అన్వేషించండి

AP Pension Distribution: ఏపీలో పింఛన్ల పండుగ నేడే, ఎవరికి ఎంత పెరిగింది- పూర్తి వివరాలు ఇవీ

Andhra Pradesh Pension Distribution | ఏపీలో కూటమి ప్రభుత్వం పింఛన్లు పెంచింది. ఏప్రిల్ నుంచి సవరించిన పింఛన్లు వర్తింపజేసి చంద్రబాబు ప్రభుత్వం లక్షల మందికి లబ్ధి చేకూర్చింది.

AP Pension Hikes Telugu News | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి అధికారులు సర్వం సిద్దం చేశారు. జులై 1న ఏపీ వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛను పెంపు తొలి నెల నుంచే అమలు చేస్తూ కొత్త పింఛన్లను ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

మంగళగిరి నియోజకవర్గంలో పింఛను ఇవ్వనున్న చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా వెళ్లి పింఛన్ కార్యక్రమం మొదలుపెట్టి, లబ్ధిదారులు కొందరికి సవరించిన కొత్త పింఛన్ అందజేయనున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి 05.45 గంటలకు బయలుదేరి 06.00 గంటలకు పెనుమాక గ్రామానికి చేరుకోనున్నారు. 06.20 గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎం చంద్రబాబు నేరుగా పింఛన్లు పంపిణీ చేస్తారు. అనంతరం 07.15 వరకు పెనుమాకలోని మసీదు సెంటర్ లో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని  లబ్ధిదారులు, ప్రజలతో ఆయన ముచ్చటిస్తారు. అనంతరం సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరతారు.

ఏపీలో మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్దిదారులకు పెన్షన్ అందజేయనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా సవరించిన పింఛన్లను గడిచిన మూడు నెలలకు కూడా వర్తింపచేశారు. 
- పెరిగిన పింఛనుతో ఏప్రిల్ 1 నుంచి రూ.4000 లబ్ధి, ఏప్రిల్, మే, జూన్ నెలలకు రూ.3000 కలిపి మొత్తం రూ.7000 ఇవ్వనున్నారు. 
- వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్య కారులు, కళా కారులు, డప్పు కళాకారులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి జులై నుంచి రూ.4000 పింఛను అందుతుంది
- దివ్యాంగులకు పింఛన్ రూ.3000 పెంచారు. కూటమి ప్రభుత్వం వారికి రూ.6000 పెన్షన్ ఇవ్వనుంది
- తీవ్ర అనారోగ్యంతో దీర్ఘ కాలిక వ్యాధులు ఉండే వారికి ఇచ్చే పెన్షన్ రూ.5000 నుంచి రూ.15000కి పెంచారు. మొత్తం 24318 మంది ఈ విభాగంలో పింఛను పొందుతున్నారు. 

రాష్ట్రంలో పింఛన్ల పెంపు వల్ల చంద్రబాబు ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల అదనపు బారం పడనుంది. పెన్షనర్లకు లబ్ధి చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం రూ.4,408 కోట్లు ఒక్క రోజులో పంపిణీ చేయనుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సైతం పెంచిన పింఛన్ ఇవ్వడం వల్ల ఏపీ ప్రభుత్వంపై రూ.1650 కోట్లు అదనపు బారం పడనుంది. వైసీపీ ప్రభుత్వం పింఛను కోసం కేవలం నెలకు రూ.1939 కోట్లు ఖర్చు చేసింది. ఏపీలో సచివాలయ ఉద్యోగులు దాదాపు 1,20,097 మందితో పింఛను పంపిణీ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి ఇకపై రూ.34 వేల కోట్లు పింఛన్ల కోసం ఖర్చు చేయనుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget