అన్వేషించండి

AP Highcourt News : ఆర్‌ - 5 జోన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్ - పొలాల్ని చదును ప్రారంభించిన అధికారులు !

ఆర్ 5 జోన్‌పై రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును ధర్మాసనం వాయిదా వేసింది.

AP Highcourt News :  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం సేకరించిన భూముల్లో ఇతర ప్రాంతాల పేదలకు సెంటు స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్-5 జోన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.  రాజధాని అవసరాల కోసం తప్ప భూముల్ని ఇతర అవసరాలకు వాడకూడదని గతంలో త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పిందని.. ఆ తీర్పును ఉల్లంఘిస్తూ కొత్తగా ప్రభుత్వం ఆర్ -5 జోన్ ఏర్పాటు చేసిందని రైతులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఉద్దేశపూర్వకంగా రాజకీయ కుట్రలో భాగంగానే ఇతర ప్రాంతాల నుంచి లబ్దిదారులను అమరావతికి తీసుకు వచ్చిన రాజధాని భూముల్లో స్థలాలిస్తున్నారని వారు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే పేదలకు ఇళ్లు ఇచ్చే లక్ష్యంతోనే ఆర్5 జోన్ ఏర్పాటు చేశామని ప్రభుత్వ తరపు లాయర్లు వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. 

సెంట్ స్థలాలను చదును చేయడం ప్రారంభిచిన అధికారులు

అయితే అంతకు ముందు అమరావతి భూముల్లో పేదలకు ఇవ్వాలనుకున్న కోట్ల చదును చేయడం ప్రారంభించారు. సీఆర్డీఏ సెంట్ స్థలాల వద్ద మౌలిక సదుపాయాల అభివృద్ధికి టెండర్లు పిలిచారు. అయితే కాంట్రాక్టర్లు ఎవరూ టెండర్లు వేయలేదు. అయినప్పటికీ అధికారులు జేసీబీలతో చదును చేయడానికి ప్రయత్నించారు. కోర్టులో కేసు ఉండగానే ఎలా పనులు చేస్తారని రైతులు.. అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ  పనులు కొనసాగించారు.అమరావతిలోని 20 వేర్వేరు లేఅవుట్లలో ఉన్న 1134.59 ఎకరాల భూమిని పేదలకు చెందిన 48,218 ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేశారు.  

రాజధాని కోసం సేకరించిన భూముల్లో  బయట ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలు

రాజధాని ప్రాంతంలోని ఇనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, నిడమనూరు గ్రామాల్లో 20 లేఅవుట్లు ఉన్నాయి. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేశారు.   కోర్టు కేసుల ఫలితాలకు లోబడి మే మొదటి వారం నుంచి ప్రతిపాదిత లేఅవుట్‌లకు స్పష్టమైన రూపం ఇవ్వడం ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే కోర్టు కేసులు ఇంకా పరిష్కారం కాలేదు. అయినప్పటికీ పనులు ప్రారంభించారు.  పథకం మూడో దశ కింద లబ్ధిదారులకు ఇంటి స్థలం పట్టాలు అందచేయాలని నిర్ణయించారు. 

