అన్వేషించండి

Andhra Pradesh Ration Distribution :వాళ్లకు మాత్రం ఇంటి వద్దకే రేషన్- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కారు

Andhra Pradesh Ration Distribution :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జూన్ నుంచి పాత విధానంలోనే రేషన్ పంపిణీ చేయనుంది. దీనికి పూర్తి ఏర్పాట్లు చేసింది. అయితే కొందరికి మాత్రం ఇంటి వద్దకే సరకులు ఇవ్వబోతోంది.

Andhra Pradesh Ration Distribution : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్ వాహనాల ద్వారా పంపిణీని ఆపేసిన కూటమి సర్కారు ఇకపై రేషన్ షాపుల ద్వారానే కోటాను పంపిణీ చేయనుంది. జూన్‌ నుంచి ఇకపై సరకులు షాపుల వద్దే పంచి పెట్టనున్నారని దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. మొబైల్ డిస్ట్రిబ్యూషన్ టైంలో ఈపోస్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ను తొలగించారు. ఇప్పుడు దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చిన కూటమిప్రభుత్వం దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌తో కలిసి నాదెండ్ల మనోహర్‌ విజయవాడలోని మధురానగర్‌ రేషన్ డిపోను సందర్శించారు. పంపిణీ విధానం తెలుసుకున్నారు. సాఫ్ట్‌వేర్ సక్రమంగా పనిచేస్తుందో లేదో టెస్టు చేశారు. 

ఈపోస్ లాగిన్ నుంచి సరకుల పంపిణీ వరకు జరిగే ప్రక్రియను పరిశీలించారు నాదెండ్ల మనోహర్. కార్డు నెంబర్ ఎంట్రీ, వేలిముద్రలు, కంటిపాల ద్వారా సరకుల అందజేత అన్నింటినీ చూశారు. ప్రజల సౌకర్యం అంటూ తీసుకొచ్చి వాహనాల ద్వారా ఎక్కువ పక్కదారి పట్టిందని మంత్రి తెలిపారు. ప్రజలకు సౌకర్యంగా లేకపోగా ప్రభుత్వంపై అధికంగా భారం కూడా పడుతుందని అన్నారు. అసలు ఆ వాహనాలు ఎప్పుడు వచ్చి సరకులు ఇస్తాయో కూడా తెలిసేది కాదన్నారు. అన్నింటిని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. 

ఇప్పటి వరకు వాహనం కోసం రోడ్లపై పడిగాపులు కాసేవాళ్లని ఇప్పుడు ఆ ఇబ్బంది లేదన్నారు మంత్రి నాదెండ్ల. రేషన్ షాపు వద్దకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చని అన్నారు. 15వ తేదీ వరకు ఏరోజైనా వెళ్లొచ్చని అన్నారు. 65 ఏళ్లు దాటిన ఒంటరి వృద్ధులు, వికలాంగుల, భార్యభర్తలు ఇద్దరూ వృద్ధులైతే వారి ఇంటికే సరకులు పంపిణీ చేస్తారని మంత్రి వెల్లడించారు. ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అన్నారు. వేరే ప్రాంతాల్లో ఉన్న వారు కూడా పోర్టబిలిడీ విధానంలో రేషన్ సరకులు పొందొచ్చని మంత్రి పేర్కొన్నారు. రేషన్ సరకుల పంపిణీలో చాలా అక్రమాలు జరిగాయని వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు మంత్రి ప్రకటించారు. దీని కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించామని అన్నారు. ఈ యాప్ ద్వార కార్డుదారులతోపాటు డీలర్ వివరాలు తెలుస్తాయని అన్నారు. ప్రస్తుతం యాప్ ద్వారా రేషన్ దుకాణం వద్ద ఎంత మంది జనం ఉన్నారో కూడా తెలిసిపోతుందని తెలిపారు. 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఇంటి వద్దకే రేషన్ కోసం ప్రత్యేకంగా మొబైల్ వాహనాలను ప్రవేశపెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానంపై సమీక్ష చేపట్టింది. రద్దు చేయాలని నిర్ణయించింది. వాహనాల ద్వారా ఇంటికే సరకులు పంపిణీ చేయడంతో ప్రజాపంపిణీ వ్యవస్థ గాడి తప్పిందని అధికారులు అభిప్రాయపడ్డారు. వాహనాలు వచ్చినప్పుడు లబ్ధిదారులు ఇంట్లో లేకపోవడం, మరోసారి వాహనం రాకపోవడంతో రేషన్ కోల్పోతున్నారు. ఇది కొందరికి అసౌకర్యంగా మారింది. దీనికి తోడు నిర్వహణ ఖర్చు కూడా చాలా అవుతుందని, ఖర్చు అయినా అసలు లక్ష్యం నెరవేరడం లేదన్నది ప్రభుత్వ వాదన. అందుకే పాత పద్ధతిలోనే రేషన్ షాపుల్లోనే పంపిణీ చేయాలని నిర్ణయించారు. 

టాప్ హెడ్ లైన్స్

Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Embed widget