అన్వేషించండి

Chandrababu on Jagan: ఇంకా నయం వాటికన్ అనలేదు - వైసీపీలో అందరూ సైకోలే - చంద్రబాబు సైటైర్లు

Amaravati: అమరావతికి రెండు లక్షల కోట్లు కావాలని ప్రచారం చేస్తున్నారని.. కానీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుకు నిధులెందుకని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Chandrababu Naidu  :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతం కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవమని ఆయన స్పష్టం చేశారు.   రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఐదేళ్లుగా మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిన జగన్, ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ నోట అమరావతి అనే పేరు రాకపోవడం ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని, రాష్ట్ర రాజధాని పేరు పలకడానికి కూడా ఇష్టపడని వ్యక్తికి ప్రజలే బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, సూరేపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు.  

జగన్ ఇటీవల ప్రస్తావించిన  మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు మావిగన్  అనే పదాన్ని చంద్రబాబు ఎద్దేవా చేశారు.  మావిగన్ అని ఏవేవో వింత పేర్లు తెస్తున్నారు.. ఇంకా నయం వాటికన్  అని అనలేదు. అసలు మావిగన్ అంటే అర్థం ఏంటో నిఘంటువుల్లో వెతికినా దొరకదు అంటూ సెటైర్లు వేశారు. గతంలో జగన్ ఒక్కడే సైకో అని భావించామని, కానీ ఇప్పుడు వైసీపీ నేతలందరూ అలాగే తయారయ్యారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ శ్రేణులు కూడా తర్కం లేకుండా జగన్ మాటలను వెనకేసుకొస్తున్న తీరు విచారకరమని అన్నారు. అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా జగన్ ఇంకా కుట్రలు పన్నుతూనే ఉన్నారని, కానీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి నిర్మాణం ఆగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

మీడియా పట్ల వైసీపీ అనుసరిస్తున్న తీరుపై కూడా సీఎం మండిపడ్డారు. జగన్ తప్పులను ఎత్తిచూపిన మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై దాడులు చేయడం అరాచకత్వానికి పరాకాష్ట అని అన్నారు. సోషల్ మీడియాలో కూడా అసభ్యకరమైన పోస్టులతో రాజకీయ ప్రత్యర్థులను వేధించడం వైసీపీకి పరిపాటిగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇకపై ఇలాంటి సైకో ం చేష్టలు సాగనివ్వమని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు.  

అమరావతి కోసం 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతుల త్యాగం వృధా పోదని, రాబోయే రోజుల్లో అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజధాని విషయంలో గత ఐదేళ్ల అనిశ్చితికి తెరపడిందని, అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందని భరోసా ఇచ్చారు. జగన్ ఇప్పటికైనా తన పంథా మార్చుకోవాలని, లేదంటే ప్రజలు మరింతగా తిరస్కరిస్తారని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

SIT on Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
YS Jagan Supporting Accused: జగన్ పొలిటికల్ వ్యూహం రివర్స్? లిక్కర్ స్కామ్‌లో సైలెన్స్.. ఆ నిందితులకు భరోసా! ఎందుకలా?
జగన్ పొలిటికల్ వ్యూహం రివర్స్? లిక్కర్ స్కామ్‌లో సైలెన్స్.. ఆ నిందితులకు భరోసా! ఎందుకలా?
Pawan Kalyan Political Graph AP: అటైనా .. ఇటైనా పవనే సెంటర్ పాయింట్ - ఏపీ రాజకీయాల్లో అసలైన పవర్ స్టార్ - జగన్ టార్గెట్ చేయడమే లాభిస్తోందా?
అటైనా .. ఇటైనా పవనే సెంటర్ పాయింట్ - ఏపీ రాజకీయాల్లో అసలైన పవర్ స్టార్ - జగన్ టార్గెట్ చేయడమే లాభిస్తోందా?
West Godavari Crime News: పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
Advertisement

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Incharge Controversy: మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
Iron And Vitamin B12 Deficiency : మహిళల్లో ఐరన్, B12 లోపానికి ప్రధాన కారణాలు.. లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే
మహిళల్లో ఐరన్, B12 లోపానికి ప్రధాన కారణాలు.. లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే
SA W Defeats IND W T20 World Cup: ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
West Godavari Crime News: పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
Green Tea : ప్రతిరోజూ గ్రీన్ టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి మేలా.. కీడా? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
ప్రతిరోజూ గ్రీన్ టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి మేలా.. కీడా? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
NCRB Report: తెలంగాణ పోక్సో కేసుల్లో బంధువులే రాబందులు.. ! రోజుకు ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు
తెలంగాణ పోక్సో కేసుల్లో బంధువులే రాబందులు.. ! రోజుకు ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Embed widget