అన్వేషించండి

Guntur Mishap: అమరావతి రోడ్డులో విషాదం, మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు మృతి, శిథిలాల కింద ముగ్గురు !

Guntur Tragedy: అమరావతి రోడ్డులోని ముత్యాలరెడ్డి నగర్‌లో భవన నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా మట్టి పెళ్లలు విరిగిపడగా ఒకరు మరణించారు.

Guntur Tragedy 2 Labour Dies: గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. అమరావతి రోడ్డు (Amaravati Road In Guntur)లోని ముత్యాలరెడ్డి నగర్‌లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మట్టిపెళ్లల కింద చిక్కుకున్న చిక్కుకున్న కూలీలను బయటకు తీసేందుకు సహాచక చర్యలు చేపట్టారు. ఈ కూలీ ఉపాధి కోసం బిహార్ (Bihar Labour) నుంచి ఇక్కడికి వలస వచ్చారు. మరో డెడ్‌బాడీని వెలికి తీసినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరుకోగా, మిగతా కూలీలు సైతం చనిపోయి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
గుంటూరు జిల్లా అమరావతి రోడ్డులో కొత్త నిర్మాణాలు చేపట్టారు. ఇందుకోసం ముత్యాలరెడ్డి నగర్‌లో పెద్ద భవనాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా 40అడుగుల మేర పునాదులు తవ్వుతుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగిపడడ్డాయి. ఈ ప్రమాదంలో మొదట ఒకరు చనిపోగా, మరో నలుగురు కూలీలు గాయపడ్డట్లు సమాచారం. మట్టిపెళ్లల కింద చిక్కుకున్న కూలీలను వెలికి తీసేందుకు సహాయచర్యలు చేపట్టగా మరో కూలి డెడ్‌బాడీ లభ్యమైంది. అక్కడే ఉన్న ఇద్దరు కూలీలు అప్రమత్తం కావడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

షాపింగ్ మాల్ కోసం పనులు.. పూర్తి నిర్లక్ష్యం..
ఎస్వీ బిల్డర్స్ అండ్ అసోసియేషన్ అమరావతి రోడ్డులో ఈ నిర్మాణ పనులు చేపట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా తెలుసుకున్నారు. షాపింగ్ మాల్ నిర్మాణం కోసం దాదాపు 40 అడుగుల మేర లోతుగా తవ్వుతుండగా కార్మికులపై మట్టిపెళ్లలు విరిగిపడటంతో విషాదం జరిగింది. కూలీ భద్రతకు సంబంధించి ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. తలకు ఎలాంటి హెల్మెట్ లేకుండా కార్మికులు పనిచేస్తున్నారని గుర్తించారు. ఇది పూర్తిగా నిర్లక్ష్యం, నిబంధనలు ఉల్లంఘించడమేనని చెబుతున్నారు. మట్టి కింద కూరుకుపోయి ఊపిరాడక పోవడం వల్ల కూలీలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని స్థానికులు అన్నారు. 

ఇటీవల పర్మిషన్ల కోసం కొన్ని రోజులు పనులు నిలిపివేశారు. రెండు రోజుల కిందట మళ్లీ తవ్వకం పనులు మొదలుపెట్టగా అంతలోనే విషాదం చోటుచేసుకుంది. కూలీలకు తలకు ఎలాంటి గాయాలు అవ్వకుండా ఉండేందుకు హెల్మెట్లు కూడా నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు ఇవ్వలేదు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎస్వీ బిల్డర్స్ అండ్ అసోసియేషన్ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: AP Assembly News: ఏపీ అసెంబ్లీలో వెనక్కితగ్గని టీడీపీ నేతలు - నేడు 11 మంది సస్పెన్షన్

Also Read: Jangareddygudem Issue: ‘కడుపులో కాలిపోయి ఉన్నా సహజ మరణమా? ఇదంతా మన ఆంధ్రుల కర్మ’ - నాగబాబు

టాప్ హెడ్ లైన్స్

జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Embed widget