Ravichandran Ashwin: అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
Thandel Second Single: కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Letter To Revanth: ఫార్ములా-ఈ రేస్‌పై చర్చకు సిద్దమా? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR Letter To Revanth: ఫార్ములా-ఈ రేస్‌పై చర్చకు సిద్దమా? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Ravichandran Ashwin: అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
Thandel Second Single: కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Best Mobiles Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - వివో నుంచి మోటో వరకు!
రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - వివో నుంచి మోటో వరకు!
Embed widget