అన్వేషించండి

Kakani Govardhan Reddy: జోకర్‌ మాటలొద్దు, రైతులకు రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం: మంత్రి కాకాణి  

చంద్రబాబు ఏరోజు అధికారంలో ఉన్నా, కరువు తాండవిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

చంద్రబాబు ఏరోజు అధికారంలో ఉన్నా, కరువు తాండవిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో ఎప్పుడు చూసినా, వర్షాలు సాధారణం కంటే ఎక్కువే నమోదయ్యాయన్నారు. అందుకే ఒక్క కరువు మండలం కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదన్నారు. అదే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏటా సగటున 300కు పైగా కరువు మండలాలు ప్రకటించారని విమర్శించారు. 

జోకర్‌ మాటలు
జగన్‌ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో భూగర్భ జలాలు కూడా పెరిగాయని కాకాణి అన్నారు. చంద్రబాబు మాటలు జోకర్‌ను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం చంద్రబాబు ఆరోపించడం సరికాదన్నారు. చంద్రబాబు తన హయాంలో ఎప్పుడు వ్యవసాయాన్ని పట్టించుకోలేదని, ఇప్పుడు అధికారంలోకి వస్తే రైతులకు అన్నదాత కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. 2014లో బేషరతుగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని నమ్మించి రైతుల కడుపు మీద కొట్టిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.  

‘మేము మాట నిలుపుకున్నాం’
2019 ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. పెట్టుబడి సాయంగా రైతు భరోసా కింద ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పామని, కానీ చెప్పిన దానికంటే ఎక్కువగా ఏటా రూ.13,500 చొప్పున  5 ఏళ్లకు ఇస్తున్నామన్నారు. ఏటా సగటున 12 లక్షల టన్నుల నుంచి 14 లక్షల టన్నుల ధాన్యం అధికోత్పత్తి అవుతోందని మరి వ్యవసాయ రంగం బాగా లేనట్లా? అని ప్రశ్నించారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే, కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని చంద్రబాబు విమర్శించారని, కానీ దాన్ని సాకారం చేసిన ఘనత వైఎస్సార్‌కు దక్కిందన్నారు. వైసీపీ పాలనలో పగటిపూటే వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నామన్నారు.  

‘చంద్రబాబు సమాధానం చెప్పాలి’
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారని, రైతుల పంటలకు బీమా ప్రీమియమ్‌ చెల్లించలేదని, డ్రిప్‌ ఇరిగేషన్‌ బకాయిలు పెట్టి పోయారని ఆరోపించారు. ధాన్యం నుంచి రైతు రథాల వరకు ప్రతి దాంట్లో అవినీతికి పాల్పడిన వ్యక్తి చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించారు.  మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ కింద వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు రూ. 7700 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇటీవల టమాటాల సరఫరా కోసం రూ. 10 కోట్లు ఖర్చు చేశామన్నారు 

‘గతి తప్పిన బాబు సుపుత్రడు’
చంద్రబాబు తన సుపుత్రడు లోకేష్‌ను రోడ్డు మీదకు వదిలాడని, ప్రతి చోటా రైతు సదస్సు అని పెట్టి సీఎం జగన్‌ను తనను తిట్టడం తప్ప రైతులకు తమ ప్రభుత్వంలో చేసినవి చెప్పులేకపోతున్నారని విమర్శించారు. ఎన్నికలు దగ్గరకొస్తున్న సమయంలో దాదాపు 65 శాతం ఉన్న రైతులను ఆకట్టుకోవడానికి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీమా చెల్లించాల్సి వస్తుందని రైతుల  ఆత్మహత్యలను నమోదు చేకుండా ఆదేశించిన నీచమైన వ్యక్తి చంద్రబాబు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  వైసీపీ ప్రభుత్వం రైతులకు చేసిన దానిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. కేంద్రం యూనివర్సల్‌ కవరేజ్‌కు ఒప్పుకోవడంతో, ప్రధాన మంత్రి ఫసల్‌బీమా యోజనలో చేరడం జరిగిందని మంత్రి చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
TDP Foundation Day: తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
Rashmika: ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP DesamKavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
TDP Foundation Day: తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
Rashmika: ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
MS Dhoni Trolling:  కెరీర్లో ఇదే లో పాయింట్.. 9వ స్థానంలో బ్యాటింగ్ ఏంది తలా..? రిటైర‌యిపో.. ధోనీపై భ‌గ్గుమ‌న్న ఫ్యాన్స్ 
కెరీర్లో ఇదే లో పాయింట్.. 9వ స్థానంలో బ్యాటింగ్ ఏంది తలా..? రిటైర‌యిపో.. ధోనీపై భ‌గ్గుమ‌న్న ఫ్యాన్స్ 
SBI clerk prelims Results 2025: ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల- డైరెక్ట్ లింక్ ఇదే
ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల- డైరెక్ట్ లింక్ ఇదే
Mad Square Day 1 Collections: తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టిన కుర్రాళ్ళు... 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టిన కుర్రాళ్ళు... 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?
Myanmar Earthquake Death Toll: మయన్మార్, థాయ్‌లాండ్‌లలో భూకంపాలు, 700 దాటిన మృతుల సంఖ్య- శిథిలాల కింద ఎందరో
మయన్మార్, థాయ్‌లాండ్‌లలో భూకంపాలు, 700 దాటిన మృతుల సంఖ్య- శిథిలాల కింద ఎందరో
Embed widget