అన్వేషించండి

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో నెయ్యి వివాదం: దేవుడి ఫొటోలతో వైసీపీ నిరసన, గందరగోళం!

Andhra Pradesh Latest News: వైసీపీ సభ్యులు దేవుడి ఫొటోలను మండలిలోకి తీసుకురావడంపై అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటని ప్రశ్నించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టీటీడీ నెయ్యి, హెరిటేజ్, ఇందాపూర్ అంశాలపై వైసీపీ చర్చ కోరింది.
  • చర్చకు నిరాకరించడంతో వైసీపీ సభ్యులు దేవుడి ఫొటోలు ప్రదర్శించారు.
  • దేవుడి ఫొటోలను మండలిలోకి తేవడంపై అధికార పార్టీ, ఛైర్మన్ అభ్యంతరం తెలిపారు.
  • సభలో గందరగోళం, నిరసనల నేపథ్యంలో ఛైర్మన్ సభను వాయిదా వేశారు.

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నెయ్యి వివాదం మరింత ముదురుతోంది. శాసన మండలిలో హెరిటేజ్‌, ఇందాపూర్‌సంస్థ అంశాలపై చర్చించాలని వైసీపీ పట్టుబడుతోంది. అందులో భాగంగా రోజూ వాయిదా తీర్మానాలు ఇస్తూ వస్తోంది. ఎప్పటి మాదిరిగానే మండలి ఛైర్మన్ వాటిని తిరస్కరిస్తున్నారు. శుక్రవారం కూడా వైసీపీ సభ్యులు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి, హెరిటేజ్, ఇందాపూర్ వ్యవహారంపై చర్చించాలని వాయిదా తీర్మానాలు ఇచ్చారు. వాటిని ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ నేతలు తమ వెంట తెచ్చుకున్న వెంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిపెట్టిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు. 

వైసీపీ సభ్యులు దేవుడి ఫొటోలను మండలిలోకి తీసుకురావడంపై అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటని ప్రశ్నించింది. దేశ చరిత్రలోనే ఇలాంటివి ఎక్కడా జరగలేదని చెప్పింది. చట్టసభల్లో దేవుడి చిత్రాలు, మతపరమైన థింగ్స్‌ తీసుకురాకుడనే రూల్‌ను అతిక్రమించారని ఆరోపించారు. మంత్రి పయ్యావుల కేశవ‌ మాట్లాడుతూ దేవుడిపై నమ్మకం లేని వారు దేవుడి ఫొటోలతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారి చర్యలను చైర్మన్ ఖండించాలని డిమాండ్ చేశారు. 

మండలి ఛైర్మన్ కూడా వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి సభలో ప్రదర్శించ కూడదని వారించారు. అయినా వైసీపీ సభ్యులు ఆయన సూచనలు పట్టించుకోలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీటీడీలో హెరిటేజ్ అక్రమాలకు ప్రభుత్వం వంతపాడుతోందని నిరసన తెలిపారు. ఆ అంశాల్లో చర్చ జరిపితే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని అభిప్రాయపడ్డారు. 

ఓవైపు ఛైర్మన్, మరోవైపు అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం చెప్పినా వైసీపీ నేతలు వినిపించుకోలేదు. వారు మండలి ఛైర్మన్‌ పోడియం చుట్టు ముట్టి నినాదాలు చేశారు. వారికి వ్యతిరేకంగా అధికార పార్టీ సభ్యులు వ్యతిరేకంగా నినాదాలు అందుకున్నారు. ఎవరూ తమ సీట్లలో కూర్చోకుండా మండలిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో సభను వాయిదా వేస్తున్నట్టు మండలి ఛైర్మన్ ప్రకటించారు. అప్పటి వరకు వైసీపీ సభ్యులపై ఆగ్రహంతో మాట్లాడుతున్న మంత్రి పయ్యావుల కేశవ్‌ తన చేతిలో ఉన్న మైక్‌ను విసిరికొట్టారు. 

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో నెయ్యి వివాదం ఎందుకు ముదిరింది?

టీటీడీకి సరఫరా అయిన నెయ్యి, హెరిటేజ్, ఇందాపూర్ సంస్థల అంశాలపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టడం వల్ల వివాదం ముదిరింది.

శాసన మండలిలో వైసీపీ సభ్యులు ఎలాంటి నిరసన తెలిపారు?

వారు వెంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిపెట్టిన ఫ్లెక్సీలను ప్రదర్శించి, నినాదాలు చేశారు.

దేవుడి ఫొటోలను మండలిలోకి తీసుకురావడంపై అధికార పార్టీ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది?

దేవుడిని రాజకీయాల్లోకి లాగడం, చట్టసభల్లో మతపరమైన వస్తువులను తీసుకురాకూడదనే నిబంధనను అతిక్రమించారని అధికార పార్టీ ఆరోపించింది.

ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో మండలిలో ఏమి జరిగింది?

వైసీపీ సభ్యుల నిరసన, అధికార పార్టీ సభ్యుల వ్యతిరేక నినాదాల వల్ల మండలిలో గందరగోళం నెలకొనడంతో సభను వాయిదా వేశారు.

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget