By: ABP Desam | Updated at : 03 Jul 2022 04:00 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
టీడీపీ అధినేత చంద్రబాబు(ఫైల్ ఫొటో)
Chandrababu Letter : సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారిపై సీఐడీ వేధింపులకు గురిచేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. టీడీపీ కార్యకర్తలు గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను సీఐడీ అధికారులు అక్రమంగా అదుపులోకి తీసుకుని వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి అక్రమంగా చొరబడి నోటీసుల పేరుతో వేధించారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఇంట్లోకి చొరబడి టీడీపీ కార్యకర్తల కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో బట్టలు లేకుండా కూర్చోబెట్టి విచక్షణారహితంగా దాడి చేయడం దారుణమన్నారు.
సీసీ కెమెరాలు తీసేసి
అలాగే విచారణ చేస్తున్న సమయంలో గదిలో సీసీ కెమెరాలు లేకుండా చేసి దాడి చేశారని చంద్రబాబు అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సీఐడీ అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు. ప్రతిపక్షాల కార్యకర్తలు, నేతలను వేధించేందుకు ప్రభుత్వం సీఐడీని ఉపయోగిస్తుందని ఆరోపించారు. ప్రతిపక్షాలపై వైసీపీ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలను అక్రమంగా అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బెదిరింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులను కుట్రపూరితంగా వేధిస్తున్న సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు అండగా నిలబడాలని డీజీపీని చంద్రబాబు లేఖలో కోరారు.
అర్థరాత్రిళ్ళు గోడలు దూకివెళ్ళడం, గునపాలతో గొళ్ళెం పగలగొట్టి ఇళ్లలోకి చొరబడటం, ఇంట్లోని మనుషుల్ని ఎత్తుకెళ్ళడం వంటి దోపిడీ దొంగల సంస్కృతిలోకి రాష్ట్ర పోలీసులు వెళ్లడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.(1/4) pic.twitter.com/eAynD20HFZ
— N Chandrababu Naidu (@ncbn) June 30, 2022
తప్పుడు కేసులు
ఏపీలో పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు శుక్రవారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ అధికారుల వికృత చేష్టలు పరాకాష్టకు చేరాయని మండిపడ్డారు. సోషల్ మీడియా పేరు చెప్పి తప్పుడు కేసులు బనాయించి ప్రతిపక్షాల కార్యకర్తలు, నేతలను హింసిస్తున్నారని ఆరోపించారు. కొంత మంది పోలీసు అధికారులు పరిధి దాడి వ్యక్తులను టార్చర్ చేస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇంతటి దారుణాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ కార్యకర్తలు వెంకటేశ్, సాంబశివరావు విషయంలో సీఐడీ అధికారుల తీరు అమానుషమన్నారు. అలాంటి అధికారులను వదిలిపెట్టనని చంద్రబాబు హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు కేసులు పెడితే ఎవరినీ సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
Also Read: Seediri Appalaraju: ఏపీ మంత్రి అప్పలరాజు రూటే సపరేటు - మీరు మారిపోయారు సార్ అంటున్న మద్దతుదారులు
Also Read : Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్కు సీఎం జగన్పైనే తొలి ఫిర్యాదు !
Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!
Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు
Breaking News Telugu Live Updates: కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి
Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి
CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!
Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి