అన్వేషించండి

CPS Cancelation: సీపీఎస్‌ రద్దు అంశంపై కీలక అడుగు- ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు

సీపీఎస్‌ రద్దు అంశంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఉద్యోగా సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. దీన్ని గ్రహించిన ప్రభుత్వం... చర్చలు ప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు వీలుగా ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సమస్య కోసం కమిటీ వేస్తున్నట్టు 716 నెంబర్‌ జీవో ద్వారా ప్రభుత్వం ప్రకటించింది. ఈకమిటీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి,  విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉంటారు. వీళ్లే ఉద్యోగ సంఘాలతో చర్చించి సీపీఎస్‌ రద్దు అంశంపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. తుది నివేదిక సమర్పించడానికి ఎలాంటి గడవులు పెట్టలేదు. 

కమిటీ ఏర్పాటైన గంటల వ్యవధిలోనే ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశమైంది. సీపీఎస్‌ రద్దు అంశంపై చర్చించింది. 
అమరావతిలోని సచివాలయం చర్చలు జరిగాయి. ఈ భేటీకి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్,  ప్రభుత్వ సలహాదారు పి.చంద్రశేఖర్ రెడ్డి కూడా హాజరయ్యారు. 

ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఆర్ సూర్యనారాయణ, ఏపీ పీఆర్టీయూ అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య, ఏపీయుటిఎఫ్ అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు, ఏపిటిఎఫ్ అధ్యక్షుడు హృదయ రాజు పాల్గొన్నారు. 

సీపీఎస్‌ రద్దు కోరుతూ యూటీఎఫ్ నేతలు, ఉపాధ్యాయుల ఇచ్చిన చలో విజయవాడను భగ్నం చేశారు పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఉపాధ్యాయులను అరెస్టులు చేశారు. గృహనిర్బంధంలో ఉంచారు. సీఎం ఇంటి చుట్టూ ముళ్ల కంచెలు పెట్టారు. మారువేషాల్లో వస్తారని గ్రహించి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జల్లెడ పట్టారు. 

విజయవాడ మొత్తం పోలీసు వలయంలో చిక్కుకుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna) మండిపడ్డారు. ఏపీలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? పోలీసు రాజ్యమా? అని ప్రశ్నించారు. విజయవాడను పోలీసు వలయంలో ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏపీలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? పోలీసు రాజ్యమా? అని అడిగారు. శాంతియుత నిరసనలకూ అనుమతించకపోవడం దుర్మార్గం అన్నారు. విజయవాడ బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో ముళ్లకంచెలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్‌ రద్దు (CPS Cancel) చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పారని, మడమ తిప్పారని సెటైర్ వేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపడం దారుణం అని రామకృష్ణ అన్నారు.

ఎక్కడికక్కడ అరెస్టులు.. 
సీపీఎస్ రద్దును డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయులు, యూటీఎఫ్ సంఘాలు సీఎంవో ముట్టడి (UTF Chalo AP CMO)కి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పోలీసులు గుంటూరు-విజయవాడ మార్గంలో పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. నిన్నటి నుంచే పలు జిల్లాల్లో ఉపాధ్యాయులను నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులు ఎవరూ తాడేపల్లి వైపు వెళ్లకుండా నిఘా పటిష్టం చేసిన పోలీసులు ఆర్టీసీ బస్సులను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్నారు. జంగారెడ్డిగూడెం డిపో నుంచి విజయవాడ వెళ్లే బస్సులు సైతం రద్దు చేశారు. ఉపాధ్యాయుల సెలవులను సైతం రద్దు చేస్తూ ఛలో సీఎంవోను అడ్డుకునే ప్రయత్నం జరిగిందంటూ ఉపాధ్యాయులు ఆరోపించారు.

యూటీఎఫ్ నేతలు ఆగ్రహం..
తాము విజయవాడ వెళ్లకుండా చూసేందుకే బస్సులు రద్దు చేస్తున్నారని యూటీఎఫ్ నేతలు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా తాము చేస్తున్న నిరసనను అడ్డుకునేందుకు విజయవాడ బస్సులు రద్దు చేయడంతో సామాన్య ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉపాధ్యాయులు ఎవరూ తాడేపల్లి వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారని, గుర్తింపు కార్డులు తనిఖీ చేసి తాడేపల్లి వైపు వెళ్తున్న 40 మంది ఉపాధ్యాయులు అరెస్టు చేశారని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద సైతం మరికొందరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్
Nara Lokesh On Women Reservation: రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
TDP Mahanadu 2026: నేటి నుంచి 2 రోజులపాటు టీడీపీ మహానాడు.. ఈసారి అజెండా, తీర్మానాలు, ప్రత్యేకతలు ఇవే
నేటి నుంచి 2 రోజులపాటు టీడీపీ మహానాడు.. ఈసారి అజెండా, తీర్మానాలు, ప్రత్యేకతలు ఇవే
DAY NRLM Scheme: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల లోన్.. వడ్డీ రాయితీ కూడా!
డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల లోన్.. వడ్డీ రాయితీ కూడా!

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gandhi Bhavan Fight: గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే !
గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే ! వీడియో
Madhura Sreedhar Reddy: సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
Remote Robotic Surgery : హైదరాబాద్‌లో రోగికి చైనా నుంచి ఆపరేషన్.. రోబోటిక్ టెలిసర్జరీతో చరిత్ర సృష్టించిన వైద్యులు
హైదరాబాద్‌లో రోగికి చైనా నుంచి ఆపరేషన్.. రోబోటిక్ టెలిసర్జరీతో చరిత్ర సృష్టించిన వైద్యులు
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Pune Porsche Crash Case: పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
Battery as a Service India: ఈవీ మార్కెట్‌లో కొత్త
ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"! సగం ధరకే విద్యుత్‌ కార్లు! నిజంగానే ఇది సామాన్యుడికి వరమేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Embed widget