రాజకీయ కుట్రతోనే ప్రభుత్వం ఇలా చేస్తోందని రైతుల ఆరోపణలు

APCRDA చట్టంలోని సెక్షన్ 41(3), (4) ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం అమరావతి మాస్టర్ ప్లాన్‌ను సవరించి R-5 జోన్ (రెసిడెన్షియల్ జోన్) సృష్టించింది .  అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వివిధ భూములను తన పరిధిలోకి తెచ్చింది.  పూర్తి స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమైనా నోటిఫికేషన్ ఇచ్చిందని రైతులు కోర్టుకు తెలిపారు.  కోర్టు ఇచ్చే తీర్పుపై ఇప్పుడు ఆ భూముల భవిష్యత్ ఆధారపడి ఉంది. ఒక వేళ త్రిసభ్య ధర్మాసనం తీర్పు మేరకు రాజధాని అవసరాల కోసమే ఆ భూముల్ని వినియోగించాలని హైకోర్టు చెబితే...  పేదలకు ఇళ్ల పంపిణీకి వేరే చోట్ల స్థలాలు చూడాల్సి ఉంటుంది. లేకపోతే అమరావతి మాస్టర్ ప్లాన్ లో ప్రకటించిన కీలక నిర్మాణాల  స్థలంలో సెంట్ స్థలాలు నిర్మితమవుతాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Liquor Scam: 8 గంటల పాటు ప్రశ్నల వర్షం - లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి విచారణ - మళ్లీ పిలుస్తారా?
8 గంటల పాటు ప్రశ్నల వర్షం - లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి విచారణ - మళ్లీ పిలుస్తారా?
Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల  స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
Raj Kasireddy Audio: బెయిల్ రాగా విచారణకి వస్తా, అన్నీ చెప్పేస్తా, విజయసాయిరెడ్డి చరిత్ర బయటపెడతా- రాజ్‌కేసిరెడ్డి ఆడియో విడుదల 
బెయిల్ రాగా విచారణకి వస్తా, అన్నీ చెప్పేస్తా, విజయసాయిరెడ్డి చరిత్ర బయటపెడతా- రాజ్‌కేసిరెడ్డి ఆడియో విడుదల 
Viral News: ఉద్యోగం నుంచి తీసేశారని ఏఐజీ ఆస్పత్రి పైకి ఎక్కిన మహిళ - దూకేస్తానని బెదిరింపు - బంజారాహిల్స్‌లో హైడ్రామా !
ఉద్యోగం నుంచి తీసేశారని ఏఐజీ ఆస్పత్రి పైకి ఎక్కిన మహిళ - దూకేస్తానని బెదిరింపు - బంజారాహిల్స్‌లో హైడ్రామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GT vs DC Match Highlights IPL 2025 | ఢిల్లీ క్యాపిటల్స్ పై 7వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం | ABP DesamRCB Loss in Chinna Swamy Stadium | ఆర్సీబీకి విజయాలను అందించలేకపోతున్న చిన్నస్వామి స్టేడియంPBKS Great Victories in IPL 2025 | ఊహించని రీతిలో విజయాలు సాధిస్తున్న పంజాబ్ కింగ్స్Trolls on RCB for Crossing 49 Runs | జర్రుంటే సచ్చిపోయేవాళ్లు..ఓ రేంజ్ లో RCB కి ట్రోల్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Liquor Scam: 8 గంటల పాటు ప్రశ్నల వర్షం - లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి విచారణ - మళ్లీ పిలుస్తారా?
8 గంటల పాటు ప్రశ్నల వర్షం - లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి విచారణ - మళ్లీ పిలుస్తారా?
Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల  స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
Raj Kasireddy Audio: బెయిల్ రాగా విచారణకి వస్తా, అన్నీ చెప్పేస్తా, విజయసాయిరెడ్డి చరిత్ర బయటపెడతా- రాజ్‌కేసిరెడ్డి ఆడియో విడుదల 
బెయిల్ రాగా విచారణకి వస్తా, అన్నీ చెప్పేస్తా, విజయసాయిరెడ్డి చరిత్ర బయటపెడతా- రాజ్‌కేసిరెడ్డి ఆడియో విడుదల 
Viral News: ఉద్యోగం నుంచి తీసేశారని ఏఐజీ ఆస్పత్రి పైకి ఎక్కిన మహిళ - దూకేస్తానని బెదిరింపు - బంజారాహిల్స్‌లో హైడ్రామా !
ఉద్యోగం నుంచి తీసేశారని ఏఐజీ ఆస్పత్రి పైకి ఎక్కిన మహిళ - దూకేస్తానని బెదిరింపు - బంజారాహిల్స్‌లో హైడ్రామా !
Roja: పవన్ కల్యాణ్ పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు - రోజాపై రగిలిపోతున్న జనసేన
పవన్ కల్యాణ్ పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు - రోజాపై రగిలిపోతున్న జనసేన
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్లకే ఐపీఎల్ ఆడాడు- దుమ్ముురేపాడు
వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్లకే ఐపీఎల్ ఆడాడు- దుమ్ముురేపాడు
IPL 2025 GT VS DC Result Updates: గుజ‌రాత్ రికార్డు ఛేజింగ్.. టోర్నీలో ఐదో విజ‌యంతో స‌త్తా.. బ‌ట్లర్ సెంచరీ మిస్, ప్రసిధ్ కు 4 వికెట్లు
గుజ‌రాత్ రికార్డు ఛేజింగ్.. టోర్నీలో ఐదో విజ‌యంతో స‌త్తా.. బ‌ట్లర్ సెంచరీ మిస్, ప్రసిధ్ కు 4 వికెట్లు
Hydra : టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
Embed widget