అన్వేషించండి

మీ అనుభవం ఏపీ అభివృద్ధికి అవసరం- నాటా మహాసభల్లో ఎన్‌ఆర్‌ఐలకు సీఎం జగన్ సందేశం

వేరే దేశంలో ఉన్నా తెలుగువారంతా సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఐకమత్యాన్ని చాటడం సంతోషాన్ని కలిగిస్తోందని జగన్ వ్యాఖ్యానించారు.

గ్లోబల్‌ సిటిజన్‌గా మనం ఎదగాలంటే చదువే పెద్ద సాధనం అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. అందుకే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను సమూలంగా మార్పులు చేస్తున్నామని చెప్పారు. అమెరికాలోని డాలస్‌లో జరుగుతున్న నాటా మహా సభలనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్‌ తన సందేశాన్ని అందించారు. 

వేరే దేశంలో ఉన్నా తెలుగువారంతా సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఐకమత్యాన్ని చాటడం సంతోషాన్ని కలిగిస్తోందని జగన్ వ్యాఖ్యానించారు. తెలుగు వారు అమెరికాలోని పెద్ద, పెద్ద కంపెనీల్లో సీఈఓలుగా, ఐటీ నిపుణులుగా, నాసా సైంటిస్టులుగా, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగులుగా, బిజినెస్‌మెన్‌గా, మంచి డాక్టర్లుగా రాణిస్తున్న తీరు గర్వం కలిగిస్తుందని అన్నారు. తెలుగు వారు అక్కడ ఉన్నప్పటికి వారి మూలాలు, మన మట్టిలో ఉన్నాయని అన్నారు. అనేకమంది పేద, మధ్య తరగతి కుటుంబాల్లో నుంచి వచ్చినా, అక్కడకి వెళ్లి రాణించడం వెనుక, ఎంతో కఠోరమైన కమిట్‌మెంట్, ఫోకస్‌ వారిని నిలబెట్టాయన్నారు. 

నా కళ్ళారా చూశాను..అందుకే....
కమిట్‌మెంట్, ఫోకస్‌ మన రాష్ట్రంలోని పిల్లల్లో ఎంతగానో ఉందని దాన్ని తన కళ్లారా చూశానని జగన్ అన్నారు. ఆకాశాన్ని దాటి వెళ్లాలన్న కోరికతో ఉన్న వారు ఎదగాలంటే, అందుకు వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలన్న తపనతో నాలుగేళ్ల కాలంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేగలిగామని చెప్పారు.  గ్లోబల్‌ సిటిజన్‌గా మనం ఎదగాలంటే, చదువన్నది ఒక పెద్ద అవసరమైన సాధనంగా పేర్కొన్నారు. విద్యారంగంలో తెచ్చిన విప్లవాత్మ మార్పుల్లో భాగంగా సర్కారీ బడులన్నీ కూడా పూర్తిగా రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు.  నాడు నేడు అనే గొప్ప కార్యక్రమం అమలు చేస్తున్నామని, స్కూళ్లలో ఉన్న మౌలికసదుపాయాల రూపురేఖలన్నీ మారుస్తున్నట్లు వెల్లడించారు. 

ఎనిమిదో తరగతిలోకి రాగానే ప్రభుత్వ బడిలో చదువుతున్న పిల్లలకు, ట్యాబ్‌లు ఇస్తున్నాం,  మూడో తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్లను నియమించామని చెప్పారు జగన్. 6వ తరగతి నుంచి ప్రతి తరగతిలోనూ డిజిటల్‌ విద్యను అందించేలా ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 6వతరగతి ఆపైన అన్ని తరగతి గదుల్లోనూ ఈ డిసెంబరు నాటికి ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌ ఏర్పాటు పూర్తి అవుతుందని అన్నారు.

విద్యార్దులకు అన్ని రకాల మౌళిక సదుపాయాలు..
అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా కానుక, ఉన్నత విద్యలో అయితే విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలన్నీ రాష్ట్రంలో గొప్పగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. చదువుకుంటున్న పిల్లల కోసం విద్యావ్యవస్ధలో తెస్తున్న మార్పులని, చదువు అనే ఒక ఆయుధం ఎంత అవసరమో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలనిన అన్నారు. కేవలం విద్యా రంగం ఒక్కటే కాదు, ఏ రంగాన్ని తీసుకున్నా ఇలాంటి మార్పులే కనిపిస్తాయని అన్నారు.

ప్రతి గ్రామంలో ఇంగ్లీష్ పాఠాలు..
ప్రతి గ్రామంలోనూ ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తాయని, బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ను స్కూలు పిల్లలు చదువుతున్నారని అన్నారు. ఇంగ్లీషు అన్నది ప్రపంచంలో విజ్ఞానాన్ని మనం నేర్చుకునేందుకు, చదువుకునేందుకు ఉపయోగపడే ఒక గొప్ప మీడియంగా జగన్ అభివర్ణించారు.  పిల్లలు తమకు తాముగా ఏ సబ్జెక్‌ మీద అయినా అవగాహన పెంచుకోవాలన్నా ముందు వారికి ఇంగ్లీష్‌ మీద పూర్తిస్థాయిలో పట్టు రవాలని అందుకే సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టామని చెప్పారు.

అభివృద్ధిలో భాగమవ్వండి

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న  అభివృద్ధి  ఒక్కసారి  చూడాలని తెలుగు ఎన్‌ఆర్‌ఐను ఆహ్వానించారు సీఎం జగన్. పోర్ట్‌లు  ఎయిర్పోర్ట్‌లు మెరుగు పడుతున్నాయన్నారు. విదేశాల్లో  ఉన్న  ఎన్‌ఆర్‌ఐ సేవలు  ఏపీ కి  ఎంతో  అవసరమని అభిప్రాయపడ్డారు. విదేశాల్లో  ఉండి  అపార అనుభవం  సంపాదించారు.. ఏపీలో  అభివృద్ధి  కోసం  ఆ అనుభవం సహకరించేలా  ఉండాలన్నారు. గ్రామీణ  ప్రాంతాల్లో  ఆర్ధిక  అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. అందరూ  వినియోగదారులు  అయితే  ఉత్పత్తి  ఉండదని... ఉత్పత్తిదారులు  ఉండకపోతే  భవిష్యత్‌లో  ఆహార కొరత  వస్తుందన్నారు. రూరల్  ఎకానమీపై దృష్టి  పెట్టాల్సిన  అవసరం  ఉందని గుర్తు చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget