అన్వేషించండి

అమరావతిలో జగన్ ఆవిష్కరించిన స్థూపం ధ్వంసం, వైసీపీ నాయకుల ఆగ్రహం 

Amaravathi Issue: అమరావతి ప్రాంతంలో నిరుపేదలకు సెంటు స్థలాన్ని ఇచ్చేందుకు అప్పటి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన శిలాఫలకాన్ని, నమూనా ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

Amaravati News: అమరావతి ప్రాంతంలో నిరుపేదలకు సెంటు స్థలాన్ని ఇవ్వాలని గతంలో సీఎంగా వ్యవహరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారు. అందుకు అనుగుణంగా పట్టాలను సిద్ధం చేశారు. సుమారు 50,000 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి సెంటు చొప్పున స్థలం ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సెంటు స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి కూడా ప్రభుత్వం సహకారాన్ని అందించాలని అప్పట్లో నిర్ణయించింది.

ఈ స్థలాలను పంపిణీ చేసేందుకు అనుగుణంగా కృష్ణయపాలెం శివారులో శంకుస్థాపన చేసి నమూనా ఇంటి నిర్మాణం, స్థూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఈ స్థూపాన్ని ఎవరో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. శిలాఫలకాన్ని కూడా తొలగించారు.  ఇది ఎప్పుడు జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ ఘటనపై వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ తరహా చర్యలు వల్ల టిడిపి నాయకులు ఏం చెప్పదలుచుకుంటున్నారు అంటూ వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 

అప్పట్లో వ్యతిరేకించిన అమరావతి పరిరక్షణ సమితి..

రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం పట్ల అప్పట్లోనే అమరావతి పరిరక్షణ సమితి తీవ్రంగా తప్పుబట్టింది. కోర్టులకు వెళ్లిన అమరావతి పరిరక్షణ సమితి నాయకులు దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించారు. అయితే, అప్పట్లో ప్రభుత్వానికి అనుకూలంగా న్యాయస్థానాల్లో నిర్ణయం రావడంతో విపక్ష నేతలు ఎదురు దాడికి దిగారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో మురుకువాడలు నిర్మిస్తారా..? అంటూ టిడిపి అప్పట్లో ప్రశ్నించింది అమరావతిని నాశనం చేసేందుకు ప్రభుత్వం ఇలాంటి ఎత్తులు వేస్తోందని ఆరోపణలు చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ముందుకెళ్లేందుకు సిద్ధమైంది. తాజాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. టిడిపి నేతృతంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆందోళనలు, దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆస్తులను టిడిపి శ్రేణులు ధ్వంసం చేస్తున్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ శిలాఫలకాలు, ఫోటోలను ధ్వంసం చేస్తున్నారు. ఈ కోవలోనే రాజధాని ప్రాంతంలో సెంటు స్థలాల పంపిణీకి సంబంధించి ఏర్పాటు చేసిన నమూనా ఇంటితోపాటు, స్థూపాన్ని ధ్వంసం చేసినట్లు వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలే తప్ప.. ఆ పార్టీ నాయకులు ఆవేశపూరితంగా ఈ తరహా చర్యలకు పాల్పడడం దారుణం అంటూ వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి నుంచి వైసీపీ చెబుతున్నట్టుగానే రాజధానిలో నిరుపేదలకు అవకాశం లేకుండా చేస్తున్నారన్న విమర్శలను ఆ పార్టీ నాయకులు నిజం చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. మరి దీనిపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget