అన్వేషించండి

Pawan Kalyan: జన సైనికులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ- ఆ విషయాలు మాత్రం పట్టించుకోవద్దని ఆదేశాలు

Andhra Pradesh News | ఏపీ ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమికి, అందులోనూ జనసేనకు భారీ విజయాన్ని అందించారన్న పవన్ కళ్యాణ్.. తప్పుడు వార్తలు, ప్రచారంపై స్పందించకూడదని జనసైనికులు, వీర మహిళలకు సూచించారు.

Pawan Kalyan Note to Janasena Leaders | అమరావతి: నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేయగా, మరికొందరు టీడీపీ నేతలు మరో అడుగు ముందుకేసి లోకేష్‌కు సీఎం పదవి ఇవ్వాలని, ఏపీ భవిష్యత్ ఆయనేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనసైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు ముఖ్యమైన సందేశం ఇచ్చారు. తాను చెప్పిన ఈ మాటల్ని పాటిస్తూ, ప్రతీ ఒక్కరూ అందుకు అనుగుణంగా నడుచుకోవాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. 

జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలివే
‘2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, బిజేపీ, జనసేన పార్టీతో కూడిన NDA కూటమి సాధించిన ఘన విజయం చారిత్రాత్మకం. ఇది కేవలం ఒక్క కూటమి బలమే కాదు, గత వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై.. సంఘ విద్రోహక చర్యలపై ప్రజల తిరుగుబాటు. చట్ట సభల్లో వైసీపీ నేతలు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై, శాంతి భద్రతల వైఫల్యాలపై, అభివృద్ధికి అవకాశం ఇవ్వకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి, అప్పుల రాష్ట్రంగా మార్చడంపై ఏపీ ప్రజలు విసుగు చెందారు. రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టిందుకు అనుభవం కలిగిన పాలన, సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం కూటమిపై నమ్మకంతో ప్రజలు 94 శాతం స్థానాల్లో మనకు విజయాన్ని అందించారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో NDA కూటమికి 184/175 స్థానాలను, జనసేన పార్టీకి 100% స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21కి 21 అసెంబ్లీ స్థానాలు, పోటీ చేసిన 2 పార్లమెంటు స్థానాల్లో  అభ్యర్థులను గెలిపించారు. ప్రజలు మనకు ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా మలచుకున్నాం. అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర సహాయ, సహకారాలతో, ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి సాధించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే రాష్ట్రానికి దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నా, మారుమూల గ్రామాలలో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సైతం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకుకెళ్తున్నాం. అందుకు 5 కోట్ల ఏపీ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ యువతకు భవిష్యత్తు అందించాలనే ధృఢ సంకల్పమే కారణం. 

కూటమిలోని 3 పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా ఉంటూ, కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అనవసరమైన వివాదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై, NDA కూటమి అంతర్గత విషయాలపై కానీ, నాయకులు ఎవరైనా పొరపాటున స్పందించినా సరే.. ప్రతిస్పందనగా మీరు ఎవరూ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించవద్దు. ఆ వ్యాఖ్యలపై బహిరంగంగా చర్చించడం లాంటివి చేయవద్దు. 5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలని ఎంతో బాధ్యతగా, 2047 నాటికి స్వర్ణాంధ్ర  సాధించి, వికసిత్ భారత్ సాధనలో 25 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ కలిసి నడవాల్సిన అవసరం ఉంది. 
పదవుల కోసం పాకులాడలేదు
నేను (పవన్ కళ్యాణ్) ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను కూడా. కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడవటం, వారికి అండగా నిలబడటం మాత్రమే నాకు తెలుసు. పుట్టిన గడ్డను అభివృద్ధి చేయాలని భావిస్తాను. జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఈ విషయాన్ని గ్రహించి మన కూటమి ఔనత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మార్చ్ 14న జరగనున్న జనసేన (Janasena Party) ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాలపై సమగ్రంగా చర్చించుకుందాం అని’ పవన్ కళ్యాణ్ లేఖ విడుదల చేశారు.

Also Read: Kandula Durgesh: ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచేది లేదు... కొత్త పాలసీ తీసుకొస్తున్నాం: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget