అన్వేషించండి

AP Governor speech Highlights: ఐటీ, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో పరుగులు.. పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్ట్రం: ఏపీ గవర్నర్ స్పీచ్ హైలైట్స్

AP Assembly Session | ఏపీ ప్రభుత్వం ఐటీ, క్వాంటం కంప్యూటింగ్ రంగాలతో పాటు సూపర్ సిక్స్ పథకాల అమలులో విజయం సాధిస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

అమరావతి: ఏపీ ఐటీ, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో దూసుకెళ్తుందని, పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన సమస్యలు, గత పాలకులు మిగిల్చిన ఆర్థిక కష్టనష్టాల మధ్య ప్రస్తుత ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించిందని పేర్కొన్నారు. మరోవైపు ఏపీ గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు అడ్డుతగిలారు. సభ మొదలుకాగానే నిరసనకు దిగిన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తూ అదినేత జగన్ తో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు.

గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యమై, అభివృద్ధి కుంటుపడిందన్నారు. 2024లో రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను ప్రజలు కూటమికి అప్పగించారని, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో పాలన సాగుతోందని చెప్పారు. గత 19 నెలల్లో వ్యవస్థలను గాడిలో పెట్టి, 7 శ్వేత పత్రాల ద్వారా పారదర్శకతను తీసుకువచ్చినట్లు వివరించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా 10 సూత్రాలతో సుపరిపాలన అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

అంతర్జాతీయ పెట్టుబడులు, నాలెడ్జ్ ఎకానమీకి డెస్టినేషన్

రాష్ట్రం ఐటీ, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో దూసుకుపోతోందని గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో వెల్లడించారు. అంతర్జాతీయ సంస్థలు ఏపీని పెట్టుబడులకు, నాలెడ్జి ఎకానమీకి ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయని పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుతో నూతన అధ్యాయం మొదలైందని, ప్రపంచంలోని కొద్ది ప్రాంతాల్లోనే ఉండే ఈ సాంకేతికతను రాష్ట్రంలో స్థాపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. యువతకు భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేలా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.


AP Governor speech Highlights: ఐటీ, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో పరుగులు.. పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్ట్రం: ఏపీ గవర్నర్ స్పీచ్ హైలైట్స్

పారిశ్రామిక ప్రగతి కోసం రాష్ట్రవ్యాప్తంగా 175 ఎంఎస్ఎంఈ (MSME) పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. స్పేస్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, గ్రీన్ హైడ్రోజన్ సిటీ వంటివి రాష్ట్ర అభివృద్ధికి కీలకం కానున్నాయి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఏటా రూ. 33 వేల కోట్లతో సూపర్ సిక్స్ సహా వివిధ డీబీటీ (DBT) పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎన్టీఆర్ భరోసా ద్వారా 63.12 లక్షల మందికి పెన్షన్లు, తల్లికి వందనం కింద 66 లక్షల మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందుతోంది.


AP Governor speech Highlights: ఐటీ, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో పరుగులు.. పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్ట్రం: ఏపీ గవర్నర్ స్పీచ్ హైలైట్స్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీశక్తి, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే దీపం 2.0 పథకాలు విజయవంతంగా సాగుతున్నాయి. అన్నదాత సుఖీభవ ద్వారా 46.86 లక్షల మంది రైతులకు రూ. 20 వేల చొప్పున లబ్ధి చేకూరుతోంది. నిరుద్యోగ నివారణకు మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టులు, 5,757 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది.


AP Governor speech Highlights: ఐటీ, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో పరుగులు.. పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్ట్రం: ఏపీ గవర్నర్ స్పీచ్ హైలైట్స్

పేదరికం లేని సమాజ స్థాపనే (Zero Poverty) లక్ష్యంగా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి కుటుంబానికి ప్రయోజనాలు చేకూరుస్తున్నారు. త్వరలోనే ప్రతి కుటుంబానికి 'ఫ్యామిలీ డిజిటల్ కార్డు' అందించేందుకు కసరత్తు జరుగుతోంది. పీ4 (P4) విధానం ద్వారా ఆర్థిక అసమానతలు తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆకలి లేని రాష్ట్రం కోసం 113 నియోజకవర్గాల్లో 205 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు, త్వరలో గ్రామీణ ప్రాంతాలకు వీటిని విస్తరిస్తారు. అందరికీ గృహాలు, ఎస్సీ వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉంది. బీసీల అభ్యున్నతికి ఎంఎస్ఎంఈ (MSME)ల ద్వారా ఉపాధి కల్పిస్తూనే, మైనారిటీల భద్రత, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు.


AP Governor speech Highlights: ఐటీ, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో పరుగులు.. పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్ట్రం: ఏపీ గవర్నర్ స్పీచ్ హైలైట్స్

సమగ్ర ఆరోగ్య రక్షణ - సామాజిక భద్రత

గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. ‘ప్రజల వైద్య ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం 'సంజీవని' కార్యక్రమం ద్వారా ఆరోగ్య భద్రతను బలోపేతం చేస్తోంది. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి రూ. 2.5 లక్షల వరకు సమగ్ర ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనితో పాటు 1.43 కోట్ల పేద కుటుంబాలకు రూ. 25 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందుబాటులోకి తీసుకువస్తోంది. క్యాన్సర్ వంటి ఖరీదైన చికిత్సలకు ఎలాంటి పరిమితి లేకుండా ఉచిత వైద్యం అందించడం ఈ పథకం ప్రత్యేకత. గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్‌వాడీలను బలోపేతం చేస్తూనే, మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి ద్వారా మహిళలకు న్యాయ సహకారం అందిస్తోంది. అక్రమ మద్యం, గంజాయి నిర్మూలనలో ప్రభుత్వం విశేష పురోగతి సాధించింది.

మౌలిక సదుపాయాలు - ప్రాంతీయ అభివృద్ధి

రాష్ట్ర సాగునీటి రంగానికి వెన్నెముక వంటి పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉంది. నదుల అనుసంధానం ద్వారా గోదావరి వరద జలాలను కరువు ప్రాంతాలకు తరలించేలా కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలోని 28 జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం విశాఖ, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా మూడు రీజియన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అమరావతి పునర్నిర్మాణం వేగంగా సాగుతోందని, దీనికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించిందని గవర్నర్ వివరించారు. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ వ్యవస్థతో పాటు, రాష్ట్రం మీదుగా వెళ్లే మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి ఊతమిస్తాయని’ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఆర్థిక అభివృద్ధిలో మహిళలకు స్థానం

అభివృద్ధి వ్యూహంలో మహిళలను ఆర్థిక భాగస్వాములుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పిస్తూ, ఏటా లక్ష మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతోందని గవర్నర్ పేర్కొన్నారు. ‘వచ్చే ఏడాదిలో ఐదు లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ 'వీబీ జీ రామ్ జీ' పథకం ద్వారా ఉపాధి రోజులను 100 నుంచి 125 రోజులకు పెంచారు. పోర్టు ఆధారిత అభివృద్ధి, ఆక్వా కల్చర్, రాయలసీమలో ఉద్యాన పంటల సాగు వంటి చర్యల ద్వారా ప్రాంతీయ సమానత్వాన్ని సాధించేలా ప్రభుత్వం 25కు పైగా కొత్త పాలసీలను ప్రకటించినట్లు’ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రస్తావించారు.

గ్రీన్ హైడ్రోజన్ ద్వారా క్లీన్ ఎనర్జీపై ఫోకస్

‘గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా సహా పునరుత్పాదక ఇంథనం ద్వారా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిపై ప్రభుత్వం ఫోకస్ చేసింది.  ఏపీని క్లీన్ ఎనర్జీ ఎకనామిక్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. విద్యుత్ వినియోగదారులపై భారం వేయకుండా రూ.4,498 కోట్ల మేర ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తొలిసారిగా ట్రూ డౌన్ విధానం ద్వారా ప్రజలపై యూనిట్ కు 13 పైసల చొప్పున విద్యుత్ భారాన్ని తగ్గించింది. గతంలో తప్పుడు నిర్ణయాలతో ధ్వంసమైన ఏపీ విద్యుత్ రంగం ఇప్పుడు జాతీయ స్థాయిలో మోడల్‌గా అవతరించింది. తక్కువ ధరతో డేటా సెంటర్లకు విద్యుత్ అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సీఐఐ సమ్మిట్ ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు 610 ఎంఓయూలు కుదిరాయి.   16.13 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. * 14 ఎస్ఐపీబీ ల ద్వారా 8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదాన్ని తెలిపి పరిశ్రమలు స్థాపించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది

పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చి ఆ రంగంలో పెట్టుబడులకు ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  కేంద్ర బడ్జెట్‌లో అరకు లోయ, పులికాట్ సరస్సుల వద్ద టూరిజం అభివృద్ధి చేస్తోంది. వీటిని ఉపయోగించుకుని ఈ రంగంలో పెద్దఎత్తున ప్రాజెక్టులు సాధించేందుకు కృషి చేస్తోంది. సాగునీటి రంగం అభివృద్ధిలో కీలకంగా మారింది. తక్కువ వర్షపాతం కలిగిన అనంతపురం లాంటి ప్రాంతాలు హార్టీ కల్చర్ హబ్‌గా మారుతున్నాయి. పీఎం ప్రణామ్ పథకం ద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గించి భూసారాన్ని మెరుగుపరిచేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. పొగాకు, కోకో వంటి పంటలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రైతులను ప్రభుత్వం ఆదుకుంది. 2030 నాటికి అరకు కాఫీ, కోకో ప్రాసెసింగ్‌లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని’ గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Pawan Kalyan: పరిపాలనలో పవన్ కళ్యాణ్ మార్క్.. తన శాఖల్లో పనులపై బుక్‌లెట్ - కుప్పానికి ఎంత కేటాయించారంటే..
పరిపాలనలో పవన్ కళ్యాణ్ మార్క్.. తన శాఖల్లో పనులపై బుక్‌లెట్ - కుప్పానికి ఎంత కేటాయించారంటే..
Keshineni Chinni vs Kolikapudi: టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదం ముగిసినట్లే.. అంతా క్లియర్ అయిందా!
టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదం ముగిసినట్లే.. అంతా క్లియర్ అయిందా!
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
Embed widget